Pithapuram Crime: పిఠాపురంలో దారుణం.. మైనర్ బాలికకు మద్యం తాగించి అత్యాచారం.. ఆపై..!
- కాకినాడ జిల్లా పిఠాపురంలో దారుణం..
- మైనర్ బాలికకు మద్యం తాగించి అత్యాచారం..
- నిందితుడు కార్పొరేటర్ భర్తగా గుర్తింపు..
- నిందితుడికి సహకరించిన మరో మహిళ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pithapuram Crime: కాకినాడ జిల్లా పిఠాపురంలో దారుణమైన ఘటన జరిగింది.. ఇందిరానగర్ లో మైనర్ బాలికకు మద్యం పట్టించి.. ఆపై అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి కుటుంబ సభ్యులు.. నిందితుడిగా పేర్కొంటున్న మాజీ కౌన్సిలర్ భర్త జాన్ బాబును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు.. జాన్ బాబుకు మరో మహిళ సహకరించినట్లుగా తెలుస్తుంది.. బలవంతంగా ఆటో ఎక్కించి డంపింగ్ యార్డ్ దగ్గరికి తీసుకుని వెళ్ళినట్లు చెబుతున్నారు మైనర్ బాలిక బంధువులు.. మరోవైపు.. అపస్మారక స్థితిలో ఉన్న బాలిక ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతుంది, పోలీసుల అదుపులో జాన్ బాబుతో పాటు మరో మహిళ ఉన్నారు.. పోలీసుల విచారణలో ఇద్దరూ పొంతన లేని సమాధానాలు చెబుతున్నారట.. జాన్ బాబు ఆటో ఎందుకు ఎక్కించుకున్నావంటే.. మామూలుగానే ఎక్కించుకున్నాను.. మీరు ఏం చేసినా పర్వాలేదని సమాధానం చెబుతున్నట్టుగా తెలుస్తోంది..
Read Also: T20 World Cup 2024: ప్రపంచకప్లో ఇంగ్లండ్కు రెండో విజయం.. మరొక్క గెలుపే!
Also Read
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
- TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
అయితే, సోమవారం రోజు ఆటో నడుపుకుంటూ వచ్చిన జాన్ బాబు.. మరో మహిళ.. ఓ కాగితం చూపించి మైనర్ అయిన దళిత బాలికను అడ్రస్ అడిగారు.. ఆ బాలిక అడ్రస్ చెబుతుండగా.. ఆమెపై మత్తు మందు స్ర్పే చేసి ఆటోలో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు.. పిఠాపురం శివారు మాధవపురం రోడ్డులోని డంపింగ్యార్డు వద్దకు తీసుకువెళ్లారు. ఇక, అక్కడకు తీసుకెళ్లిన తర్వాత బాలికకు బలవంతంగా మద్యం తాగించి.. సదరు వ్యక్తి ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏం జరుగుతుందో కూడా తెలియనా ఆ బాలిక షాక్లో అపస్మారక స్థితిలో వెళ్లిపోయింది.. ఆ తర్వాత బాలికను మళ్లీ ఆటో ఎక్కించేందుకు ప్రయత్నిస్తుండగా.. గమనించిన ప్లాస్టిక్ వస్తువులు సేకరించే మహిళ.. వారిని నిలదీసింది.. వెంటనే బాలిక బంధువులకు సమాచారం అందించింది. బాలిక కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి కిడ్నా్పకు పాల్పడిన వ్యక్తిని, మహిళను పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఆసుపత్రికి తరలించారు.. ఈ ఘటన స్థానకంగా కలకలం సృష్టించింది..
తాజావార్తలు
-
CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
-
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
-
Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
-
Vaibhav Suryavanshi: హరారేలో వైభవ్ ట్రాక్ రికార్డు ఇదే.. జింబాబ్వేకు కూడా దబిడిదిబిడే!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
ట్రెండింగ్
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!