Wife Kills Husband: ఇన్స్ట్రాగ్రామ్ ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
- ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య..
- ఇన్స్టాగ్రామ్లో ప్రేమగా మారిన పరిచయం..
- పక్కా పథకం ప్రకారం హత్య చేసిన ఇద్దరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Kills Husband: రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో ఒక హత్య సంచలనం సృష్టించింది. ఇన్స్ట్రాగ్రామ్లో పరిచయమైన ఒక వ్యక్తితో ప్రేమలో పడిన మహిళ, తన భర్తను దారుణంగా కుట్ర పన్ని హత్య చేసింది. ఈ హత్యకు ఆమె ప్రియుడు సహకరించాడు. ఈ ఘటనలో ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 4న బార్మర్ జిల్లాలోని మాల్పురా ఫాంటా సమీపంలోని ఓ పొలంలో ఉన్న నీటి ట్యాంకులో 42 ఏళ్ల తేజారామ్ మృతదేహం కనిపించింది. ఇది జరిగిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మృతుడి సోదరుడు మహేశ్వరం ఫిర్యాదు మేరకు, తేజారామ్ భార్య నేతల్, ఆమె ప్రియుడు గుమాన్ సింగ్లపై అనుమానం వ్యక్తం చేశారు. గుమాన్ సింగ్ టాక్సీ డ్రైవర్గా పని చేస్తున్నారు. ఇతడికి నేతల్తో వివాహేతర సంబంధం ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నేతల్కు ఇన్స్టాగ్రామ్లో 42 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. వీరిద్దరి మధ్య ఇన్స్టా ద్వారా పరిచయం ఏర్పడి, ఆ తర్వాత వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీని గురించి తెలిసిన తేజారామ్, భార్యను పలుమార్లు మందలించాడు.
Also Read
- CP Tarun Joshi: 20 నిమిషాల్లోనే ఆరుగురిని చంపేసిన రాజ్ కుమార్.. సంచలన విషయాలు వెలుగులోకి
- Shabad M*urder Case: రాత్రి 11 నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు కొనసాగిన హత్యలు.. ముందుగా మైనర్ బాలికను తీసుకెళ్లి..
- Bahamas Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 10 మంది దుర్మరణం.. స్వాతంత్ర్య వేడుకల వేళ విషాదం
- Suhas Murder : డబ్బుల గొడవతోనే అర్ధరాత్రి పిలిచి స్నేహితుడి హత్య..
ఈ నేపథ్యంలోనే భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన ఇద్దరు మాస్టర్ ప్లాన్ వేశారు. జూన్ 2న నేతల్ తన భర్తకు ఫోన్ చేసి, తాను ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నానని చెప్పింది. ఆందోళన చెందిన తేజారామ్ ఆమె కోసం వెతకడం ప్రారంభించాడు. ఆ సమయంలో గుమాన్ సింగ్ అతడిని ధోరిమన్నాకు రమ్మని పిలిచి, అక్కడే తేజారామ్కు మద్యం తాగించి మత్తులోకి వెళ్లిన తర్వాత, మాల్పురా ఫాంటా సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి నీళ్ల ట్యాంకులో పడేసి హత్య చేశాడు. మత్తులో ఉన్న తేజారామ్ నీటిలో మునిగి మరణించాడు.
హత్య తర్వాత తేజారామ్ మొబైల్ ఫోన్, బ్యాగ్ అక్కడే పడేసి ఇద్దరూ పరారయ్యారు. మృతుడి మొబైల్, కాల్ రికార్డులు, ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా పోలీసులు కేసును ఛేదించారు. భార్య నేతల్ను జ్యుడిషియల్ కస్టడీకి పంపగా, గుమాన్ సింగ్ ను పోలీస్ కస్టడీకి తరలించారు.
తాజావార్తలు
-
LPG Connection Transfer Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 రూల్స్ పాటించకపోతే కనెక్షన్ కట్..!
-
Deepika Padukone: 40 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి కాబోతున్న దీపిక… త్వరలోనే గుడ్ న్యూస్
-
PM Modi: 2030 నాటికి వాణిజ్యం రెట్టింపు లక్ష్యం.. మోడీ పర్యటనలో భారత్-న్యూజిలాండ్ కీలక నిర్ణయాలు
-
Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
-
CP Tarun Joshi: 20 నిమిషాల్లోనే ఆరుగురిని చంపేసిన రాజ్ కుమార్.. సంచలన విషయాలు వెలుగులోకి
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!