Karnataka Crime Story: సినిమాను మించిన క్రైమ్ స్టోరీ.. ప్రియుడితో సహజీవనం.. 8 ఏళ్ల తర్వాత ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhagya Sri Who Killed Her Brother For Lover Caught After 8 Years: వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో దారుణాలు చోటు చేసుకున్నాయి. తమ కామకోరికలు తీర్చుకోవడం కోసం.. అడ్డుగా ఉన్నారన్న నెపంతో అయిన వాళ్లనే చంపుకుంటున్నారు. భర్తల్ని, పిల్లల్ని, ఇంటివాళ్లను.. కిరాతకంగా హతమారుస్తున్నారు. ఇప్పుడు ఓ మహిళ కూడా.. అలాంటి ఘాతుకానికే పాల్పడింది. అప్పటికే భర్తని వదిలేసి ప్రియుడితో సహజీవనం చేస్తున్న ఆమె.. అడ్డుగా ఉన్నాడని సొంత తమ్ముడ్నే హతమార్చింది. అనంతరం ఎవ్వరికీ తెలియకుండా ప్రియుడితో కలిసి వేరే రాష్ట్రానికి వెళ్లిపోయింది. కానీ.. చట్టం చేతుల నుంచి వీళ్లు తప్పించుకోలేకపోయారు. ఎలాగైనా నిందితుల్ని పట్టుకోవాలనుకున్న పోలీసులు.. ఎనిమిదేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఎట్టకేలకు వాళ్లను పట్టుకోగలిగారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Man Beating Woman: ఢిల్లీలో దారుణం.. యువతిని బలవంతంగా కారులో ఎక్కించి..
Also Read
- Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
భాగ్యశ్రీ అనే మహిళ తన భర్తను వదిలేసి.. బెంగళూరు జిగణి పారిశ్రామికవాడలోని ఒక ప్రైవేటు ఫ్యాక్టరీలో ఉద్యోగానికి చేరింది. అక్కడికి వచ్చాక.. తన మాజీ ప్రియుడు సుపుత్ర శంకరప్పకు దగ్గరయ్యింది. దీంతో.. వీళ్లిద్దరు వడేరమంచనహళ్లిలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని, అందులో సహజీవనం చేశారు. ఈ విషయం భాగ్యశ్రీ సోదరుడు లింగరాజ్కు తెలిసి.. అతడు మందలించాడు. శంకరప్పకు దూరంగా ఉండాలని గొడవ పడ్డాడు. దీంతో కోపాద్రిక్తురాలైన భాగ్యశ్రీ.. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న తమ్ముడ్ని హత్య చేయాలని ప్లాన్ చేసింది. ప్లాన్ ప్రకారం.. 2015 ఆగస్టు 11వ తేదీన తన ప్రియుడు శంకరప్పతో కలిసి లింగరాజ్ని హత్య చేసింది. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి.. ప్లాస్టిక్ సంచిలో నింపుకుని.. వేర్వేరు స్దలాల్లో పడేశారు. అనంతరం ఎవ్వరికీ తెలియకుండా.. మహారాష్ట్రకు చెక్కేసి, అక్కడే మకాం వేశారు. తమ పేర్లు మార్చుకొని జీవించసాగారు.
Ajith: భార్యను వదిలి అజిత్ సీక్రెట్ ఎఫైర్.. ఎవరామె ?
మరోవైపు.. ఈ ఘటనపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భాగ్యశ్రీ, శంకరప్ప కలిసి.. లింగరాజుని హతమార్చినట్టు తేల్చారు. వారి కోసం గాలించడం మొదలుపెట్టారు. వారి ఫోటోలను, వేలిముద్రల్ని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. అయితే.. వారి జాడ కర్ణాటకలో కనిపించకపోయేసరికి.. మరో రాష్ట్రానికి చెక్కేసి ఉంటారన్న అనుమానంతో, ఇతర రాష్ట్రాలకు వారి ఫోటోల్ని సర్క్యులేట్ చేశారు. ఈ నేపథ్యంలోనే వాళ్లు నాసిక్లో తలదాచుకున్నట్టు తేలింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి.. ఆ ఇద్దరిని అరెస్టు చేసి, బెంగళూరుకు తీసుకొచ్చారు.
తాజావార్తలు
-
Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
-
Anantapur Murder: 20 రూపాయల కోసం గొడవ.. సర్ది చెప్పేందుకు వెళ్లిన వ్యక్తిని కొట్టి చంపిన మామా-అల్లుడు!
-
RaviTeja : ఒకటి కాదు రెండు.. థియేటర్ దద్దరిల్లిపోద్ది
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!