China: “చైనా వృద్ధి 2 శాతం మాత్రమే” అన్న ఆర్థికవేత్త అనుమానాస్పద మృతి
- చైనా జీడీపీ గణాంకాలను ప్రశ్నించిన ఆర్థికవేత్త గావో షాన్వెన్ మృతి.
- కారణం "అనారోగ్యం" అని చైనా మీడియా వెల్లడి.
- చైనా వాస్తవ వృద్ధి సుమారు 2% మాత్రమేనని గావో వ్యాఖ్య.
- అప్పటి నుంచి గావోపై కఠిన చర్యలు తీసుకుంటున్న చైనా.
- తాజాగా అనుమానాస్పద స్థితిలో మరణం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: చైనా జీడీపీని ప్రశ్నిస్తున్న ప్రముఖ ఆర్థికవేత్త గావో షాన్వెల్(55) అనుమానాస్పదంగా మరనించారు. ఆయన అనారోగ్యంతో మరణించారని చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అయితే, ఈ మరణంపై మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గావో చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని పెట్టుబడి సంస్థ SDIC సెక్యూరిటీస్లో ప్రధాన ఆర్థికవేత్తగా పనిచేశారు. చైనా ఆర్థిక వ్యవస్థపై నిజాలు చెప్పే ఆర్థికవేత్తగా గావోకు పేరుంది.
2024లో వాషింగ్టన్లో గావో షాన్వెల్ చేసిన ప్రసంగం చైనాలో ప్రకంపనలు సృష్టించింది. గత రెండు మూడేళ్లుగా చైనా వాస్తవ జీడీపీ వృద్ధిరేటు సగటున 2 శాతం మాత్రమే ఉందని, ప్రభుత్వం చెబుతున్న 5శాతం వాస్తవానికి దూరంగా ఉందని చెప్పారు. వినియోగం, ఉపాధి, రియల్ ఎస్టేట్ రంగాల్లో కనిపిస్తున్న బలహీనతల్ని ఆయన హైలెట్ చేశారు. అయితే, ఈ వ్యాఖ్యల తర్వాత చైనా ప్రభుత్వం గావోపై కఠిన చర్యలు తీసుకుంది. ఈయన బహిరంగ ప్రసంగాలపై నిషేధం విధించడంతో పాటు సోషల్ మీడియా అకౌంట్లను సస్పెండ్ చేసింది. దీని తర్వాత ఆయన తన ఉద్యోగాన్ని కూడా కోల్పోయారు. హాంకాంగ్లోని పెట్టుబడి సలహాదారు లైసెన్స్ గడువు కూడా ముగిసింది.
Also Read
- Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
- Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
- Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
గావో మరణానికి అనారోగ్యమే కారణమని చైనా ప్రభుత్వం చెబుతోంది. అయితే, మరణించిన సమయం, అనారోగ్యానికి సంబంధించిన వివరాలను పూర్తిగా వెల్లడించలేదు. మరోవైపు, 2025 ప్రారంభంలో గావోకు క్యాన్సర్ నిర్ధారణ అయినట్లు ఆయన సన్నిహితులు చెప్పారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. గావో మరణం తర్వాత చైనీస్ సోషల్ మీడియాలో చాలా మంది నివాళులు అర్పిస్తున్నారు. నిజం మాట్లాడిన ఆర్థికవేత్త అంటూ పోస్టులు పెడుతున్నారు.
చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని ఆ దేశం అణచివేస్తోంది. గతంలో కోవిడ్-19పై హెచ్చరికలు జారీ చేసిన వైద్యుడు లీ వెన్లియాంగ్, ప్రభుత్వాన్ని విమర్శించిన వ్యాపారవేత్త జాక్ మా వంటి వారిపై చైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇప్పుడు గావో షాన్వెల్ హఠాన్మరణం కూడా ఇతే తరహా చర్చకు దారి తీసింది.
తాజావార్తలు
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?