Rajahmundry ATM Robbery Case: ఏటీఎంలలో పెట్టాల్సిన రూ.2 కోట్లతో పరారీ.. గుర్తుపట్టకుండా గుండు గీయించుకొని..!
- ఏటీఎంలలో నింపాల్సిన డబ్బులతో ఉడాయించిన కేసును ఛేధించిన రాజమండ్రి పోలీసులు..
- నిందితుడు అశోక్ అరెస్ట్.. రూ.2 కోట్ల 20 లక్షల 50 వేలు స్వాధీనం..
Rajahmundry ATM Robbery Case: ఏటీఎంలలో నింపాల్సిన డబ్బులతో ఓ ఉద్యోగి పరారయ్యాడు.. ఏకంగా రూ.2 కోట్ల 20 లక్షలకు పైగా క్యాష్తో కనబడకుండా పోయాడు.. అంతేకాదు.. గుండు గీయించుకున్నాడు.. కానీ, కేవలం 12 గంటలు కూడా గడవకముందే పోలీసులకు చిక్కాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజమండ్రి పోలీసులకు చిక్కిన ఘరానా దోపిడికి పాల్పడిన హీటాచీ క్యాష్ మేనేజ్ మెంట్ సంస్థ ఉద్యోగి వాసంశెట్టి అశోక్.. ఏటీఎంల్లో నింపాల్సిన రెండు కోట్ల 20 లక్షల 50 వేల రూపాయలతో అశోక్ పరారయ్యాడు.. హెచ్డీఎఫ్సీ దానవాయిపేట బ్రాంచ్ నుండి డబ్బులు విత్ డ్రా చేసి బయట ఏటీఎం సెక్యూరిటీ కళ్లు గప్పి దోడ్డి దారిన పరారయ్యాడు అశోక్.. ఇక, హీటాచీ క్యాష్ మేనేజ్ మెంట్ సంస్థ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రాజమండ్రి వన్ టౌన్ పోలీసులు.. ఆరు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు..
Read Also: Liquor Shops Closed: 28, 29 తేదీల్లో హైదరాబాద్ లో వైన్ షాపులు పూర్తిగా బంద్..
Also Read
అయితే, నిందితుడు అశోక్ డబ్బులతో సిఫ్ట్ కారులో ఉడాయించిననట్లు సమాచారం సేకరించారు పోలీసులు.. కారును అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో వదిలి పరారయ్యాడు.. స్వగ్రామం కపిలేశ్వరం మండలం మాచర్ల మెట్ట గ్రామంలోని తన ఇంట్లో ఉన్న అశోక్ ను తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. తనను ఎవరూ గుర్తుపట్టకుండగా ఉండే విధంగా గుండు చేయించుకుని ఊళ్లో తిరిగాడట అశోక్.. మొత్తంగా ఘటన జరిగిన 12 గంటల లోపే ఘరానా దోపిడీ కేసును ఛేదించారు రాజమండ్రి పోలీసులు.. దోపిడీ చేసిన రెండు కోట్ల 20 లక్షల 50 వేల రూపాయలతోపాటు కారు స్వాధీనం చేసుకున్నారు.. ఈ కేసులో ఉదయం 11 గంటలకు రాజమండ్రిలో మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టనున్నారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహామూర్తి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!