Maharashtra: 45 రోజులుగా ఉప్పుపాతరలో మృతదేహం.. న్యాయకోసం తండ్రి పోరాటం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లాలో గత 45 రోజులుగా జరుగుతున్న ఓ తండ్రి పోరాటాన్ని ఎట్టకేలకు ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. మా కూతురిపై అత్యాచారం చేశారని.. అనంతరం హత్య జరిగిందని మృతురాలి తండ్రి బోరున విలపించారు. తమ కూతురి హత్యను ఆత్మహత్యగా చూపించారని.. ఈ సమాచారం తప్పని, ఆమెను హింసించిన హంతకులను అరెస్ట్ చేయాలని.. ‘నా కూతురికి న్యాయం చేయండి’ అంటూ గత నెలన్నర రోజులుగా రోదిస్తున్న తండ్రిని పోలీసులు, అధికారులు పట్టించుకోలేదు. కానీ బాధితురాలి తండ్రి వదల్లేదు. తనకు న్యాయం జరిగే వరకు మృతదేహానికి అంత్యక్రియలు చేయబోనని మృతురాలి తండ్రి తేల్చిచెప్పారు.
హతురాలి తండ్రి చెప్పిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ధడ్గావ్ ప్రాంతంలో ఆగస్టు 1న కొందరు వ్యక్తులు బాధితురాలిని బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకువెళ్లారు. ఆ తర్వాత.. వావి ప్రాంతంలోని మామిడిచెట్టుకు ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నట్లు కుటుంబసభ్యులకు ఫోను వచ్చింది. ఘటనాస్థలికి తాము చేరుకునేలోపే నిందితులు.. మృతదేహాన్ని కిందకు దించి సాక్ష్యాలను ధ్వంసం చేశారని హతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమెపై రంజిత్, అతడి స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్డారని తాము పోలీసులకు చెబుతున్నా పట్టించుకోవట్లేదని వాపోతున్నారు.
Also Read
Ap Crime: కుమార్తెకు తన పోలికలు రాలేదని.. తండ్రి దాష్టీకం
ఆయన తన కుమార్తె మృతదేహాన్ని గత 45 రోజులుగా ఉప్పులో పాతిపెట్టాడు. అంతిమంగా వారి పోరాటాన్ని పాలకవర్గం గమనించింది. ఆరోగ్య బృందంతో పాటు పోలీసులు రంగంలోకి దిగారు. సంబంధిత సంఘటన నందుర్బార్లోని ధడ్గావ్ తాలూకాలో జరిగింది. తన కుమార్తెపై అత్యాచారం చేసి చంపేశారని బాధితురాలి తండ్రి ఆరోపించారు. తన కుమార్తె మృతదేహానికి పోస్టుమార్టం ముంబైలోనే నిర్వహించాలని ఆయన అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. తండ్రి డిమాండ్కు గ్రామస్తులు కూడా మద్దతు పలికారు. బాధితురాలి కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు, ఇప్పుడు ఆమె మృతదేహాన్ని రీ పోస్టుమార్టం చేయనున్నారు. మృతి చెందిన బాలిక మృతదేహంపై ముంబైకి చెందిన జేజే ఆసుపత్రిలో మళ్లీ శవపరీక్ష జరిగింది. ఆరోగ్య యంత్రాంగం సాయంతో ముంబైలో మళ్లీ పోస్టుమార్టం ప్రక్రియను పోలీసులు పూర్తి చేశారు. ఈ పోస్టుమార్టం రిపోర్టు అనంతరం ఈ కేసును పోలీసులు విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Ramani Kalyanam OTT: ఒకేసారి 3 ఓటీటీలలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ డ్రామా
-
Road Tax: ఆ కారు కొనాలనుకునే వాళ్లకు గుడ్న్యూస్.. 50% రోడ్ టాక్స్ మినహాయింపు!
-
Story Board: ట్రంప్ ప్రపంచాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? యుద్ధం పేరు చెప్పి గేమ్స్ ఏంటి..?
-
Drishyam 3 OTT: మోహన్ లాల్ దృశ్యం 3 ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
-
Kaala Hiran Controversy : ఆ సినిమా విడుదలను ఆపేయండి… కొత్త వివాదంలో కోర్టుకెక్కిన సల్మాన్ ఖాన్
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!