Techie Suicide: “ఇళ్లు కూడా కట్టుకోనివ్వరా”.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య..
- కొత్తింటి నిర్మాణానికి అధికారుల వేధింపులు..
- వేధింపులు తట్టుకోలేక టెక్కీ సూసైడ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Techie Suicide: నగర పాలక సంస్థ అధికారుల వేధింపులు తట్టుకోలేక ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బెంగళూర్లో జరిగింది. సొంతింటి కల తీరకుండానే తనువు చాలించాడు. కొత్త ఇంటి నిర్మాణానికి పదే పదే ఆటంకాలు కలిగించడం, డబ్బులు వసూలు చేసేందుకు ఒత్తిడి చేయడంతోనే బాధితులు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన కుటుంబం ఆరోపిస్తోంది. నగరంలోని నల్లురహళ్లి ప్రాంతంలో గురువారం ఈ సంఘటన జరిగింది. మృతుడిని మురళి గోవిందరాజుగా గుర్తించారు. నిర్మాణం అవుతున్న ఇంటిలోనే ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Read Also: Pawan Kalyan: గుర్తింపు కోసం నేను పనిచేయను.. ప్రజల కోసం మాత్రమే పనిచేస్తా!
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
తన కుమారుడు ఇద్దరు వ్యక్తుల వేధింపుల కారణంగానే మరణించాడని, డబ్బులు డిమాండ్ చేసిన కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు మురళి తల్లి ఆరోపించింది. తన భార్య దుర్గాదేవి, పిల్లలు కనిష్ట, దేశితతో నివసించే మురళి 2018లో బంధువుల నుంచి నల్లురహళ్లిలో ఒక స్థలాన్ని కొనుగోలు చేశారని తల్లి తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ స్థలంలో మురళి ఇల్లు నిర్మించే పనిలో ఉన్నారు. అక్టోబర్ 25న ఉషా నంబియార్, శశి నంబియార్ అనే ఇద్దరు వ్యక్తులు అనేక సార్లు ఇంటి వద్దకు వచ్చి రూ. 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆరోపించారు.
మురళి వారికి డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో, వారు కొంత మంది గ్రేటర్ బెంగళూర్ అథారిటీ అధికారులతో కుమ్మక్కు అయ్యారని, నిర్మాణ స్థలాన్ని పదే పదే సందర్శించి, తన కొడుకును మానసికంగా వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న రోజు మురళిని పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేశారని, తీవ్ర మనస్తాపానికి గురైన అతను ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి, తన కొత్త ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కొడుకు మరణానికి కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు మృతుడి తల్లి ఫిర్యాదు చేసింది.
తాజావార్తలు
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!