Girlfriend: పెళ్లి చేసుకోమంటే బ్లాక్మెయిల్.. రియల్టర్ శరీరాన్ని 12 ముక్కలుగా నరికి అక్కడక్కడపడవేసిన యువతి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లి అయినా.. మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.. తీరా పెళ్లి మాట ఎత్తగానే తన అసలు రూపాన్ని బయటపెట్టాడు.. నీ ఏకాంత వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్మెయిల్కు దిగాడు.. ఆ తర్వాత కొన్ని రోజులకే కనిపించకుండా పోయాడు.. అదృశ్యమైన రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రభు భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి… పోలీసుల దర్యాప్తులో అందరూ నివ్వెరపోయి విషయాలు బయటకు వచ్చాయి..
Read Also: Wipro: ఆ పని చేస్తున్న ఉద్యోగులను తొలగించిన విప్రో.. వారికి సీరియస్ వార్నింగ్..
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
తమిళనాడులో జరిగిన ఓ దారణమైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన తన భర్త ఈ నెల 15వ తేదీ నుంచి కనిపించడంలేదంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.. అయితే, ప్రభుకి సంబంధించిన వారిని విచారించగా కవిత అనే మహిళతో వివాహేతర సంబంధం ఉందని తెలిపారు.. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.. కవితతో కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చిన ప్రభును.. పెళ్లిచేసుకోవాలని కవిత పట్టుబట్టింది.. దీంతో, బెదిరింపులకు దిగాడు ప్రభు.. తనతో ఏకాంతంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని యువతిని బ్లాక్ మెయిల్ చేశాడు.. దీంతో, ఎలాగైనా ప్రభును మట్టుబెట్టాలని ప్లాన్ వేసిన కవిత.. తెలిసినవారి సహాయం తీసుకుంది.. ప్రభును దారుణంగా హత్య చేసింది.. దుంగలను కట్ చేసే కట్టర్ మిషన్తో ప్రభు శరీర భాగాలని ఏకంగా 12 ముక్కలు చేసింది.. ముక్కలైన శరీర భాగాలను టౌన్ లో అక్కడక్కడా పడవేసింది.. పోలీసుల విచారణలో తీగ లాగితే డొంక కదిలినట్టు.. మొత్తం గుట్టు బయటపడింది… ఈ కేసులో కవితితో సహా నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు… రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రభు మిస్సింగ్, హత్య కేసును ఛేధించారు. కోయింబత్తుర్లో పలు చోట్ల దొరికిన శరీర భాగాలను అదృశ్యమైన ప్రభువిగా గుర్తించారు.. పెళ్లి విషయంలోనే ప్రభుని మిషన్ కట్టర్ తో నరికి చంపి, శరీర భాగాలని అక్కడక్కడా పడవేసినట్టు పోలీసుల విచారణలు ఆ యువతి ఒప్పుకున్నట్టుగా చెబుతున్నారు. మొత్తం ఈ కేసు తమిళనాడులో సంచలనంగా మారింది.
తాజావార్తలు
-
Rythu Shankaravam: ‘రైతు శంఖారావం’కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
-
OTT Releases: ఈ వారం ఓటీటీ సినిమాలు… థ్రిల్లర్, కామెడీ, హారర్తో సరికొత్త లైనప్
-
Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
-
Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్సైడ్ ఉందంటున్న నోమురా!
-
Psychology Facts: ‘లైట్ తీసుకో, పట్టించుకోకు..’ ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!