Minister Abdul Sattar: రైతు ఆత్మహత్యలు కొత్తేమీ కాదు.. ‘మహా’మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers Suicide Not New Says Maharashtra Agriculture Minister Abdul Sattar: రైతు ఆత్మహత్యలు కొత్తేమీ కాదని, కొన్నేళ్లుగా ఈ ఘటనలు జరుగుతున్నాయని మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అబ్దుల్ సత్తార్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఔరంగాబాద్ జిల్లాలోని సిలోద్ నియోజకవర్గంలో.. రైతు ఆత్మహత్యలకు మీడియా ప్రశ్నించినప్పుడు, ఈమేరకు మంత్రి సమాధానం ఇచ్చారు. ‘‘రైతు ఆత్మహత్యల సమస్య అనేది కొత్తేమీ కాదు. చాలా సంవత్సరాల నుంచి ఈ సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే.. నా నియోజకవర్గంతో పాటు మొత్తం మహారాష్ట్రలో ఎక్కడా రైతుల ఆత్మహత్యలు జరగకూడదని నేను కోరుకుంటున్నాను’’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
Lufthansa Turbulence: విమానంలో కుదుపులు.. 37 వేల నుంచి 4 వేల అడుగులకి ఢమాల్
Also Read
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
ఇదిలావుండగా.. స్థానిక పోలీసుల వివరాల ప్రకారం మార్చి 3 నుంచి 12వ తేదీ మధ్య సిలోద్లో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఔరంగాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే.. మొత్తం ఆరుగురు రైతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానిక కథనాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే రైతు ఆత్మహత్యలపై మీడియా వాళ్లు ప్రశ్నించగా.. ఆయన పై విధంగా స్పందించారు. అంతేకాదు.. రైతు ఆత్మహత్యల పరిష్కారం కోసం వ్యవసాయ శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. గత వారంలో భారీ వర్షాలు పడటంతో తీవ్ర పంట నష్టం వాటిల్లగా.. దాన్ని పరిశీలించేందుకు మంత్రి ఆదివారం పర్యటించారు. కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం.. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
LPG Gas Cylinder: ప్రజలకు సర్కార్ బంపరాఫర్.. గ్యాస్ ధరపై రూ.300 తగ్గింపు
‘‘రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. వారికి కేవలం ఒక్క రూపాయికే పంటల బీమా ఇస్తున్నాం’’ అంటూ మంత్రి సత్తార్ పేర్కొన్నారు. మరోవైపు.. మార్చి 9న ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో ఏక్నాథ్ షిండే-బీజేపీ ప్రభుత్వం రైతులకు రూ. 6,000 సహాయంతో పాటు రూ. 1 పంట బీమా పథకాన్ని ప్రతిపాదించింది. అటు.. గత రెండు నెలలుగా పంట ధరలు పడిపోతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న ఉల్లి రైతులకు, పెద్ద ఉపశమనంగా సీఎం ఏక్నాథ్ షిండే సోమవారం క్వింటాల్కు రూ. 300 ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. అయితే.. ప్రతిపక్షాలు మాత్రం రూ.500 నుంచి రూ.700 వరకు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Jai Moondra: రెండు మ్యాచ్లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
Unbeaten Directors of Tollywood : ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుల సినిమాలపై భారీ అంచనాలు
-
Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ ‘ఈత’ సినిమాకు ఊహించని చిక్కు.. కోర్టు మెట్లు ఎక్కనున్న కుటుంబం
-
Pawan Kalyan : ఓవర్ స్పీడ్లో దూసుకెళ్తున్న OG 2
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!