Goa Crime: దారుణం.. గోవా పర్యటనకు వెళ్లిన ఢిల్లీ ఫ్యామిలీపై కత్తులతో దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Family Brutally Attacked by Goa Resort Staff With Knives: గోవాలో దారుణం చోటు చేసుకుంది. సరదాగా కాలక్షేపం చేద్దామని గోవాకి వచ్చిన ఢిల్లీ కుటుంబంపై.. ఒక దుండగుల ముఠా కత్తులతో దాడి చేసింది. అంజునా ప్రాంతంలోని ‘స్పాజియో లీజర్’ రిసార్టులో ఈ ఘోరం వెలుగు చూసింది. ఈ దాడి విషయాన్ని బాధితుడు జతిన్ శర్మ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. తమపై దాడి జరగడానికి ముందు.. హోటల్ సిబ్బందితో గొడవ జరిగిందని అతడు తెలిపాడు. తమ పట్ల సిబ్బంది అనుచితంగా ప్రవర్తించడంతో.. వారిపై తాము హోటల్ మేనేజర్కు ఫిర్యాదు చేశామని, ఆయన వెంటనే సిబ్బందిని తొలగించాడని పేర్కొన్నాడు. అనంతరం తమ కుటుంబం హోటల్లోని స్విమ్మింగ్ పూల్ వద్ద సేదతీరుతుండగా.. కొందరు వ్యక్తులు గేటు వద్ద గుడిగూడి ఉండటాన్ని గమనించామన్నారు. ఆ గుంపులో.. హోటల్లో ఉద్యోగం కోల్పోయిన ఓ వ్యక్తి కూడా ఉన్నాడని చెప్పాడు. ఈ క్రమంలోనే ఆ దుండగులు తమపై కత్తులతో విరుచుకుపడ్డారని వెల్లడించాడు. ఈ దాడిలో జతిన్కి, అతని తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు.
Minister Abdul Sattar: రైతు ఆత్మహత్యలు కొత్తేమీ కాదు.. ‘మహా’మంత్రి సంచలన వ్యాఖ్యలు
Also Read
- Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జతిన్పై ఆ దుండగులు దాడి చేస్తున్న సమయంలో.. ఒక మహిళ తమని కాపాడాలంటూ ఆర్తనాదాలు చేసింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని, 324 సెక్షన్పై కేసు నమోదు చేశారు. షాకింగ్ విషయం ఏమిటంటే.. కొద్దిసేపటి తర్వాత ఆ నిందితుల్ని పోలీసులు విడుదల చేశారు. మరోవైపు.. ఈ ఘటనపై గోవా ముఖ్యమంత్రి డా.ప్రమోద్ సావంత్ తీవ్రంగా స్పందించారు. ఈ దాడిని ఖండించిన ఆయన.. దీని వెనుక కొన్ని సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని ఆరోపించారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని హెచ్చరించిన ఆయన.. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగడంతో.. ఎఫ్ఐఆర్కి ఐపీసీ సెక్షన్ 307ని పోలీసులు జోడించారు. విడుదల చేసిన నిందితుల్లో ముగ్గురిని మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. కేవలం ఆ ఫ్యామిలీతో జరిగిన చిన్న గొడవ కారణంగా.. ప్రతీకారం తీర్చుకునేందుకు ఆ దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
Lufthansa Turbulence: విమానంలో కుదుపులు.. 37 వేల నుంచి 4 వేల అడుగులకి ఢమాల్
తాజావార్తలు
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
-
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
-
New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
-
Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!