Karnataka Crime Story: సినిమాను మించిన క్రైమ్ స్టోరీ.. ప్రియుడితో సహజీవనం.. 8 ఏళ్ల తర్వాత ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhagya Sri Who Killed Her Brother For Lover Caught After 8 Years: వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో దారుణాలు చోటు చేసుకున్నాయి. తమ కామకోరికలు తీర్చుకోవడం కోసం.. అడ్డుగా ఉన్నారన్న నెపంతో అయిన వాళ్లనే చంపుకుంటున్నారు. భర్తల్ని, పిల్లల్ని, ఇంటివాళ్లను.. కిరాతకంగా హతమారుస్తున్నారు. ఇప్పుడు ఓ మహిళ కూడా.. అలాంటి ఘాతుకానికే పాల్పడింది. అప్పటికే భర్తని వదిలేసి ప్రియుడితో సహజీవనం చేస్తున్న ఆమె.. అడ్డుగా ఉన్నాడని సొంత తమ్ముడ్నే హతమార్చింది. అనంతరం ఎవ్వరికీ తెలియకుండా ప్రియుడితో కలిసి వేరే రాష్ట్రానికి వెళ్లిపోయింది. కానీ.. చట్టం చేతుల నుంచి వీళ్లు తప్పించుకోలేకపోయారు. ఎలాగైనా నిందితుల్ని పట్టుకోవాలనుకున్న పోలీసులు.. ఎనిమిదేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఎట్టకేలకు వాళ్లను పట్టుకోగలిగారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Man Beating Woman: ఢిల్లీలో దారుణం.. యువతిని బలవంతంగా కారులో ఎక్కించి..
Also Read
- POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
- Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
భాగ్యశ్రీ అనే మహిళ తన భర్తను వదిలేసి.. బెంగళూరు జిగణి పారిశ్రామికవాడలోని ఒక ప్రైవేటు ఫ్యాక్టరీలో ఉద్యోగానికి చేరింది. అక్కడికి వచ్చాక.. తన మాజీ ప్రియుడు సుపుత్ర శంకరప్పకు దగ్గరయ్యింది. దీంతో.. వీళ్లిద్దరు వడేరమంచనహళ్లిలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని, అందులో సహజీవనం చేశారు. ఈ విషయం భాగ్యశ్రీ సోదరుడు లింగరాజ్కు తెలిసి.. అతడు మందలించాడు. శంకరప్పకు దూరంగా ఉండాలని గొడవ పడ్డాడు. దీంతో కోపాద్రిక్తురాలైన భాగ్యశ్రీ.. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న తమ్ముడ్ని హత్య చేయాలని ప్లాన్ చేసింది. ప్లాన్ ప్రకారం.. 2015 ఆగస్టు 11వ తేదీన తన ప్రియుడు శంకరప్పతో కలిసి లింగరాజ్ని హత్య చేసింది. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి.. ప్లాస్టిక్ సంచిలో నింపుకుని.. వేర్వేరు స్దలాల్లో పడేశారు. అనంతరం ఎవ్వరికీ తెలియకుండా.. మహారాష్ట్రకు చెక్కేసి, అక్కడే మకాం వేశారు. తమ పేర్లు మార్చుకొని జీవించసాగారు.
Ajith: భార్యను వదిలి అజిత్ సీక్రెట్ ఎఫైర్.. ఎవరామె ?
మరోవైపు.. ఈ ఘటనపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భాగ్యశ్రీ, శంకరప్ప కలిసి.. లింగరాజుని హతమార్చినట్టు తేల్చారు. వారి కోసం గాలించడం మొదలుపెట్టారు. వారి ఫోటోలను, వేలిముద్రల్ని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. అయితే.. వారి జాడ కర్ణాటకలో కనిపించకపోయేసరికి.. మరో రాష్ట్రానికి చెక్కేసి ఉంటారన్న అనుమానంతో, ఇతర రాష్ట్రాలకు వారి ఫోటోల్ని సర్క్యులేట్ చేశారు. ఈ నేపథ్యంలోనే వాళ్లు నాసిక్లో తలదాచుకున్నట్టు తేలింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి.. ఆ ఇద్దరిని అరెస్టు చేసి, బెంగళూరుకు తీసుకొచ్చారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!