crime news: భర్తతో విభేదాల కారణంగా తన మూడేళ్ల కుమారుడికి కాల్చి చంపిన తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భర్తతో విభేదాల కారణంగా కొడుకు తుపాకితో కాల్చిన తల్లి.. తానూ కాల్చుకుని చనిపోయింది. మెరికాలోని టెక్సాస్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లో కి వెళితే.. 32 ఏళ్ల సవన్నా క్రిగర్ కి తన భర్తతో విభేదాలు వచ్చాయి. విడాకుల అనంతరం కొడుకు ఎవరి దగ్గర ఉండాలనే విషయంలో కోర్టు కేసు నడుస్తోంది. మూడేళ్ల కొడుకు కైడెన్ కస్టడీకి సంబంధించి గురువారం ఫైనల్ హియరింగ్ ఉంది. కాగా.. క్రిగర్ బుధవారం ఉదయమే లేచిన గబగబా రెడీ అయి, కొడుకు కైడెన్ ను డే కేర్ సెంటర్ లో దింపేసింది. తాను ఆఫీస్ కు బయల్దేరింది. అక్కడ హెచ్ ఆర్ ను కలిసి, తన జాబ్ కి సంబంధించి రాజీనామా పత్రాన్ని ఇచ్చింది. తన క్యాబిన్ లోకి వెళ్లి, ముఖ్యమైన డాక్యుమెంట్స్, ఇతర వస్తువులు తీసుకుని ఆఫీస్ నుంచి బయటకు వచ్చింది. అక్కడి నుంచి నేరుగా తన మాజీ భర్త, గతంలో తాము కలిసి ఉన్న ఇంటికి వెళ్లింది. అప్పటికే, ఫ్లాట్ కు తాళం వేసి ఆమె భర్త ఆఫీస్ కు వెళ్లిపోయాడు. తన వద్ద ఉన్న మారు తాళం చెవితో ఇంట్లోకి వెళ్లిన సవన్నా.. అక్కడి వస్తువులను ధ్వంసం చేసింది. ముఖ్యమైన డాక్యుమెంట్స్ ను చింపేసింది. తమ పెళ్లి నాటి వెడ్డింగ్ గౌన్ ను బయటకు తీసి బెడ్ పై వేసి తగలపెట్టింది.
READ MORE: KCR: కేసీఆర్ బస్సు యాత్రలో చేతివాటం.. డిప్యూటీ మేయర్ బంగారం, కౌన్సిలర్ డబ్బు చోరీ..
Also Read
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
ఆ తరువాత అక్కడి నుంచి డైరెక్ట్ గా తన కొడుకు ఉన్న డే కేర్ సెంటర్ కు వెళ్లి, కొడుకు కైడెన్ ను పికప్ చేసుకుంది. తనను తీసుకుని, తను ఉంటున్న ఇంటి సమీపంలోకి చిన్న పార్క్ లోకి వెళ్లింది. పార్క్ లో కాస్త నిర్మానుష్యంగా ఉన్న చిన్న గుంత లాంటి ప్రదేశంలోకి వెళ్లి, ఒక చిన్న చెట్టు కింద కూర్చుంది. ఆ తరువాత తన ఐ ఫోన్ తీసుకుని తన మాజీ భర్తకు ఫేస్ టైమ్ లో కాల్ చేసింది. ఫోన్ కెమెరాను తన కుమారుడి ఫేస్ ముందు ఉంచి.. ‘‘డాడీకి గుడ్ బై చెప్పు’’ అన్నది. తండ్రి ముఖం చూడగానే తన తల్లి ఉద్దేశం అర్థ కాని ఆ చిన్నారి నవ్వుతూ తండ్రికి గుడ్ బై చెప్పింది. ఆ వెంటనే, సవన్నా తన బ్యాగ్ లో నుంచి పిస్టల్ ను తీసి, తన కొడుకుకు ముద్దు పెట్టి, సారీ చెబుతూ, గురిపెట్టి కాల్చేసింది. క్షణాల్లో ఆ చిన్నారి విగతజీవిగా మారిపోయాడు. ఆ వెంటనే, తన నుదిటిపై కాల్చుకుని ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. ఇదంతా కళ్లారా చూసిన ఆ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులకు పార్క్ లోని ఒక మూల తల్లీ, కొడుకుల మృతదేహాలు కనిపించాయి. సవన్నా క్రిగర్, తన కుమారుడు కైడెన్ గా గుర్తించారు.
తాజావార్తలు
-
Pradeep Kumar IAS: పదవీ విరమణ రోజే సీబీఐ షాక్.. ఐఏఎస్ ప్రదీప్ కుమార్ అరెస్టు.. కారణం ఇదే!
-
Jr NTR : ఎన్టీఆర్ అన్స్టాపబుల్ లైనప్.. మూడు భారీ ప్రాజెక్టులపైనే ఫుల్ ఫోకస్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
AAA Cinemas: విశాఖలో అల్లు అర్జున్ ‘AAA’ సినిమాస్.. 8 స్క్రీన్లతో ప్రీమియం మూవీ ఎక్స్పీరియెన్స్కు సిద్ధం!
-
Vaibhav Sooryavanshi: ఏమో ఎవరికి తెలుసు.. వైభవ్ సూర్యవంశీ బలహీనతను అతడు కనిపెట్టాడేమో!
ట్రెండింగ్
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!