Love Trap: 180 మంది బాలికలపై అత్యాచారం కేసులో.. బాధితురాలి షాకింగ్ నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో వెలుగుచూసిన ఘోరమైన లైంగిక వేధింపుల ఉదంతం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో బాధితురాలైన ఒక మైనర్ బాలిక సోమవారం వాజర్ డ్యామ్ వద్దకు చేరుకుని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. అయితే.. అప్రమత్తమైన పోలీసులు సకాలంలో స్పందించి ఆమెను అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
అమరావతి జిల్లా పరత్వారా నగరానికి చెందిన మహ్మద్ అయ్యాజ్ (అలియాస్ తన్వీర్) అనే 19 ఏళ్ల యువకుడు ఈ దారుణానికి ప్రధాన సూత్రధారి. ప్రేమ పేరుతో అమాయక బాలికలను వలలో వేసుకోవడం (లవ్ ట్రాప్), వారితో అసభ్యకర వీడియోలు చిత్రీకరించడం, ఆపై వాటితో బ్లాక్ మెయిల్ చేస్తూ వ్యభిచార కూపంలోకి దించడమే ఇతని పని. ఒక బ్రేకప్ తర్వాత తాను ‘ప్లేబాయ్’ ఇమేజ్ కోసం ఇలాంటి పనులకు ఒడిగట్టినట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు. వాట్సాప్, స్నాప్చాట్ గ్రూపుల ద్వారా బాలికలను సంప్రదించి, స్నేహితుడి గదిని వాడుకుంటూ ఈ అకృత్యాలకు పాల్పడేవాడు.
Also Read
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. నవీన్రెడ్డి హత్యతో లింకులపై ఫోకస్
- Wife Kills Husband: ఇన్స్ట్రాగ్రామ్ ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
- Vijayawada: రౌడీషీటర్ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియో
- Black Magic: చేతబడి అనుమానం.. పనిమనిషిని దారుణంగా చంపిన డాక్టర్..
కేసు వెలుగులోకి వచ్చిందిలా..
అయ్యాజ్, అతని చిన్ననాటి స్నేహితుడు ఉజైర్ ఖాన్ మధ్య వచ్చిన గొడవతో ఈ రాకెట్ బయటపడింది. అయ్యాజ్ తన ఫోన్ను ఒక చోట మరిచిపోగా, ఉజైర్ ఆ ఫోన్లోని అశ్లీల వీడియోలు, ఫోటోలను ఆన్లైన్లో షేర్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. దీంతో ఎనిమిది మంది బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read:Fire Accident: 24 గంటల తర్వాత మోదీ ప్రారంభించాల్సిన రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం..
ఈ కేసులో ఇప్పటివరకు అయ్యాజ్, ఉజైర్ ఖాన్తో సహా ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి ల్యాప్టాప్, హార్డ్ డిస్క్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నాగపూర్కు చెందిన 15 ఏళ్ల బాలిక స్టేట్మెంట్ను పోలీసులు నమోదు చేశారు. అలాగే మరో మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఉజైర్ ఖాన్పై పోక్సో (POCSO) చట్టం కింద అదనపు కేసు నమోదైంది.
ఈ ఉదంతం రాజకీయ రంగు పులుముకుంది. బీజేపీ నేత కిరీట్ సోమయ్య పరత్వారాను సందర్శించి, ఎస్.ఐ.టి (SIT) చీఫ్ శుభమ్ కుమార్ను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు అయ్యాజ్ ఏప్రిల్ 21 వరకు పోలీస్ కస్టడీలో ఉంటాడు. బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేయడానికి గల కారణాలు నేరుగా ఈ కేసుతోనే ముడిపడి ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రభుత్వం, పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: పుత్తడి అమ్మకాలు ఎందుకు తగ్గాయి..? ఆర్థిక పరిస్థితులే కారణమా..?
-
Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
-
Off The Record: శృంగవరపు కోట TDPలో గ్రూప్ వార్!
-
UP: అమిత్ షాతో ఎస్పీ ఎంపీ భేటీ!.. అఖిలేష్ యాదవ్కు భారీ ఝలక్ తప్పదా?
-
kitchen tips: చపాతీ కర్రకు బూజు పడుతోందా? ఈ చిన్న ట్రిక్తో ఫంగస్కు చెక్ పెట్టండి!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!