Hyderabad: చివరిసారిగా మాట్లాడాలన్నాడు.. కారులో బంధించి అఘాయిత్యం చేశాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ అంటే ప్రాణం తియ్యడం కాదు. ప్రాణం పోయే వరకు ప్రేమించిన వాళ్ళ సంతోషాన్ని కోరుకోవడం. పేమించడం అంటే ప్రేమను ఇవ్వడం.. తిరిగి ఆశించకపోవడం. కానీ ప్రస్తుతం ప్రేమ పేరుతో దారుణాలకు పాలపడుతున్నారు యువత. ప్రేమ పేరుతో ప్రాణం తీసుకుంటున్నారు. లేదా ప్రాణాలను తీస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. చిన్ననాటి స్నేహితురాలు.. ప్రస్తుతం ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని ప్రియురాలి పైన దాడి చేసి.. తాను ఆత్మహత్యా యత్నం చేసాడు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధి లోని డిఏఈ కాలనీకి చెందిన మెరుగు వంశీ(21) అనే యువకుడు, మౌలాలి ఎంజే కాలనీకి చెందిన యువతి చిన్నప్పటి నుండి క్లాస్ మేట్స్, ఒకే స్కూల్, ఒకే కాలేజ్, మంచి స్నేహితులు. ఆ చిన్ననాటి స్నేహం వారితో పాటు పెరిగి ప్రేమగా మారింది.
Read also:Venkatesh : తన సూపర్ హిట్ సాంగ్కి లారెన్స్ తో డ్యాన్స్ వేసిన వెంకీ.. ఆ జోష్ తగ్గలేదు..
Also Read
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
గత కొంత కాలంగా ఇద్దరు ప్రేమలో ఉన్నారు. కాగా ఏమైనదో తెలీదుగానీ.. ఇకపై తనకు దూరంగా వుండాలని.. ఇక్కడితో ప్రేమ వ్యవహారాన్ని మరిచిపోవాలని ప్రియుడికి చెప్పింది. అయితే ఒక్కసారిగా ప్రియురాలు బ్రేకప్ చెప్పడంతో వంశీ తట్టుకోలేకపోయాడు. ఆవేశంలో సైకోలా మారిన అతడు ప్రియురాలిని చంపి తానుకూడా సూసైడ్ చేసుకోవాలని దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో నిన్న (శనివారం) తన ప్రియురాలికి ఫోన్ చేసి చివరిసారిగా ఓసారి మాట్లాడాలని చెప్పి బయటకు పిలిచాడు వంశీ. అందుకు ప్రియురాలు అంగీకరించడంతో ఇద్దరూ కలిసి డిఏఈ కాలనీకి కారులో వెళ్లారు. ఓ చోట కారు ఆపిన వంశీ వెంటతెచ్చుకున్న కత్తితీసి ప్రియురాలిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఆమె కడుపు, మెడ భాగంలో గాయాలు అయ్యాయి.
Read also:Health Tips : రోజూ ఉదయాన్నే తులసి నీళ్లను తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
దీనితో ఆ యువతి ప్రాణభయంతో కేకలు వేసింది. యువతి కేకలు విన్న స్థానికులు కారుచుట్టు గుమ్మిగూడారు. ఈ క్రమంలో వంశీ తనను తాను పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇలా ఇద్దరి రక్తంతో కారంతా రక్తసిక్తం అయ్యింది. కాగా స్థానికులు కార్ అద్దాలను పగల గొట్టి ఇద్దర్ని దగ్గర లోని ఆసుపత్రికి తరలించారు. కాగా వెంటనే వైద్యం అందడంతో ఇద్దరి ప్రాణాలకు హాని తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కుషాయిగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
-
RC 17: చరణ్ ఫాన్స్.. రెడీ అవండమ్మా!
-
E30 Petrol: పెట్రోల్లో పెరగనున్న ఇథనాల్ శాతం.. వాహనదారులకు లాభమా? నష్టమా?
-
Drishyam 3: దృశ్యం క్రేజ్ అదృశ్యం!
-
CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!