Uttar Pradesh: దళిత మహిళపై సామూహిక అత్యాచారం.. బీఫ్ తినాలంటూ బలవంతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఒక దళిత మహిళపై ఇద్దరు ముస్లిం యువకులు దురాగతానికి ఒడిగట్టారు. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రంలోని బరేలీ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఓ దళిత మహిళకు ఇద్దరు ముస్లిం యువకులు మత్తుమందు ఇచ్చి బలవంతంగా గొడ్డు మాంసం తినిపించి అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘోరంలో బాధితురాలి స్నేహితురాలైన ఓ ముస్లిం మహిళ కూడా పాలుపంచుకుంది.
బాధితురాలిని ఆమె స్నేహితురాలు ఓ హోటల్ కి రమ్మని పిలిచింది. అక్కడే ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను బీఫార్మ్ విద్యార్థి షోయబ్, బార్బర్ గా పనిచేస్తున్న నజీమ్ గా గుర్తించారు. ఈ మొత్తం అత్యాచార ఘటనను సెల్ ఫోన్ లో చిత్రీకరించి రూ. 5 లక్షలు ఇవ్వాలని నిందితులు, బాధిత మహిళను బ్లాక్మెయిల్ చేశారు.
Also Read
- Bolla Kiran : గంజాయి ముఠా గుట్టురట్టు.. బొల్లా కిరణ్ దారుణాలు వెలుగులోకి..
- Kurnool Intiyaz M*ur*der Case: కర్నూలు టీడీపీ కార్యకర్త హత్యలో ట్విస్ట్.. ఇంతియాజ్ చివరి వీడియో వైరల్
- Woman Head Constable Mu*rd*er: మహిళా హెడ్ కానిస్టేబుల్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానం..
- Chamoli Tunnel Accident: చమోలీ సొరంగం ప్రమాదం.. 7 మంది కార్మికులు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
Read Also: PM Modi-Biden Meet: బైడెన్కి ప్రధాని విందు.. జెట్ ఇంజన్లు, న్యూక్లియర్ టెక్నాలజీపై చర్చలు..
ఈ ఘటన అనంతరం చిత్రీకరించిన వీడియోను బాధితురాలి భర్తకు పంపారు. నిందితులిద్దరు కాశ్మీర్ పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ ఘటన గురించి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు తన ముస్లిం స్నేహితురాలి నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకుంది. ఆ డబ్బును రిటన్ ఇవ్వాలని అనుకుంది. సెప్టెంబర్ 2న నిందితురాలు ఆమెను ఓ కేఫ్ కి పిలిచింది. అక్కడే ఇద్దరు యువకులు ఉన్నారు. ఆ తర్వాత బాధిత మహిళను ఓ హోటల్ కి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Monsoon Alert: ఆగస్టులో భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో వరస అల్పపీడనాలు..
-
Uber-Rapido Merge: ఉబర్, రాపిడో విలీనం..? రవాణా రంగంలో ఊహించని ట్విస్ట్…
-
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక నిర్ణయం..
-
Ajit Doval: ‘పహల్గామ్ దాడి తర్వాత మోడీ అడిగిన ప్రశ్న ఇదే’.. అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు
-
Bolla Kiran : గంజాయి ముఠా గుట్టురట్టు.. బొల్లా కిరణ్ దారుణాలు వెలుగులోకి..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!