Human Sacrifice: సవతి తల్లి ఘాతుకం.. 4 ఏళ్ల బాలుడి నరబలి..
Human Sacrifice: కన్నబిడ్డగా చూసుకోవాల్సిన సవితి తల్లే బాలుడి పట్ల దారుణంగా వ్యవహరించింది. తన ఆరోగ్య సమస్యలు తగ్గిపోవడానికి ఓ క్షుద్రపూజారి చెప్పిన విధంగా నాలుగేళ్ల బాలుడిని బలిచ్చింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అమేథిలోని జామో ప్రాంతంలోని రెహ్సీ అనే గ్రామంలో జరిగింది. నరబలికి పాల్పడిన సవతి తల్లితో పాటు నలుగురిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సోమవారం గ్రామంలోని చెరువులో 4 ఏళ్ల బాలుడు సత్యేంద్ర శవమై కనిపించాడు. ఆదివారం ఆడుకోవడానికి బయటకు వెళ్లిన తర్వాత సత్యేంద్ర తిరిగి రాలేదు. అతని తండ్రి జితేంద్ర ప్రజాపతి కొడుకు కనిపించడం లేదని సోమవారం మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్ర సత్యేంద్ర మృతదేహం చెరువులో కనిపించింది.
Read Also: Prabhas Dubbing: ప్రభాస్ పాత్రకి డబ్బింగ్ చెప్పిన పవన్ కళ్యాణ్ విలన్.. ఎవరో తెలుసా?
Also Read
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
- Software Engineer: సాఫ్ట్వేర్ సీతారాం సూ*సైడ్ కేస్.. భార్య రేణుక తో పాటు ఆమె ఇద్దరు లవర్స్ అరెస్ట్
అయితే తన భార్య రేణుపై అనుమానం వ్యక్తం చేశాడు ప్రజాపతి. దీంతో విచారణ చేయగా మొత్తం నరబలి వ్యవహారం బయటకు వచ్చిందని అమేథి ఎస్పీ ఎలమారన్ జి తెలిపారు. భార్య రేణుతో పాటు ఆమె తండ్రి మంగ్రుప్రజాతి, తల్లి ప్రేమాదేవి, క్షుద్రపూజారి దయారావ్ యాదవ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో మంగ్రు, ప్రేమాదేవి అసలు కారణాన్ని చెప్పారు. ఏడాదిన్నర క్రితం తమ కుమార్తె రేణుకు జితేంద్రతో వివాహం జరిపించామని, మొదటి భార్య జితేంద్రను విడిచివెళ్లిపోవడంతో తమ కూతురిని ఇచ్చి పెళ్లి చేశామని తెలిపారు. పిల్లాడు సత్యేంద్ర మొదటి భార్య కుమారుడని పోలీసులు తెలిపారు. అయితే రేణు జితేంద్రతో వివాహం తర్వాత అనారోగ్యంతో, గర్భస్రావంతో బాధపడుతోందని, ఆమె సమస్యపై క్షుద్రపూజారి దయారామ్ యాదవ్ సంప్రదిస్తే.. రేణు గర్భం దాల్చాలంటే జితేంద్ర మొదటి బిడ్డను బలివ్వాలని చెప్పాడని అందుకే పిల్లాడిని చంపినట్లు నిందితులు ఒప్పుకున్నారు. క్షుద్రపూజలు జరిగిన ప్రదేశంలో నిమ్మకాయలు, టవల్, జాజికాయలు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం హత్య నేరం ఫైల్ చేశారు.
తాజావార్తలు
-
TG DGP C.V. Anand: తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతల స్వీకరణ..
-
Tandur: తాండూరులో చేతబడి కలకలం.. కూతురు ప్రేమ విఫలం కావాలని తల్లి క్షుద్రపూజలు..
-
Shubman Gill: ఈ రోజు నా రోజు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!
-
SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
-
Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!