వామ్మో.. బంగారం, వెండి ధరలు మళ్లీ షాకిచ్చాయి. రెండు, మూడు రోజులు తగ్గుముఖం పట్టడంతో తగ్గొచ్చని అంతా భావించారు. కానీ ఇంతలోనే షాకిచ్చాయి. పెళ్లిళ్ల సీజన్లో ధరలు భారీ ఝలక్ ఇచ్చాయి. ఈరోజు తులం గోల్డ్పై రూ. 2,290 పెరగగా.. కిలో వెండిపై ఏకంగా రూ.15,000 పెరిగింది.
ఇది కూడా చదవండి: US-Iran: ఇరాన్ అష్టదిగ్బంధం.. భారీ దాడులకు అమెరికా ప్లాన్.. ఇజ్రాయెల్ అలర్ట్
ఈరోజు తులం గోల్డ్పై రూ.2,290 పెరగడంతో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,56,490 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.2,100 పెరగడంతో రూ.1,43,450 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,720 పెరగడంతో రూ.1,17,370 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: IAS Prasad: ఐఏఎస్ అధికారి మూడో రహస్య పెళ్లిపై వీడిన మిస్టరీ.. ఇంత ట్విస్టుందా?
ఇక ఈరోజు సిల్వర్ ధర భారీ షాకిచ్చింది. కిలో వెండిపై ఏకంగా రూ.15,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2, 70, 000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కూడా కిలో వెండి ధర రూ.2,70, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.