Bengaluru Shocker: భార్య ప్రాణం తీసిన ‘‘సాంబార్’’ గొడవ..
- కాపురంలో చిచ్చుపెట్టిన సాంబార్ గొడవ..
- భర్త తిట్టాడని ఆత్మహత్య చేసుకున్న భార్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Shocker: చిన్న చిన్న కారణాలే కుటుంబాల్లో కల్లోలాలు రేపుతున్నాయి. మనస్పర్థలతో ఆత్మహత్యలు, హత్యకు పాల్పడుతున్నారు. తాజాగా బెంగళూర్లో భార్యభర్తల మధ్య జరిగిన చిన్న ఘటన భార్య ఆత్మహత్యకు కారణమైంది. 3 రోజుల క్రితం నాటి ‘‘సాంబార్’’ను పదే పదే వడ్డించడంపై జరిగిన వివాదంలో 27 ఏళ్ల మహిళ మృతి చెందింది. గురువారం సాంబార్ విషయంలో భర్తతో జరిగిన గొడవ తర్వాత కావ్య అనే మహిళ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది.
Read Also: Telangana: పాఠశాల ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెండ్.. ఆ పని చేసినందుకే ఇలా..
Also Read
- Wife Murder: స్మూతీలో విషం? అమెరికాలో భార్యను కడతేర్చిన తెలంగాణ భర్త కేసులో సంచలన విషయాలు!
- Tirupati Double Murder: తిరుపతిలో జంట హత్యల కలకలం.. పెళ్లి వేడుకలో కత్తులతో దాడి..
- USA: అమెరికాలో భార్యను హత్య చేసిన తెలంగాణ టెక్కీ.. జీవితఖైదు పడే అవకాశం
- Extra Marital Affair : మియాపూర్ లో దారుణం.. భర్తను హత్య చేసి పూడ్చిపెట్టిన భార్య.!
కావ్యకు రంగస్వామితో 5 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరికి నాలుగేళ్ల బిడ్డ ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మూడు రోజుల క్రితం తయారు చేసిన సాంబార్ను మళ్లీ వేడి చేసి వడ్డించి తర్వాత దంపతుల మధ్య గొడవ ప్రారంభమైంది. ఆ సమయంలో భర్త, కావ్యను తీవ్రంగా దుర్భాషలాడాడు. ఆమెపై దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘర్షణ తర్వాత కావ్య వ్యవసాయం కోసం వినియోగించే పురుగుల మందు సేవించిందని చెబుతున్నారు. వాంతులు కావడంతో ఆమె పురుగుల మందు తాగిందనే విషయాన్ని గుర్తించిన కుటుంబీకులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గం మధ్యలో మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
PM Modi: ఈ షో హౌస్పుల్.. బ్లాక్బస్టర్.. మెల్బోర్న్ సభపై మోడీ ప్రశంసలు
-
Ashwin: “అన్యాయం జరుగుతోంది.. ప్లేయర్స్ని ఒకేలా చూడటం లేదు”.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
-
China: “చైనా వృద్ధి 2 శాతం మాత్రమే” అన్న ఆర్థికవేత్త అనుమానాస్పద మృతి
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు వరద ఉధృతి.. కొట్టుకుపోయిన పైపులు..
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!