Cigarette Crime: సిగరెట్ పెట్టిన చిచ్చు.. అన్యాయంగా ఒకరు మృతి
A Man Stabbed To Death In Bengaluru Over Cigerette Sharing Issue: సిగరెట్ తాగే అలవాటున్న వ్యక్తులు దాన్ని సగం-సగం షేర్ చేసుకుంటుంటారు. కొందరైతే దొరికిందే ఛాన్స్ అనుకొని, ఎక్కువ పఫ్స్ లాగించేసి, మిగిలింది తమ స్నేహితులకు ఇచ్చేస్తుంటారు. ఈ క్రమంలో వారి మధ్య సరదా గొడవలు జరుగుతుంటాయి. ‘నువ్వే మొత్తం లాగించేస్తే, ఇక నాకేం మిగులుతుంది?’ అంటూ చిన్న చిన్న వాగ్వాదాలు జరుగుతాయి. అవి కూడా కామెడీ కోణంలోనే తప్ప.. మరీ ద్వేషం పెంచుకునే స్థాయికి వెళ్లదు. కానీ.. కర్ణాటకలో మాత్రం ఇలాంటి వ్యవహారం సీరియస్గా మారింది. ఒకరి ప్రాణాలు తీసేంత స్థాయికి చేరింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Akasa Air: ఆకాశ ఎయిర్ లైన్స్ కు ఉద్యోగులు కావాలి.. కంపెనీ సీఈఓ కీలక ప్రకటన
Also Read
- Pickleball Players' Plane Crash: టెక్సాస్లో ఘోర విమాన ప్రమాదం.. క్రీడాకారులతో వెళ్తున్న ఫ్లైట్ కూలి ఐదుగురు మృతి
- Drugs Seize: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్ సీజ్.!
- Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
- Shocking: 55 ఏళ్ల గ్రామపెద్దతో లేచిపోయిన 22 ఏళ్ల భార్య..
కలబుర్గి (గుల్బర్గా) జిల్లాకు చెందిన మల్లినాథ్ బిరాదర్ అనే వ్యక్తి.. బెంగళూరులోని మెజెస్టిక్ ప్రాంతంలో ఒక హోటల్లో పని చేస్తున్నాడు. అదే హోటల్లో అతనితో పాటు గణేశ్ అనే వ్యక్తి కూడా పని చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం వీళ్లిద్దరు కలిసి ఒక షాప్ వద్దకు వెళ్లారు. అక్కడ ఓ సిగరెట్ కొనుగోలు చేశారు. అప్పుడే అసలు సమస్య మొదలైంది. సిగరెట్ షేరింగ్ విషయంలో ఆ ఇద్దరి మధ్య ఓ వివాదం తలెత్తింది. అది చినికి చినికి గాలివానగా మారి, పెద్ద గొడవగా ముదిరింది. ఒకరిపై మరొకరు దాడి కూడా చేసుకున్నారు. అప్పుడు మంజునాథ్ అనే వ్యక్తి జోక్యం చేసుకొని, పరిస్థితిని అదుపు చేశాడు. ఆ గొడవ మరింత ముదరకముందే, సద్దుమణిగేలా చేశాడు. దీంతో.. ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు.
Rishabh Pant: రిషభ్ పంత్కి ఢిల్లీ క్యాపిటల్స్ అరుదైన గౌరవం
అయితే.. మరుసటి రోజు సాయంత్రం మళ్లీ ఈ గొడవ గురించి గణేశ్ ప్రస్తావించాడు. దీంతో.. గణేశ్, మల్లినాథ్ మధ్య మరోసారి గొడవ మొదలైంది. ఈసారి వీరితోపాటు మంజునాథ్ కూడా ఉన్నాడు. ఈ క్రమంలో గనేశ్ కోపం నషాళానికి ఎక్కింది. ఆ కోపంలో అతడు తనతో పాటు తెచ్చుకన్న కత్తి తీసుకొని, మల్లినాథ్పై ఎటాక్ చేశాడు. అనేక పోట్లు పొడిచాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన మల్లినాథ్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. అటు.. గణేశ్, మంజునాథ్ కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. వాళ్లు మాత్రం సురక్షితంగానే ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Vivo S50t 5G: 50MP ట్రిపుల్ కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్తో.. వివో S50t 5G విడుదల
-
Cucumber Chutney Recipe: మండుటెండలో చల్లని టేస్టీ రెసిపీ.. దోసకాయ చట్నీ ఇలా తయారు చేయండి..
-
Emergency Alert: మీ మొబైల్స్ పెద్ద శబ్దంతో మోగాయా? కంగారు పడకండి.. మేటరేంటంటే..!
-
IPL 2026 Playoffs Chances: హీటేక్కిస్తున్న ప్లేఆఫ్స్ రేస్.. టాప్-4 కోసం 10 జట్లకు ఎన్ని విజయాలు కావాలి?
-
Santosh Goyal Story: విధి వంచించిన మేధావి.. ఈ పీహెచ్డీ స్కాలర్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!