Delhi Murder Case: ఢిల్లీ హత్య కేసు నిందితుడికి మరణశిక్ష విధించాలి… ఢిల్లీ పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Murder Case: ఢిల్లీలోని షహబాద్ డైరీ ప్రాంతంలో 16 ఏళ్ల బాలిక హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష విధించాలని ఢిల్లీ పోలీసులు కోరుతున్నారు. నిందితుడు సాహిల్కు వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరించి 640 పేజీల ఛార్జ్ షీట్ను దాఖలు చేశారు. నిందితుడు సాహిల్కు మరణశిక్ష విధించేలా వాటర్టైట్ కేసును సిద్ధం చేసినట్టు పోలీసులు తెలిపారు. షహబాద్ డెయిరీ ప్రాంతంలో 16 ఏళ్ల బాలిక హత్య పక్కా ప్రణాళికతో జరిగిందని, నిందితుడికి మరణశిక్ష పడేవిధంగా వాటర్టైట్ కేసు పెట్టామని ఢిల్లీ పోలీసులు గురువారం చెప్పారు. ఇది పక్కా ప్రణాళికతో, పగతో జరిగిన హత్య కేసని.. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని మరియు ఘటన జరిగిన నెల రోజుల్లోనే బాధితురాలి కుటుంబానికి న్యాయం చేసేందుకు చార్జిషీటును సమర్పించినట్టు స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ( లా అండ్ ఆర్డర్) దేవేంద్ర పాఠక్ తెలిపారు.
Read also: Comedian Satya: ‘రంగబలి’ కోసం ‘సత్యబలి’.. వాళ్లలో ఎవరినీ వదల లేదుగా!
Also Read
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి హత్యకేసులో సీరియస్గా దర్యాప్తును నిర్వహించి, రికార్డు సమయంలో కోర్టు ముందు ఛార్జ్ షీట్ దాఖలు చేశాం. నిందితుడికి కఠిన శిక్ష పడేలా కేసును వీలైనంత నీరుగారకుండా ఉండేందుకు ప్రయత్నించామన్నారు. మే 28న వాయువ్య ఢిల్లీలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో మైనర్ బాలికను ప్రజలు చూస్తుండగా హత్య చేసిన నిందితుడు సాహిల్పై పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.
పోక్సో సెక్షన్ 12 (పిల్లలపై లైంగిక వేధింపులు) మరియు షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టంలోని సెక్షన్ల కింద 640 పేజీల ఛార్జిషీట్ను మంగళవారం పోక్సో కోర్టులో దాఖలు చేసినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి.
Read also: Vj Sunny : తన కొత్త పార్టీ పేరును ప్రకటించిన సన్నీ..
నిందితుడిపై ఆయుధాల చట్టంలోని నిబంధనలతో పాటు IPC సెక్షన్లు 302 (హత్య), 354 A (లైంగిక వేధింపులు) మరియు 509 (మహిళ యొక్క అణకువను కించపరిచేలా ఉద్దేశించిన పదం, సంజ్ఞ లేదా చర్య) కింద కూడా అభియోగాలు మోపారు. ఈ భయానక హత్య దృశ్యాలు CCTV కెమెరాలో ఉన్నాయని.. ఫుటేజీలో యువకుడు కత్తితో బాలికపై 20 సార్లు కంటే తక్కువ కాకుండా అనేక మంది వ్యక్తులు చూస్తుంతడగానే హత్య చేశాడు. ఆమెను రక్షించడానికి ఎవరూ జోక్యం చేసుకోలేదు. ఆమె శరీరంపై 34 గాయాల గుర్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. సాహిల్ను మే 29న ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో అరెస్టు చేశారు. సాహిల్, సాక్షికి పరిచయం ఉన్నప్పటికీ తరచూ గొడవలు జరిగేవని విచారణలో తేలినట్టు పోలీసులు తెలిపారు. మే 27న ఇద్దరికీ గొడవ జరిగిందని.. ఆ తర్వాత సాహిల్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు .. మరుసటి రోజు ఆమెను దారుణంగా హత్య చేశాడు.
తాజావార్తలు
-
Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్చరణ్
-
Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
-
Delhi High Court: ఊపిరాడక చనిపోవాల్సి వస్తుంది.. ‘దేవుడే కాపాడాలి’.. ఢిల్లీ పరిస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన
-
Petrol-Diesel: పెట్రోల్లో ఇథనాలు, డీజిల్లో ఐసోబ్యుటానాల్.. కేంద్రం మరో నిర్ణయం.!
-
Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!