Wife Murder: స్మూతీలో విషం? అమెరికాలో భార్యను కడతేర్చిన తెలంగాణ భర్త కేసులో సంచలన విషయాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Murder: ఒక గ్లాస్ స్మూతీ… అందులో ఏదో విచిత్రమైన రుచి… అది సాధారణంగా అనిపించిన చిన్న సందేశమే అయినా, చివరకు ఓ హత్య కేసులో అత్యంత కీలక ఆధారంగా మారుతుందని ఎవరూ ఊహించరు. అమెరికాలో నివసిస్తున్న తెలంగాణకు చెందిన యువతి రాజిత సబ్బినేని తన భర్త తయారు చేసిన స్మూతీ తాగిన తర్వాత అది దగ్గు మందులా ఉందని, మందు రుచి వస్తోందని పంపిన మెసేజ్ ఇప్పుడు దర్యాప్తులో కీలక మలుపు తీసుకొచ్చింది. మొదట అనుమానాస్పద మరణంగా కనిపించిన ఈ ఘటన, డిజిటల్ ఆధారాలు ఒక్కొక్కటిగా బయటకు రావడంతో ముందే ప్రణాళిక వేసి చేసిన హత్యగా మారిపోయింది.
27 ఏళ్ల రాజిత సబ్బినేని 2025 అక్టోబర్లో అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలోని బెల్లెవ్యూ నగరంలో తన భర్త అవినాష్ నార్నేతో కలిసి నివసిస్తోంది. అదే అపార్ట్మెంట్లో రాజిత మృతిచెందింది. తెలంగాణకు చెందిన అవినాష్ నార్నే మొదట తన భార్య ఇంట్లో లేదని, తర్వాత ఆమె స్పందించడం లేదని పోలీసులకు చెప్పాడు. ఆమె ఆరోగ్యం బాగాలేక దగ్గు మందు తాగిన తర్వాత కుప్పకూలి ఉండొచ్చని కూడా వివరించాడు. కానీ పోస్టుమార్టం నివేదిక మాత్రం వేరే నిజాన్ని బయటపెట్టింది. రాజిత గొంతు నులిమి చంపిన కారణంగా శ్వాస ఆడక మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
దర్యాప్తు ముందుకు సాగుతున్న సమయంలో పోలీసులు అవినాష్ ఫోన్ను పరిశీలించగా ఆశ్చర్యకరమైన వివరాలు బయటపడ్డాయి. రాజిత గతంలోనూ అతడు తయారు చేసిన పానీయాలకు మందులా, చేదుగా రుచి వస్తోందని పలుమార్లు మెసేజ్ చేసినట్లు గుర్తించారు. మరణించిన రోజే ఆమె పంపిన స్మూతీ దగ్గు మందులా ఉందనే సందేశం దర్యాప్తును కొత్త దిశలో నడిపించింది. దీంతో హత్యకు ముందు విషప్రయోగం చేసేందుకు ప్రయత్నించి ఉండొచ్చనే అనుమానాలు బలపడ్డాయి.
ఇంతటితో ఆగలేదు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, అవినాష్ ఎలక్ట్రానిక్ పరికరాల్లో విష పదార్థాల గురించి ఇంటర్నెట్లో చేసిన సెర్చ్ హిస్టరీని కూడా పోలీసులు గుర్తించారు. ఈ డిజిటల్ ఆధారాలు దర్యాప్తుకు మరింత బలం చేకూర్చాయి. ఇదే సమయంలో అపార్ట్మెంట్ స్మార్ట్ లాక్ వ్యవస్థ, ప్రధాన ద్వారం భద్రతా రికార్డులను పరిశీలించగా అవినాష్ కొద్దిసేపు బయటకు వెళ్లినా ఆ సమయంలో మరెవరూ ఇంట్లోకి ప్రవేశించలేదని స్పష్టమైంది. దీంతో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి వచ్చి ఘటనకు పాల్పడ్డాడన్న వాదన పూర్తిగా కొట్టివేయబడింది.
దర్యాప్తులో మరో సంచలన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. రాజిత మరణించిన రోజే అవినాష్ భారతదేశంలో ఉన్న మరో మహిళతో పలుమార్లు ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. తాను బాత్రూం తలుపు తెరవడానికి ప్రయత్నిస్తున్నానని తర్వాత చెప్పిన సమయానికి కూడా ఆమెతో మాట్లాడిన రికార్డులు లభించాయి. అంతేకాదు, రాజిత మృతదేహం ఫొటోను మరుసటి రోజే ఆ మహిళకు పంపిన విషయాన్ని కూడా అవినాష్ విచారణలో అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. భారతదేశంలోని ఆ మహిళతో ఉన్న సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణమై ఉండొచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
నెలల తరబడి ఫోరెన్సిక్ పరీక్షలు, డిజిటల్ రికార్డుల విశ్లేషణ, సాక్ష్యాల పరిశీలన అనంతరం బెల్లెవ్యూ పోలీసులు అవినాష్ నార్నేను అరెస్టు చేశారు. జూలై 1న ప్రాసిక్యూటర్లు అతనిపై ముందస్తు ప్రణాళికతో ఉద్దేశపూర్వకంగా హత్య చేసినందుకు ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతను 50 లక్షల అమెరికన్ డాలర్ల బెయిల్పై జైలులోనే ఉన్నాడు. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.4.3 కోట్లకు సమానం. వాషింగ్టన్ రాష్ట్ర చట్టాల ప్రకారం అతనిపై అభియోగాలు రుజువైతే జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం ఉంది.
ఒకప్పుడు సాధారణ దాంపత్య జీవితంలో భాగంగా కనిపించిన చిన్న చిన్న మెసేజ్లు, చివరకు హత్య వెనుక ఉన్న అసలు కథను బయటపెట్టాయి. స్మార్ట్ లాక్ రికార్డులు, మొబైల్ చాట్లు, ఇంటర్నెట్ సెర్చ్ హిస్టరీ, ఫోన్ కాల్ వివరాలు వంటి డిజిటల్ ఆధారాలు నేటి నేర దర్యాప్తులో ఎంత కీలక పాత్ర పోషిస్తున్నాయో ఈ కేసు మరోసారి స్పష్టంగా చూపించింది.
- Tags
- crime
- wife murder
తాజావార్తలు
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి భూముల ఎపిసోడ్ విచారణ ప్రారంభం
-
Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
-
Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
-
New Oppo: టెక్ లవర్స్ను తెగ ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త లుక్.. ఈ ఫీచర్లు తెలిస్తే వెంటనే అప్డేట్ చేస్తారు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!