Road Accident: ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం వద్ద కారు భీభత్సం సృష్టించింది.. అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది.. ఇంట్లో ఉన్న రమణయ్య అక్కడికక్కడే మృతిచెందగా.. కారులో ఉన్న ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. అయితే, హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఐదుగురు మృతిచెందారు.. మృతులను నరేష్, అభిసాయి, నారాయణ, యజ్ఞేష్, అభిషేక్, రమణయ్యగా గుర్తించారు.. అయితే, ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో.. నవనీత్ రెడ్డి అనే విద్యార్థి మాత్రం ప్రాణాలు బయటపడ్డాడు.. మృతుల్లో ఐదుగురు నారాయణ మెడికల్ కళాశాల విద్యార్థులుగా చెబుతున్నారు.. చేతికి అందివచ్చిన కుమారులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం.. ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది..