Girlfriend: పెళ్లి చేసుకోమంటే బ్లాక్మెయిల్.. రియల్టర్ శరీరాన్ని 12 ముక్కలుగా నరికి అక్కడక్కడపడవేసిన యువతి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లి అయినా.. మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.. తీరా పెళ్లి మాట ఎత్తగానే తన అసలు రూపాన్ని బయటపెట్టాడు.. నీ ఏకాంత వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్మెయిల్కు దిగాడు.. ఆ తర్వాత కొన్ని రోజులకే కనిపించకుండా పోయాడు.. అదృశ్యమైన రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రభు భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి… పోలీసుల దర్యాప్తులో అందరూ నివ్వెరపోయి విషయాలు బయటకు వచ్చాయి..
Read Also: Wipro: ఆ పని చేస్తున్న ఉద్యోగులను తొలగించిన విప్రో.. వారికి సీరియస్ వార్నింగ్..
Also Read
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
తమిళనాడులో జరిగిన ఓ దారణమైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన తన భర్త ఈ నెల 15వ తేదీ నుంచి కనిపించడంలేదంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.. అయితే, ప్రభుకి సంబంధించిన వారిని విచారించగా కవిత అనే మహిళతో వివాహేతర సంబంధం ఉందని తెలిపారు.. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.. కవితతో కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చిన ప్రభును.. పెళ్లిచేసుకోవాలని కవిత పట్టుబట్టింది.. దీంతో, బెదిరింపులకు దిగాడు ప్రభు.. తనతో ఏకాంతంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని యువతిని బ్లాక్ మెయిల్ చేశాడు.. దీంతో, ఎలాగైనా ప్రభును మట్టుబెట్టాలని ప్లాన్ వేసిన కవిత.. తెలిసినవారి సహాయం తీసుకుంది.. ప్రభును దారుణంగా హత్య చేసింది.. దుంగలను కట్ చేసే కట్టర్ మిషన్తో ప్రభు శరీర భాగాలని ఏకంగా 12 ముక్కలు చేసింది.. ముక్కలైన శరీర భాగాలను టౌన్ లో అక్కడక్కడా పడవేసింది.. పోలీసుల విచారణలో తీగ లాగితే డొంక కదిలినట్టు.. మొత్తం గుట్టు బయటపడింది… ఈ కేసులో కవితితో సహా నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు… రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రభు మిస్సింగ్, హత్య కేసును ఛేధించారు. కోయింబత్తుర్లో పలు చోట్ల దొరికిన శరీర భాగాలను అదృశ్యమైన ప్రభువిగా గుర్తించారు.. పెళ్లి విషయంలోనే ప్రభుని మిషన్ కట్టర్ తో నరికి చంపి, శరీర భాగాలని అక్కడక్కడా పడవేసినట్టు పోలీసుల విచారణలు ఆ యువతి ఒప్పుకున్నట్టుగా చెబుతున్నారు. మొత్తం ఈ కేసు తమిళనాడులో సంచలనంగా మారింది.
తాజావార్తలు
-
Shreyas Iyer: వైభవ్ను తీసుకోకపోవడం తప్పే.. ఎట్టకేలకు దారిలోకి వచ్చేసిన శ్రేయాస్ అయ్యర్..
-
SC ST Atrocities Act: బాంబే హైకోర్టు సంచలన తీర్పు.. ఇస్లాంలోకి మారితే SC/ST ఎట్రాసిటీ యాక్ట్ వర్తించదు!
-
Akhil Raj : ‘ఏందే ఫ్రీగా వస్తే తీసుకుంటారా?’ అన్నాడు.. నా తల్లిని అవమానిస్తే చూస్తూ ఊరుకోవాలా?
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Yash: ‘టాక్సిక్’ లేడీస్ వచ్చే టైం ఫిక్స్ చేసిన రాకింగ్ స్టార్.. యష్ సంచలన ట్వీట్ వైరల్!
ట్రెండింగ్
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్