GTRI: చైనా-అమెరికా మధ్య ఉద్రిక్తత.. భారత్కు బంపర్ అవకాశం..!
- చైనా-అమెరికా మధ్య ఉద్రిక్తత
- భారత్కు బంపర్ అవకాశం
- వినియోగించుకుంటే పారిశ్రామికంగా ఎదుగుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దేశాలైన అమెరికా, చైనాల మధ్య చాలా కాలంగా ఉద్రిక్తత నెలకొంది. ఇరు దేశాలు పరస్పరం కంపెనీలపై అనేక ఆంక్షలు విధించుకున్నాయి. దాదాపు మూడు దశాబ్దాలుగా చైనా ప్రపంచ కర్మాగారంగా ఉంది. పలు చైనా వస్తువులపై సుంకాలను పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది. వీటిలో ఉక్కు, సౌర ఘటాలు, లిథియం అయాన్ బ్యాటరీలు, వాటి భాగాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, వైద్య ఉత్పత్తులు ఉన్నాయి. ఈ ఏడాది నుంచి 2026 వరకు అనేక దశల్లో ఈ టారిఫ్ అమలు కానుంది. ఈ అవకాశాన్ని భారత్ సద్వినియోగం చేసుకోవచ్చు.
READ MORE: Top Headlines @5PM : టాప్ న్యూస్
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం పొడిగించడం వల్ల భారతదేశం తన ఎగుమతులను పెంచుకోవడానికి.. అమెరికన్ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి సహాయపడుతుందని థింక్ ట్యాంక్ జీటీఆర్ఐ తెలిపింది. యూఎస్ సెనేట్ ప్రవేశపెట్టిన రెండు బిల్లుల వల్ల చైనా నుంచి దిగుమతులు ప్రభావితమవుతాయి. అమెరికా కంపెనీలు చైనా కాకుండా ఇతర ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నందున భారత్కు దీనితో అవకాశం ఉంది. అమెరికా కంపెనీలు చైనాపై ఆధారపడటం తగ్గించుకోవడం వల్ల భారత్కు అవకాశాలు పెరుగుతాయని జిటిఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ అన్నారు.
READ MORE:Supreme Court: రేషన్ కార్డుల జాప్యంపై ధర్మాసనం తీవ్ర అసహనం.. ఓపిక నశించిందని వ్యాఖ్య
భారతదేశం ఏమి చేయాలి?
తయారీ రంగంలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్, ఇతర పరిశ్రమలలో భారతదేశం ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించగలదు. పీఎన్టీఆర్చట్టం యొక్క ఉద్దేశ్యం చైనా యొక్క అనుకూలమైన వాణిజ్య స్థితిని అంతం చేయడం. అయితే ఏఎన్టీ చట్టం యొక్క ఉద్దేశ్యం చైనా-రష్యాపై విరుచుకుపడటం. ముఖ్యంగా ఏఎన్టీ చట్టం భారతదేశానికి గొప్ప అవకాశాన్ని కల్పిస్తోందని శ్రీవాస్తవ అన్నారు. ఎందుకంటే అమెరికా కంపెనీలు చైనా వంటి మార్కెట్యేతర ఆర్థిక వ్యవస్థల నుంచి ఉత్పత్తిని తరలించాలను కుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎగుమతులను పెంచే లక్ష్యంతో చైనా కంపెనీలను, పెట్టుబడులను ఆహ్వానించాలన్న ప్రతిపాదనలను భారత్ పునరాలోచించాలని అన్నారు.
READ MORE:Jeep Compass: జీప్ కంపాస్ స్పెషల్ ఎడిషన్ రిలీజ్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
చైనీస్ ఉత్పత్తులపై అధిక సుంకాలు భారతదేశానికి దాని తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి అవకాశం కల్పిస్తాయి. చైనాకు ప్రత్యామ్నాయాలు వెతుకుతున్న బహుళజాతి కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు భారత్ చురుగ్గా కృషి చేయాలని జిటిఆర్ఐ ప్రభుత్వానికి సూచించింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, మెషినరీ, టెక్స్టైల్స్, సోలార్ ప్యానల్ తయారీలో తయారీని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!