Love Trap: 180 మంది బాలికలపై అత్యాచారం కేసులో.. బాధితురాలి షాకింగ్ నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో వెలుగుచూసిన ఘోరమైన లైంగిక వేధింపుల ఉదంతం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో బాధితురాలైన ఒక మైనర్ బాలిక సోమవారం వాజర్ డ్యామ్ వద్దకు చేరుకుని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. అయితే.. అప్రమత్తమైన పోలీసులు సకాలంలో స్పందించి ఆమెను అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
అమరావతి జిల్లా పరత్వారా నగరానికి చెందిన మహ్మద్ అయ్యాజ్ (అలియాస్ తన్వీర్) అనే 19 ఏళ్ల యువకుడు ఈ దారుణానికి ప్రధాన సూత్రధారి. ప్రేమ పేరుతో అమాయక బాలికలను వలలో వేసుకోవడం (లవ్ ట్రాప్), వారితో అసభ్యకర వీడియోలు చిత్రీకరించడం, ఆపై వాటితో బ్లాక్ మెయిల్ చేస్తూ వ్యభిచార కూపంలోకి దించడమే ఇతని పని. ఒక బ్రేకప్ తర్వాత తాను ‘ప్లేబాయ్’ ఇమేజ్ కోసం ఇలాంటి పనులకు ఒడిగట్టినట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు. వాట్సాప్, స్నాప్చాట్ గ్రూపుల ద్వారా బాలికలను సంప్రదించి, స్నేహితుడి గదిని వాడుకుంటూ ఈ అకృత్యాలకు పాల్పడేవాడు.
Also Read
కేసు వెలుగులోకి వచ్చిందిలా..
అయ్యాజ్, అతని చిన్ననాటి స్నేహితుడు ఉజైర్ ఖాన్ మధ్య వచ్చిన గొడవతో ఈ రాకెట్ బయటపడింది. అయ్యాజ్ తన ఫోన్ను ఒక చోట మరిచిపోగా, ఉజైర్ ఆ ఫోన్లోని అశ్లీల వీడియోలు, ఫోటోలను ఆన్లైన్లో షేర్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. దీంతో ఎనిమిది మంది బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read:Fire Accident: 24 గంటల తర్వాత మోదీ ప్రారంభించాల్సిన రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం..
ఈ కేసులో ఇప్పటివరకు అయ్యాజ్, ఉజైర్ ఖాన్తో సహా ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి ల్యాప్టాప్, హార్డ్ డిస్క్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నాగపూర్కు చెందిన 15 ఏళ్ల బాలిక స్టేట్మెంట్ను పోలీసులు నమోదు చేశారు. అలాగే మరో మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఉజైర్ ఖాన్పై పోక్సో (POCSO) చట్టం కింద అదనపు కేసు నమోదైంది.
ఈ ఉదంతం రాజకీయ రంగు పులుముకుంది. బీజేపీ నేత కిరీట్ సోమయ్య పరత్వారాను సందర్శించి, ఎస్.ఐ.టి (SIT) చీఫ్ శుభమ్ కుమార్ను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు అయ్యాజ్ ఏప్రిల్ 21 వరకు పోలీస్ కస్టడీలో ఉంటాడు. బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేయడానికి గల కారణాలు నేరుగా ఈ కేసుతోనే ముడిపడి ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రభుత్వం, పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Pahalgam Terror Attack Case: పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్కు NIA సమన్లు
-
AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026..
-
MK. Stalin: 110 రోజుల తర్వాత ఓటమిపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
CJP: కాక్రోచ్ పార్టీపై కేసు.. రాజస్థాన్ గ్రామస్తుల ఫిర్యాదు..
-
Calorie Deficit: బరువు తగ్గే డైట్లో ఆకలి ఇబ్బంది పెడుతోందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!