Techie Suicide: “ఇళ్లు కూడా కట్టుకోనివ్వరా”.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య..
- కొత్తింటి నిర్మాణానికి అధికారుల వేధింపులు..
- వేధింపులు తట్టుకోలేక టెక్కీ సూసైడ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Techie Suicide: నగర పాలక సంస్థ అధికారుల వేధింపులు తట్టుకోలేక ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బెంగళూర్లో జరిగింది. సొంతింటి కల తీరకుండానే తనువు చాలించాడు. కొత్త ఇంటి నిర్మాణానికి పదే పదే ఆటంకాలు కలిగించడం, డబ్బులు వసూలు చేసేందుకు ఒత్తిడి చేయడంతోనే బాధితులు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన కుటుంబం ఆరోపిస్తోంది. నగరంలోని నల్లురహళ్లి ప్రాంతంలో గురువారం ఈ సంఘటన జరిగింది. మృతుడిని మురళి గోవిందరాజుగా గుర్తించారు. నిర్మాణం అవుతున్న ఇంటిలోనే ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Read Also: Pawan Kalyan: గుర్తింపు కోసం నేను పనిచేయను.. ప్రజల కోసం మాత్రమే పనిచేస్తా!
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
తన కుమారుడు ఇద్దరు వ్యక్తుల వేధింపుల కారణంగానే మరణించాడని, డబ్బులు డిమాండ్ చేసిన కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు మురళి తల్లి ఆరోపించింది. తన భార్య దుర్గాదేవి, పిల్లలు కనిష్ట, దేశితతో నివసించే మురళి 2018లో బంధువుల నుంచి నల్లురహళ్లిలో ఒక స్థలాన్ని కొనుగోలు చేశారని తల్లి తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ స్థలంలో మురళి ఇల్లు నిర్మించే పనిలో ఉన్నారు. అక్టోబర్ 25న ఉషా నంబియార్, శశి నంబియార్ అనే ఇద్దరు వ్యక్తులు అనేక సార్లు ఇంటి వద్దకు వచ్చి రూ. 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆరోపించారు.
మురళి వారికి డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో, వారు కొంత మంది గ్రేటర్ బెంగళూర్ అథారిటీ అధికారులతో కుమ్మక్కు అయ్యారని, నిర్మాణ స్థలాన్ని పదే పదే సందర్శించి, తన కొడుకును మానసికంగా వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న రోజు మురళిని పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేశారని, తీవ్ర మనస్తాపానికి గురైన అతను ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి, తన కొత్త ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కొడుకు మరణానికి కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు మృతుడి తల్లి ఫిర్యాదు చేసింది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..