Petrol Rates: పెట్రోల్ ధర మరో రూ.33 తగ్గుతుందా? ఎలా సాధ్యమంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో పెట్రోల్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.8గా నమోదైంది. అటు ఏపీలోని విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.25గా పలుకుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై పన్నులు తగ్గించడంతో వాహనదారులకు కొంత ఊరట లభించింది. అయితే త్వరలో పెట్రోల్ ధరలు మరింత తగ్గుతాయని ప్రచారం జరుగుతోంది. అది ఎలా అంటే పెట్రోల్ను కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే మరో రూ.33 తగ్గుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈరోజు నుంచి జీఎస్టీ కౌన్సిట్ మీటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పెట్రోల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి కౌన్సిల్ ఆఫ్ ఎకనమిక్ అడ్వైజర్స్ ఛైర్మన్ వివేక్ దెబ్రోయ్ ఈ అంశంపై ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ కిందకు తీసుకువస్తే ద్రవ్యోల్బణాన్ని అడ్డుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇందుకు రాష్ట్రాలు అంగీకారం తెలపాల్సి ఉంటుందని సూచించారు. మరోవైపు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. జీఎస్టీ కిందకు పెట్రోల్, డీజిల్ తీసుకువస్తే కేంద్ర ప్రభుత్వానికి కూడా సంతోషమేనని, అయితే రాష్ట్రాలు మాత్రం అందుకు అంగీకరించడం లేదని పేర్కొన్నారు.
Also Read
- Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
- RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
- SpaceX IPO: స్పేస్ఎక్స్ IPOతో ఎలాన్ మస్క్ ట్రిలియనీర్ అవుతారా?.. ప్రపంచ దృష్టి నాస్డాక్పై
- Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ పైపైకి.. ఈరోజు తులం ఎంతంటే?
ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్పై వ్యాట్ రూపంలో అధిక పన్నులు వసూలు చేస్తున్నారు. అందుకే పెట్రోల్ ధర కొండెక్కి కూర్చుంది. కేంద్ర ప్రభుత్వం పన్నులు తగ్గించినా తమకు రాబడి తగ్గుతుందని చాలా రాష్ట్రాలు వ్యాట్ను తగ్గించడంలేదు. ఒకవేళ పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ కిందకు తీసుకువస్తే ఆ మొత్తం ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించే పరిస్థితి లేదు. అదే జరిగితే మొత్తానికే జీఎస్టీ మీద వ్యతిరేక గళం వినిపించే అవకాశం ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Rakul Preet Singh: “మోసం చేస్తే వదిలేస్తా”.. పెళ్లి తర్వాత రిలేషన్పై రకుల్ షాకింగ్ కామెంట్స్!
-
Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
-
Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
-
Ruturaj Gaikwad: ప్లేఆఫ్ రేస్ నుంచి చెన్నై ఔట్ అయ్యాక రుతురాజ్కు మరో షాక్!.. బీసీసీఐ భారీ జరిమానా
-
Jyotika: అందుకే తమిళ ఇండస్ట్రీకి వెళ్లా..చెన్నై నా జీవితాన్నే మార్చింది
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!