Fire Accident: 24 గంటల తర్వాత మోదీ ప్రారంభించాల్సిన రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ అత్యాధునిక రిఫైనరీని ప్రారంభించడానికి సరిగ్గా 24 గంటల ముందు.. అక్కడ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపింది. ఆకాశమంతా నల్లటి పొగలు కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరిన 20 ఫైర్ ఇంజిన్ల ద్వారా సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు.
ఇది దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్. దీనిని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), రాజస్థాన్ ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో నిర్మించాయి. ఈ ప్రాజెక్టు ప్రస్థానం దశాబ్ద కాలం క్రితమే మొదలైంది. 2013లో అప్పటి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ దీనికి శంకుస్థాపన చేశారు. అప్పుడు దీని అంచనా వ్యయం సుమారు రూ.37,230 కోట్లు. 2018లో కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత, ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టును మళ్లీ ప్రారంభించారు. కాలక్రమేణా పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా దీని వ్యయం రూ.73,000 కోట్ల పైచిలుకు చేరుకుంది.
Also Read
- Mamata Banerjeeకి హైకోర్టులో ఎదురుదెబ్బ.. ప్రతిపక్ష నేతగా రితబ్రత కొనసాగింపుకు గ్రీన్ సిగ్నల్.!
- Hyderabad: ఫ్రీజర్లో పురుగులు, స్టోరేజ్లో బల్లులు.. ‘లా పినోజ్ పిజ్జా’ కిచెన్ చూసి షాకైన అధికారులు!
- FIFA Worldcup 2026లో కొత్త చరిత్ర.. ఒక్క రోజులోనే రికార్డు స్థాయి ప్రేక్షకులు.!
- Noam Shazeer: గూగుల్కు బిగ్ షాక్.. జెమిని ఏఐ కీలక రూపశిల్పి రాజీనామా.. ఓపెన్ AI గూటికి టెక్ జీనియస్!
ఈ రిఫైనరీ పెట్రోల్, డీజిల్ ఉత్పత్తికే పరిమితం కాకుండా, భారీ స్థాయిలో పెట్రోకెమికల్ ఉత్పత్తులను కూడా తయారు చేస్తుంది. పాలిప్రొపిలిన్, పాలిథిలిన్, బెంజీన్ వంటి రసాయనాలు ఇక్కడ ఉత్పత్తి అవుతాయి. ఇవి ప్లాస్టిక్ ఫర్నిచర్, అగ్రికల్చర్ పైపులు, ప్యాకేజింగ్ మెటీరియల్స్ , వైద్య పరికరాల తయారీకి ముడి సరుకుగా ఉపయోగపడతాయి.
ఈ కాంప్లెక్స్ చుట్టూ అనేక చిన్న , మధ్య తరహా పరిశ్రమలు ఏర్పడతాయి. దీనివల్ల వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది. విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గించి, దేశీయంగా ఇంధన లభ్యతను పెంచడం ద్వారా భారతదేశ ఇంధన భద్రతను ఇది బలోపేతం చేస్తుంది. మొత్తానికి, ఈ ప్రాజెక్టు రాజస్థాన్ రాష్ట్రాన్ని జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో ఒక పారిశ్రామిక కేంద్రంగా నిలబెట్టనుంది. ప్రమాదాలు జరిగినప్పటికీ, దేశ ఆర్థిక వృద్ధిలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. ప్రస్తుతం ఘటనా స్థలంలో మంటలను
తాజావార్తలు
-
Mamata Banerjeeకి హైకోర్టులో ఎదురుదెబ్బ.. ప్రతిపక్ష నేతగా రితబ్రత కొనసాగింపుకు గ్రీన్ సిగ్నల్.!
-
Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ తెలుగు 10 లోకి కాంట్రవర్సీ యూట్యూబర్ నందన ?
-
NEET Re Exam: నీట్ రీ-ఎగ్జామ్కు ముందు విషాదం.. 19 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య..
-
Fahadh Faasil : ‘దృశ్యం 3’ నిర్మాతలతో ఫహద్ ఫాసిల్ క్రేజీ డీల్… వరుస ప్రాజెక్టులు
-
Hyderabad: ఫ్రీజర్లో పురుగులు, స్టోరేజ్లో బల్లులు.. ‘లా పినోజ్ పిజ్జా’ కిచెన్ చూసి షాకైన అధికారులు!
ట్రెండింగ్
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!