Hyderabad: చివరిసారిగా మాట్లాడాలన్నాడు.. కారులో బంధించి అఘాయిత్యం చేశాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ అంటే ప్రాణం తియ్యడం కాదు. ప్రాణం పోయే వరకు ప్రేమించిన వాళ్ళ సంతోషాన్ని కోరుకోవడం. పేమించడం అంటే ప్రేమను ఇవ్వడం.. తిరిగి ఆశించకపోవడం. కానీ ప్రస్తుతం ప్రేమ పేరుతో దారుణాలకు పాలపడుతున్నారు యువత. ప్రేమ పేరుతో ప్రాణం తీసుకుంటున్నారు. లేదా ప్రాణాలను తీస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. చిన్ననాటి స్నేహితురాలు.. ప్రస్తుతం ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని ప్రియురాలి పైన దాడి చేసి.. తాను ఆత్మహత్యా యత్నం చేసాడు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధి లోని డిఏఈ కాలనీకి చెందిన మెరుగు వంశీ(21) అనే యువకుడు, మౌలాలి ఎంజే కాలనీకి చెందిన యువతి చిన్నప్పటి నుండి క్లాస్ మేట్స్, ఒకే స్కూల్, ఒకే కాలేజ్, మంచి స్నేహితులు. ఆ చిన్ననాటి స్నేహం వారితో పాటు పెరిగి ప్రేమగా మారింది.
Read also:Venkatesh : తన సూపర్ హిట్ సాంగ్కి లారెన్స్ తో డ్యాన్స్ వేసిన వెంకీ.. ఆ జోష్ తగ్గలేదు..
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
గత కొంత కాలంగా ఇద్దరు ప్రేమలో ఉన్నారు. కాగా ఏమైనదో తెలీదుగానీ.. ఇకపై తనకు దూరంగా వుండాలని.. ఇక్కడితో ప్రేమ వ్యవహారాన్ని మరిచిపోవాలని ప్రియుడికి చెప్పింది. అయితే ఒక్కసారిగా ప్రియురాలు బ్రేకప్ చెప్పడంతో వంశీ తట్టుకోలేకపోయాడు. ఆవేశంలో సైకోలా మారిన అతడు ప్రియురాలిని చంపి తానుకూడా సూసైడ్ చేసుకోవాలని దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో నిన్న (శనివారం) తన ప్రియురాలికి ఫోన్ చేసి చివరిసారిగా ఓసారి మాట్లాడాలని చెప్పి బయటకు పిలిచాడు వంశీ. అందుకు ప్రియురాలు అంగీకరించడంతో ఇద్దరూ కలిసి డిఏఈ కాలనీకి కారులో వెళ్లారు. ఓ చోట కారు ఆపిన వంశీ వెంటతెచ్చుకున్న కత్తితీసి ప్రియురాలిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఆమె కడుపు, మెడ భాగంలో గాయాలు అయ్యాయి.
Read also:Health Tips : రోజూ ఉదయాన్నే తులసి నీళ్లను తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
దీనితో ఆ యువతి ప్రాణభయంతో కేకలు వేసింది. యువతి కేకలు విన్న స్థానికులు కారుచుట్టు గుమ్మిగూడారు. ఈ క్రమంలో వంశీ తనను తాను పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇలా ఇద్దరి రక్తంతో కారంతా రక్తసిక్తం అయ్యింది. కాగా స్థానికులు కార్ అద్దాలను పగల గొట్టి ఇద్దర్ని దగ్గర లోని ఆసుపత్రికి తరలించారు. కాగా వెంటనే వైద్యం అందడంతో ఇద్దరి ప్రాణాలకు హాని తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కుషాయిగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!