United Alliance Technology: ఉద్యోగాల పేరిట భారీ మోసం.. బోర్డు తిప్పేసిన కంపెనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Software Company In Hitech City Cheated In The Name Of Jobs: ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి భారీ డబ్బులు వసూలు చేసి.. ఆ తర్వాత కంపెనీలు బోర్డు తిప్పేస్తున్న ఘటనలు ఈమధ్య తరచుగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా మరో కంపెనీ కూడా అలాగే బోర్డు తిప్పేసింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి, వారి వద్ద నుంచి ఆ సంస్థ లక్షలకు లక్షలు వసూలు చేసింది. మొదట్లో ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా నాటకాలు కూడా ఆడటంతో.. తమకు ఉద్యోగాలు పక్కాగా వస్తాయని బాధితులు నమ్మారు. తీరా చూస్తే.. తాము దారుణంగా మోసపోయామని గ్రహించి, పోలీసుల్ని ఆశ్రయించారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Kunamneni Sambasiva Rao: బీజేపీతోనే దేశానికి ప్రమాదం.. బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలి
Also Read
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
- Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- Meerpet Murder : గోనె సంచిలో ఆయా శవం.. మీర్పేట్లో దారుణ హత్య
కొండాపూర్లోని ఏఎంబీ మాల్కి ఎదురుగా యునైటెడ్ అలయన్స్ టెక్నాలజీ ఐటీ పేరుతో ముగ్గురు వ్యక్తులు ఒక కంపెనీని ఏర్పాటు చేశారు. మంచి ప్యాకేజ్లతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రకటనలు ఇచ్చారు. ఆ కంపెనీలోని ఆర్భాటాలను, విధివిధానాల్ని చూసి.. నిరుద్యోగులు ఆ సంస్థని సంప్రదించడం మొదలుపెట్టారు. సాఫ్ట్వేర్ జాబ్ తప్పకుండా ఇప్పిస్తామని చెప్పి.. ట్రైనింగ్ కోసం రూ.1.50 లక్షల నుంచి 3.50 లక్షల వరకు బాధితుల నుంచి డబ్బులు వసూలు చేశారు. అలా బాధితుల నుంచి భారీ మొత్తం వసూలు చేసిన తర్వాత.. నెల రోజుల పాటు ఆన్లైన్లో ట్రైనింగ్ క్లాసులు నిర్వహించారు. ఇంటర్వ్యూ సమయంలో చురుకుగా ఎలా వ్యవహరించాలి? ఎటువంటి ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి? అనే విషయాలపై అవగాహన కల్పిస్తూ.. పెద్ద బిల్డప్పులే ఇచ్చారు.
K Laxman: యువత బతుకుల్ని తెలంగాణ ప్రభుత్వం ఆగం చేసింది
అయితే.. గత నెల రోజుల నుండి కంపెనీ యాజమాన్యం నుంచి బాధితులకు ఎలాంటి స్పందన రాలేదు. దీంతో.. బాధితులందరూ కలిసి కొండాపూర్లో ఉన్న కంపెనీ వద్దకు వచ్చారు. అక్కడికి రాగానే.. అందరికీ ఒక్కసారిగా ఊహించని షాక్ తగిలింది. అక్కడ కంపెనీ మూతపడి ఉంది. అప్పుడు తాము మోసపోయామన్న అసలు విషయం తెలిసింది. దీంతో.. నేరుగా మాధాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్లి, సదరు కంపెనీపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఇది ఫెడరల్ స్ఫూర్తిపై దెబ్బ.. పార్లమెంట్లో పంచాయితీ ఖాయం
-
Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
-
CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
-
Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
-
Hyderabad Traffic : హైదరాబాద్ ట్రాఫిక్కు అసలు విలన్ ఎవరు.?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!