CMRF Fraud : సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్మాల్ కేసు.. మరో ఇద్దరు అరెస్టు
- సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్మాల్ కేసులో మరో ఇద్దరు అరెస్టు
- ఇప్పటివరకు మొత్తం 19 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- నకిలీ లబ్ధిదారుల ఖాతాల్లోకి మళ్లిన చెక్కులు
- మాజీ మంత్రి కార్యాలయంలో పనిచేసిన నరేశ్పై కీలక ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CMRF Fraud : హైదరాబాద్లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్మాల్ కేసు దర్యాప్తులో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైనవారు పగడాల శ్రీనివాసరావు (22), యాస వెంకటేశ్వర్లు (50)గా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో పెద్ద ఎత్తున అరెస్టులు జరిగాయి. సెప్టెంబర్ 19న జూబ్లీహిల్స్ పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో పొట్ల రవి, జంగమ నాగరాజు, మటేటి భాస్కర్, ధర్మారం రాజు, కాంపల్లి సంతోశ్, చిట్యాల లక్ష్మి, అసంపెల్లి లక్ష్మి ఉన్నారు. తాజా అరెస్టులతో కలిపి ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 19 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
Also Read
- Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
దర్యాప్తులో పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, సీఎంఆర్ఎఫ్ చెక్కులను నకిలీ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారని, ఆ మొత్తాన్ని విత్డ్రా చేసి అసలైన బాధితులను మోసం చేసినట్లు బయటపడింది. మొత్తం రూ. 8.71 లక్షలు అక్రమంగా విత్డ్రా చేసినట్లు గుర్తించారు. అలాగే 2023 ఎన్నికల తర్వాత 19 చెక్కులు నకిలీ ఖాతాల్లోకి మళ్లించబడినట్లు తేలింది. ఇప్పటివరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ వ్యవహారంపై ఐదు కేసులు నమోదయ్యాయి.
ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు నరేశ్కుమార్గా పోలీసులు గుర్తించారు. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి హరీశ్రావు కార్యాలయంలో ఆయన పనిచేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఓటమి అనంతరం 230 సీఎంఆర్ఎఫ్ చెక్కులను తనతో తీసుకెళ్లిన నరేశ్, అందులో 19 చెక్కులను పక్కదారి పట్టించినట్లు దర్యాప్తులో బయటపడింది. ఇప్పటికే జులై 15న నరేశ్కుమార్తో పాటు వెంకటేశ్, వంశీ, ఓంకార్లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తులో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకోవడంతో కేసు మరింత మలుపు తిరిగింది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!