Fire Accident: 24 గంటల తర్వాత మోదీ ప్రారంభించాల్సిన రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ అత్యాధునిక రిఫైనరీని ప్రారంభించడానికి సరిగ్గా 24 గంటల ముందు.. అక్కడ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపింది. ఆకాశమంతా నల్లటి పొగలు కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరిన 20 ఫైర్ ఇంజిన్ల ద్వారా సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు.
ఇది దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్. దీనిని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), రాజస్థాన్ ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో నిర్మించాయి. ఈ ప్రాజెక్టు ప్రస్థానం దశాబ్ద కాలం క్రితమే మొదలైంది. 2013లో అప్పటి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ దీనికి శంకుస్థాపన చేశారు. అప్పుడు దీని అంచనా వ్యయం సుమారు రూ.37,230 కోట్లు. 2018లో కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత, ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టును మళ్లీ ప్రారంభించారు. కాలక్రమేణా పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా దీని వ్యయం రూ.73,000 కోట్ల పైచిలుకు చేరుకుంది.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
ఈ రిఫైనరీ పెట్రోల్, డీజిల్ ఉత్పత్తికే పరిమితం కాకుండా, భారీ స్థాయిలో పెట్రోకెమికల్ ఉత్పత్తులను కూడా తయారు చేస్తుంది. పాలిప్రొపిలిన్, పాలిథిలిన్, బెంజీన్ వంటి రసాయనాలు ఇక్కడ ఉత్పత్తి అవుతాయి. ఇవి ప్లాస్టిక్ ఫర్నిచర్, అగ్రికల్చర్ పైపులు, ప్యాకేజింగ్ మెటీరియల్స్ , వైద్య పరికరాల తయారీకి ముడి సరుకుగా ఉపయోగపడతాయి.
ఈ కాంప్లెక్స్ చుట్టూ అనేక చిన్న , మధ్య తరహా పరిశ్రమలు ఏర్పడతాయి. దీనివల్ల వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది. విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గించి, దేశీయంగా ఇంధన లభ్యతను పెంచడం ద్వారా భారతదేశ ఇంధన భద్రతను ఇది బలోపేతం చేస్తుంది. మొత్తానికి, ఈ ప్రాజెక్టు రాజస్థాన్ రాష్ట్రాన్ని జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో ఒక పారిశ్రామిక కేంద్రంగా నిలబెట్టనుంది. ప్రమాదాలు జరిగినప్పటికీ, దేశ ఆర్థిక వృద్ధిలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. ప్రస్తుతం ఘటనా స్థలంలో మంటలను
తాజావార్తలు
-
Allu Arjun : అల్లుఅర్జున్ ‘రాకా’ 2027లో రావడం కూడా కష్టమేనా.?
-
US strikes on Iran: మళ్లీ యుద్ధం.. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు.. హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటన
-
ARYA : తమిళ హీరో ఆర్యపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు
-
Jr NTR: జూలై 18న ఎన్టీఆర్ కీలక ప్రకటన? అభిమాన సంఘాల ఏకీకరణ వెనుక అసలు ఉద్దేశమేంటి?
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!