Dog Attack: నిద్రిస్తున్న వృద్ధురాలిపై కుక్కల దాడి.. చెల్లాచెదురుగా శరీర భాగాలు..
- నిద్రిస్తున్న వృద్ధురాలిపై కుక్కల దాడి..
- సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సేవాలాల్తండాలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dog Attack: గ్రామాలు, పట్టణాల్లో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గుంపులుగా వీధుల్లో తిరుగుతూ ప్రజలపై పంజా విసురుతూ ప్రాణాలు తీస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఎక్కువగా దాడి చేసి తీవ్రంగా గాయపడుతున్నారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సేవాలాల్తండాలో బుధవారం రాత్రి నిద్రిస్తున్న వృద్ధురాలిపై కుక్కలు దాడి చేసి చంపిన ఘటన ప్రజలు భయాందోళనకు గురిచేస్తుంది. గ్రామంలో పిట్ల రాజ్యలక్ష్మి ఒంటరిగా జీవిస్తోంది. రాత్రి భోజనం చేసి తన పూరిపాకలో మంచం మీద పడుకుంది. అర్ధరాత్రి కుక్కలు వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి రాజ్యలక్ష్మిపై మూకుమ్మడిగా దాడి చేశాయి. రాజ్యలక్ష్మి గట్టిగా కేకలు వేసిన రాత్రి కావడంతో ఎవరూ గమనించలేదు. కుక్కల దాడిలో లక్ష్మి శరీర భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు రక్తపు మడుగులో పడి ఉన్న లక్ష్మి మృతదేహాన్ని చూసి.. కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో గ్రామస్తులు వణికిపోతున్నారు. వీధికుక్కలు ఇంట్లోకే చొరపడి దాడులు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read also: Couple Missing: సూసైడ్ లెటర్ రాసి అదృశ్యమైన దంపతులు.. మా కోసం వెతకొద్దు అని మెసేజ్..!
Also Read
- Mysuru Horror: ఘోర విషాదం.. భార్య, ఇద్దరు కుమార్తెలను హత్య చేసి భర్త ఆత్మహత్య
- Kelly Hottle: సినీ పరిశ్రమలో విషాదం.. గాడ్జిల్లా vs కాంగ్ ఫేమ్ నటి 18 ఏళ్లకే మృతి..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్య కేసులో ట్విస్ట్.. మొదటి ప్లాన్ హత్య కాదట.!
- Tripura DGP Anurag Dhankar: పోలీసు శాఖలో తీవ్ర విషాదం.. డీజీపీ అనురాగ్ ధన్ఖడ్ ఆత్మహత్య!
జోగులాంబ గద్వాల జిల్లాలో ఇద్దరు చిన్నారులపై వీధికుక్కలు దాడి చేసి గాయపరిచాయి. జిల్లా కేంద్రంలోని 3వ వార్డు పరిధిలోని హమాలీ కాలనీలో ఆడుకుంటున్న రెండున్నరేళ్ల అశ్విత, ఏడాదిలోపు చిన్నారి రిషిపై కుక్కలు దాడి చేశాయి. గాయపడిన ఇద్దరిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. కుక్కల దాడిపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. ఏడాదికి ఒక్కసారైనా కుక్కలను పట్టుకున్నట్లుగా సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టి అధికారులు హడావుడి చేస్తున్నారని, వాటిని అడ్డుకునేది లేదని వాపోయారు. ఆసిఫాబాద్ జిల్లా ఖగజ్ నగర్ పట్టణంలోని సర్సిల్క్ కాలనీ, తైబానగర్, అశోక్ కాలనీ, ఓల్డ్ కాలనీ, ఇందిరా మార్కెట్ కాలనీల్లో రెండు రోజుల్లో 30 మందిపై కుక్కలు దాడి చేశాయి. మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి కాపాడాలని కోరుతున్నారు.
Prabhas : సుభాష్ చంద్రబోస్ పాత్రలో ప్రభాస్.. హను ప్లాన్ మామూలుగా లేదుగా ?
తాజావార్తలు
-
Bengaluru Crime: త్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. AI సాయంతో ముగ్గురిని లేపేశాడు!
-
Virat Kohli and Anushka Sharma: బురదలో చెప్పులు లేకుండా నడిచిన విరాట్, అనుష్క.. స్టార్ కపుల్ బృందావన్ వీడియో వైరల్..
-
IND vs ZIM: భారత్తో టీ20 సిరీస్.. జింబాబ్వే జట్టు ప్రకటన.. స్టార్లను కూడా వణికించే పేసర్కు చోటు!
-
Anantnag Terror Attack: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి.. కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ మృతి
-
NEET Abolition: నీట్పై ‘దళపతి’ సంచలన డిమాండ్.. అసలు నీట్ పరీక్షను రాష్ట్రాలు రద్దు చేయగలవా?
ట్రెండింగ్
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!