Mumbai Crime: తెలంగాణలో విషం కొంది.. ఫ్యామిలీ మొత్తాన్ని లేపేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Crime: భరిస్తున్నారు కదా అని బాధపెడితే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే విసిగిపోయిన మనసు మనిషి ఆలోచలను వికృతంగా మారుస్తుంది. ముంబయి లోని ఓ కుటుంబంలో జరిగిన వరుస హత్యలే ఇందుకు నిదర్శనం. వివరాలలోకి వెళ్తే.. మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లాలో శంకర్ కుంభరే, విజయ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమారుడు రోషన్ సంఘమిత్ర అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాగా 5 నెలల క్రితం సంఘమిత్ర తండ్రి ఆత్మ హత్య చేసుకుని మరణించారు . తండ్రి మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న సంఘమిత్రకి అత్తింటి వేధింపులు ఎక్కువైయ్యాయి. ఓ వైపు తండ్రిని కోల్పోయిన బాధ. మరో వైపు అంతింటి వేధింపులతో విసిగిపోయిన సంఘమిత్ర క్రూరంగా మారిపోయింది. ఎంతగా అంటే భర్తతో సహా అంతింటి వాళ్ళందరిని చంపెయ్యాలని నిర్ణయించుకుంది. ఇంతలో తనకి రోసా అనే మహిళతో స్నేహం ఏర్పడింది.
Read also:Israeli–Palestinian Conflict: గాజాకు ఈజిప్ట్ సహాయం..
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
ఈ నేపథ్యంలో తెలంగాణ నుండి విషం కొనుగోలు చేసింది సంఘమిత్ర. ఆ విషాన్ని నీటిలో కలిపి అత్తింటి వారికి ఇచ్చింది. మొదట సెప్టెంబర్ 20వ తేదీన శంకర్ కుంభరే, అతని భార్య విజయ అనారోగ్యం పాలయ్యారు. కాగా సెప్టెంబర్ 26వ తేదీన శంకర్ మరణించగా మరుసటి రోజు అతని భార్య విజయ మృతి చెందింది. అనంతరం శంకర్ కుమార్తెలు కోమల్, ఆనంద , కుమారుడు రోషన్ ఆరోగ్యం విషమించింది. ఈ నేపథ్యంలో ఆక్టోబర్ 8వ తేదీన కోమల్, 14వ తేదీన ఆనంద, 15వ తేదీన రోషన్ మరణించారు. తల్లిదండ్రులను చూడడానికి ఢిల్లీ నుండి వచ్చిన శంకర్ పెద్ద కుమారుడు సాగర్ కూడా అనారోగ్యం పాలయ్యాడు, అలానే సాగర్ కార్ డ్రైవర్, శంకర్ వాళ్ళని చూడడానికి వచ్చిన బంధువు కూడా అనారోగ్యానికి గురైయ్యారు. దీనితో ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలల్లో కలకలం రేపింది.
Read also:Off The Record: సీఎం జగన్ తో ఆ మాజీ మంత్రి మీట్ అయ్యేది అందుకేనా…?
ఈ నేపథ్యంలో పోలీసులు 4 బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు నిజం వెలుగు చూసింది. అత్తింటి వాళ్ళ ఆరళ్లకు విసుగ్గు చెందిన ఆయింటి చిన్న కోడలు సంఘమిత్ర, స్నేహితురాలు రోసా తో కలిసి అత్తింటివారిని హతమార్చింది. అయితే ప్లాన్ ప్రకారమే తన భర్తకు రావాల్సిన ఆస్థిని ముందుగానే తన పేరు మీద రాయించుకుంది. అనంతరం హత్యలు చేయడం ప్రారంభించింది. కోడలి కక్షకు 3 వారాలలో 5 మంది పండుటాకుల్లా రాలిపోయారు.
తాజావార్తలు
-
Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
-
Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!