Wife Kills Husband: ఇన్స్ట్రాగ్రామ్ ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
- ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య..
- ఇన్స్టాగ్రామ్లో ప్రేమగా మారిన పరిచయం..
- పక్కా పథకం ప్రకారం హత్య చేసిన ఇద్దరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Kills Husband: రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో ఒక హత్య సంచలనం సృష్టించింది. ఇన్స్ట్రాగ్రామ్లో పరిచయమైన ఒక వ్యక్తితో ప్రేమలో పడిన మహిళ, తన భర్తను దారుణంగా కుట్ర పన్ని హత్య చేసింది. ఈ హత్యకు ఆమె ప్రియుడు సహకరించాడు. ఈ ఘటనలో ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 4న బార్మర్ జిల్లాలోని మాల్పురా ఫాంటా సమీపంలోని ఓ పొలంలో ఉన్న నీటి ట్యాంకులో 42 ఏళ్ల తేజారామ్ మృతదేహం కనిపించింది. ఇది జరిగిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మృతుడి సోదరుడు మహేశ్వరం ఫిర్యాదు మేరకు, తేజారామ్ భార్య నేతల్, ఆమె ప్రియుడు గుమాన్ సింగ్లపై అనుమానం వ్యక్తం చేశారు. గుమాన్ సింగ్ టాక్సీ డ్రైవర్గా పని చేస్తున్నారు. ఇతడికి నేతల్తో వివాహేతర సంబంధం ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నేతల్కు ఇన్స్టాగ్రామ్లో 42 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. వీరిద్దరి మధ్య ఇన్స్టా ద్వారా పరిచయం ఏర్పడి, ఆ తర్వాత వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీని గురించి తెలిసిన తేజారామ్, భార్యను పలుమార్లు మందలించాడు.
Also Read
- Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
- Karnataka: కన్న కూతురుపై తండ్రి పగ.. కాలేజీకెళ్లి కత్తి దాడి.. దేనికోసమో తెలిస్తే..!
- Bihar Crime: బట్టలూడదీసి.. నగ్నంగా...! భర్తను లవర్తో కలిసి కడతేర్చిన భార్య ఎపిసోడ్లో ట్విస్ట్
- Bihar: భోజనం ఆలస్యమైందని.. వదిన తల నరికి, ఇంటి ముందు వేలాడదీసిన వ్యక్తి..
ఈ నేపథ్యంలోనే భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన ఇద్దరు మాస్టర్ ప్లాన్ వేశారు. జూన్ 2న నేతల్ తన భర్తకు ఫోన్ చేసి, తాను ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నానని చెప్పింది. ఆందోళన చెందిన తేజారామ్ ఆమె కోసం వెతకడం ప్రారంభించాడు. ఆ సమయంలో గుమాన్ సింగ్ అతడిని ధోరిమన్నాకు రమ్మని పిలిచి, అక్కడే తేజారామ్కు మద్యం తాగించి మత్తులోకి వెళ్లిన తర్వాత, మాల్పురా ఫాంటా సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి నీళ్ల ట్యాంకులో పడేసి హత్య చేశాడు. మత్తులో ఉన్న తేజారామ్ నీటిలో మునిగి మరణించాడు.
హత్య తర్వాత తేజారామ్ మొబైల్ ఫోన్, బ్యాగ్ అక్కడే పడేసి ఇద్దరూ పరారయ్యారు. మృతుడి మొబైల్, కాల్ రికార్డులు, ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా పోలీసులు కేసును ఛేదించారు. భార్య నేతల్ను జ్యుడిషియల్ కస్టడీకి పంపగా, గుమాన్ సింగ్ ను పోలీస్ కస్టడీకి తరలించారు.
తాజావార్తలు
-
JIO New Offer: నెల ఉచిత వైఫై, 100Mbps ఇంటర్నెట్, 12 OTT యాప్లు, 1,000 టీవీ ఛానెల్స్..
-
El Nino Alert: ఐఎండీ అలర్ట్.. ఆగస్టులో తక్కువ వర్షాలుంటాయని హెచ్చరిక
-
Mega Multistarrer: స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో చిరంజీవి – నాగార్జున మల్టీస్టారర్..? మెగా మూవీపై భారీ బజ్!
-
Rashmika Mandanna : తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక?
-
HYDRAA : హైడ్రాపై హైకోర్టు ఫైర్.. కమిషనర్ బదిలీకి ఆదేశాలు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!