Techie Suicide: “ఇళ్లు కూడా కట్టుకోనివ్వరా”.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య..
- కొత్తింటి నిర్మాణానికి అధికారుల వేధింపులు..
- వేధింపులు తట్టుకోలేక టెక్కీ సూసైడ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Techie Suicide: నగర పాలక సంస్థ అధికారుల వేధింపులు తట్టుకోలేక ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బెంగళూర్లో జరిగింది. సొంతింటి కల తీరకుండానే తనువు చాలించాడు. కొత్త ఇంటి నిర్మాణానికి పదే పదే ఆటంకాలు కలిగించడం, డబ్బులు వసూలు చేసేందుకు ఒత్తిడి చేయడంతోనే బాధితులు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన కుటుంబం ఆరోపిస్తోంది. నగరంలోని నల్లురహళ్లి ప్రాంతంలో గురువారం ఈ సంఘటన జరిగింది. మృతుడిని మురళి గోవిందరాజుగా గుర్తించారు. నిర్మాణం అవుతున్న ఇంటిలోనే ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Read Also: Pawan Kalyan: గుర్తింపు కోసం నేను పనిచేయను.. ప్రజల కోసం మాత్రమే పనిచేస్తా!
Also Read
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
తన కుమారుడు ఇద్దరు వ్యక్తుల వేధింపుల కారణంగానే మరణించాడని, డబ్బులు డిమాండ్ చేసిన కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు మురళి తల్లి ఆరోపించింది. తన భార్య దుర్గాదేవి, పిల్లలు కనిష్ట, దేశితతో నివసించే మురళి 2018లో బంధువుల నుంచి నల్లురహళ్లిలో ఒక స్థలాన్ని కొనుగోలు చేశారని తల్లి తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ స్థలంలో మురళి ఇల్లు నిర్మించే పనిలో ఉన్నారు. అక్టోబర్ 25న ఉషా నంబియార్, శశి నంబియార్ అనే ఇద్దరు వ్యక్తులు అనేక సార్లు ఇంటి వద్దకు వచ్చి రూ. 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆరోపించారు.
మురళి వారికి డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో, వారు కొంత మంది గ్రేటర్ బెంగళూర్ అథారిటీ అధికారులతో కుమ్మక్కు అయ్యారని, నిర్మాణ స్థలాన్ని పదే పదే సందర్శించి, తన కొడుకును మానసికంగా వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న రోజు మురళిని పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేశారని, తీవ్ర మనస్తాపానికి గురైన అతను ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి, తన కొత్త ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కొడుకు మరణానికి కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు మృతుడి తల్లి ఫిర్యాదు చేసింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!