crime news: భర్తతో విభేదాల కారణంగా తన మూడేళ్ల కుమారుడికి కాల్చి చంపిన తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భర్తతో విభేదాల కారణంగా కొడుకు తుపాకితో కాల్చిన తల్లి.. తానూ కాల్చుకుని చనిపోయింది. మెరికాలోని టెక్సాస్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లో కి వెళితే.. 32 ఏళ్ల సవన్నా క్రిగర్ కి తన భర్తతో విభేదాలు వచ్చాయి. విడాకుల అనంతరం కొడుకు ఎవరి దగ్గర ఉండాలనే విషయంలో కోర్టు కేసు నడుస్తోంది. మూడేళ్ల కొడుకు కైడెన్ కస్టడీకి సంబంధించి గురువారం ఫైనల్ హియరింగ్ ఉంది. కాగా.. క్రిగర్ బుధవారం ఉదయమే లేచిన గబగబా రెడీ అయి, కొడుకు కైడెన్ ను డే కేర్ సెంటర్ లో దింపేసింది. తాను ఆఫీస్ కు బయల్దేరింది. అక్కడ హెచ్ ఆర్ ను కలిసి, తన జాబ్ కి సంబంధించి రాజీనామా పత్రాన్ని ఇచ్చింది. తన క్యాబిన్ లోకి వెళ్లి, ముఖ్యమైన డాక్యుమెంట్స్, ఇతర వస్తువులు తీసుకుని ఆఫీస్ నుంచి బయటకు వచ్చింది. అక్కడి నుంచి నేరుగా తన మాజీ భర్త, గతంలో తాము కలిసి ఉన్న ఇంటికి వెళ్లింది. అప్పటికే, ఫ్లాట్ కు తాళం వేసి ఆమె భర్త ఆఫీస్ కు వెళ్లిపోయాడు. తన వద్ద ఉన్న మారు తాళం చెవితో ఇంట్లోకి వెళ్లిన సవన్నా.. అక్కడి వస్తువులను ధ్వంసం చేసింది. ముఖ్యమైన డాక్యుమెంట్స్ ను చింపేసింది. తమ పెళ్లి నాటి వెడ్డింగ్ గౌన్ ను బయటకు తీసి బెడ్ పై వేసి తగలపెట్టింది.
READ MORE: KCR: కేసీఆర్ బస్సు యాత్రలో చేతివాటం.. డిప్యూటీ మేయర్ బంగారం, కౌన్సిలర్ డబ్బు చోరీ..
Also Read
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
ఆ తరువాత అక్కడి నుంచి డైరెక్ట్ గా తన కొడుకు ఉన్న డే కేర్ సెంటర్ కు వెళ్లి, కొడుకు కైడెన్ ను పికప్ చేసుకుంది. తనను తీసుకుని, తను ఉంటున్న ఇంటి సమీపంలోకి చిన్న పార్క్ లోకి వెళ్లింది. పార్క్ లో కాస్త నిర్మానుష్యంగా ఉన్న చిన్న గుంత లాంటి ప్రదేశంలోకి వెళ్లి, ఒక చిన్న చెట్టు కింద కూర్చుంది. ఆ తరువాత తన ఐ ఫోన్ తీసుకుని తన మాజీ భర్తకు ఫేస్ టైమ్ లో కాల్ చేసింది. ఫోన్ కెమెరాను తన కుమారుడి ఫేస్ ముందు ఉంచి.. ‘‘డాడీకి గుడ్ బై చెప్పు’’ అన్నది. తండ్రి ముఖం చూడగానే తన తల్లి ఉద్దేశం అర్థ కాని ఆ చిన్నారి నవ్వుతూ తండ్రికి గుడ్ బై చెప్పింది. ఆ వెంటనే, సవన్నా తన బ్యాగ్ లో నుంచి పిస్టల్ ను తీసి, తన కొడుకుకు ముద్దు పెట్టి, సారీ చెబుతూ, గురిపెట్టి కాల్చేసింది. క్షణాల్లో ఆ చిన్నారి విగతజీవిగా మారిపోయాడు. ఆ వెంటనే, తన నుదిటిపై కాల్చుకుని ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. ఇదంతా కళ్లారా చూసిన ఆ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులకు పార్క్ లోని ఒక మూల తల్లీ, కొడుకుల మృతదేహాలు కనిపించాయి. సవన్నా క్రిగర్, తన కుమారుడు కైడెన్ గా గుర్తించారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..