Kaivalya Vohra: పట్టుమని 20 ఏళ్లు కూడా లేవు.. సంపాదన మాత్రం వెయ్యి కోట్లు..
ఆ కుర్రాడి వయస్సు పట్టుమని 20 ఏళ్లు కూడా లేవు.. సంపాదన మాత్రం వెయ్యి కోట్లు అంటే అంతా నోరు వెల్లబెట్టాల్సిందే.. అంతేకాదండోయో… రూ. 1,000 కోట్ల కంటే ఎక్కువ నికర ఆస్తులు కలిగిన అతి పిన్న వయస్కుడిగా కూడా రికార్డు సృష్టించాడు… అతను ఎవరో కాదు.. Zepto సహ వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా. అతి చిన్న వయసులోనే.. అంటే 19 ఏళ్ల వయసులోనే.. కోట్లు ఆర్జిస్తున్న వ్యక్తుల జాబితాలో నిలిచాడు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా తాజాగా విడుదల చేసిన ధనవంతుల జాబితా 2022లో కైవల్య వోహ్రా రూ. 1,000 కోట్లతో 1,036వ స్థానంలో నిలిచారు.
Also Read
- Rupee vs Dollar: మళ్లీ పతనమైన రూపాయి విలువ.. అమెరికన్ డాలర్తో 95.23కి.. కారణాలు ఏమిటి?
- Stock Market: హార్ముజ్ డెడ్లాక్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు
- Rule Change: మే 1 నుండి న్యూ రూల్స్.. ఎల్పీజీ ధరల నుండి క్రెడిట్ కార్డుల వరకు ఏవేం మారనున్నాయంటే?
- Mark Zuckerberg: ఫేస్బుక్ను సృష్టించిన ‘డ్రాపౌట్’.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన జుకర్బర్గ్కు డిగ్రీ లేదు తెలుసా!
కైవల్య వోహ్రా 2020లో ఆదిత్ పలిచతో కలిసి కిరాణా వస్తువులు డెలివరీ చేసే జెప్టో యాప్ను ప్రారంభించాడు.. రూ.1000 కోట్ల నికర విలువతో కైవల్య వోహ్రాను ఈ జాబితాలో నిలిపింది. ఇక, పలిచ వయస్సు కూడా 20 ఏళ్లే కావడం మరో విశేషం. అతను రూ.1,200 కోట్ల నికర ఆస్తులతో ఈ జాబితాలో చోటు సంపాదించారు.. స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీ డ్రాపౌట్స్ అయిన ఈ ఇద్దరు యువకులు ఒక సృజనాత్మక ఆలోచనతో Zepto స్థాపించి కోట్లు ఆర్జిస్తూ యువతకు ఆదర్శంగా నిలిచారు. మరోవైపు ఆ జాబితా ప్రకారం.. 1990ల్లో పుట్టిన 13 మంది యువకులు స్వయం కృషితో ఎదిగి కోటీశ్వరుల జాబితాలో నిలిచారు. మేలో, వైసీ కంటిన్యూటీ ఫండ్ నేతృత్వంలోని రౌండ్ నుండి Zepto 200 మిలియన్ డాలర్లను సేకరించింది. పెట్టుబడి తర్వాత, స్టార్ట్-అప్ దాని విలువను దాదాపు రెట్టింపు చేసి 900 మిలియన్ డాలర్ల మార్కును తాకింది. డిసెంబర్లో దీని విలువ 570 మిలియన్ డాలర్లుగా ఉంది..
కైవల్య వోహ్రా స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. Zepto కంటే ముందు, అతను మే 2020లో కిరాణాకార్ట్ అనే మరో కిరాణా డెలివరీ ప్లాట్ఫారమ్ను స్థాపించాడు. ‘జెప్టో సెకండ్’ అని పేరు పెట్టారు.. ఇది చాలా తక్కువ సమయంలో నిమిషాల్లో కిరాణా డెలివరీని వాగ్దానం చేస్తుంది. వోహ్రా మరియు పలిచ.. వాణిజ్య సంస్థను నిర్మించాలనే ప్రణాళికతో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత జెప్టోను స్థాపించారు. ఇది ప్రారంభించినప్పుడు, 10 నిమిషాల డెలివరీకి హామీ ఇచ్చింది. అయితే, అది తర్వాత నిమిషాల్లో డెలివరీగా మార్చారు.. 2023లో భారతదేశంలోని 24 నగరాల్లో విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారు.. ప్రస్తుతం, ఇది 11 నగరాల్లో పనిచేస్తుంది. ఇది అనేక నగరాల్లో రౌండ్-ది-క్లాక్ డెలివరీని కూడా చూస్తోంది. అయితే, ఇటీవల, జెప్టో.. బ్లింకిట్ నుండి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. జొమాటో జూన్లో 700 మిలియన్ల విలువతో బ్లింకిట్ను కొనుగోలు చేసింది. దీనిని గతంలో గ్రోఫర్స్ అని పిలిచేవారు.
తాజావార్తలు
-
Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్నకు ఇరాన్ వార్నింగ్
-
Bhoghi : ‘కందుల సులోచన రాణి’గా.. అనుపమ.. ఫస్ట్ లుక్ బాగుంది
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Jasprit Bumrah: సీన్ రివర్స్.. బ్యాటర్ల ముందు బెంబేలెత్తిపోతున్న బుమ్రా.. కెరీర్లోనే చెత్త ప్రదర్శన!
-
Dhruva Natchathiram : విక్రమ్ సినిమా వస్తోంది.. కానీ సూర్యతో పోటీ తప్పేలా లేదు
ట్రెండింగ్
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!