Cyber Crime: పిల్లలకు మీ మొబైల్ ఫోన్ ఇస్తున్నారా..? ఇలా కూడా జరగొచ్చు..!
- బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో సైబర్ మోసం..
- తన తల్లి ఫోన్ లో లింక్ ఓపెన్ చేసిన చిన్నారి..
- చిరు వ్యాపారి అయిన మహిళా ఖాతా నుంచి రూ.4 లక్షలు మాయం..
Cyber Crime: ఇంట్లో వాళ్ల ఫోన్లు.. పెద్దవాళ్ల కంటే.. పిల్లల దగ్గరే ఎక్కువగా ఉంటున్నాయి.. పేరెంట్స్ ఇంట్లో అడుగు పెట్టారంటే చాలు.. వెంటనే వారి దగ్గర నుంచి స్మార్ట్ఫోన్లు లాగేస్తున్నారు చిన్నారులు.. స్మార్ట్ఫోన్లలో గేమ్స్.. రీల్స్.. వీడియోలు.. ఇలా ఫోన్లలోనే కాలక్షేపం చేస్తున్నారు.. అయితే, వాళ్లు ఆడుకోవడానికి ఎన్నో గేమ్స్ డౌన్లోడ్ చేస్తున్నారు.. ఇదే మీకు పెద్ద ముప్పు తెచ్చిపెట్టే ప్రమాదం లేకపోలేదు.. ఆ సమయంలోనే సైబర్ నేరగాళ్లు ఉచ్చులో చిక్కుకునే ప్రమాదం కూడా ఉందనే ఓ ఘటన వెలుగు చూసింది.. సైబర్ నేరగాళ్లు రకరకాల ఆధునిక పద్ధతుల్లో అమాయక ప్రజల నుంచి డబ్బు లాగేందుకు అనేక మోసాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలోనే బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో ఓ మహిళా సైబర్ నేరగాళ్ల బారినపడింది.
Read Also: Telangana Thalli Statue: సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
Also Read
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
వేటపాలెం మండలం కటారివారిపాలెం కు చెందిన కాటంగారి అనిత.. చిరు వ్యాపారి.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకొని నాలుగు లక్షల రూపాయల నగదును పోగొట్టుకుంది. చిరు వ్యాపారం చేసుకుంటూ కాస్తంత బిజీగా వుండే సమయంలో అనిత తన మొబైల్ ఫోన్ ను ఇంట్లోని తనకూతురుకి ఇచ్చింది. సరదాగా ఫోన్ చూస్తున కూతురు తెలిసో.. తెలియకో.. అందులోని సైబర్ నేరగాళ్ల పంపిణి ఓ లింక్ ను ఓకే చేసింది. అప్పటికై కాచుకొని కూర్చున్న సైబర్ నేరగాళ్ల వాళ్ళపని వాళ్లు చేసుకుపోయారు.. ఇక ఈక్రమంలో సదరు మహిళకు వేటపాలెంలోని యూనియన్ బ్యాంకు ఖాతాలో వున్నా నాలుగు లక్షల రూపాయల నగదును విడతల వారీగా.. ఈ ఏడాది ఆగస్టు 18వ తేదీ నుండి సెప్టెంబర్ 24వ తేదీ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు ఈ మొత్తం నగదును అపహరించారు. దీంతో మోసపోయామని తెలుసుకున్న సదరు బాధితురాలు వేటపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పిల్లలకు ఫోన్లు ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తు్న్నారు పోలీసులు..
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో