Today (21-12-22) Stock Market Roundup: కరోనా కేసులు.. భారీ లాసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today(21-12-22) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు కూడా నష్టాల బాటలోనే నడిచింది. ఇవాళ బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకుంది. చివరికి భారీ నష్టాల్లో ముగిసింది. జపాన్, చైనా, అమెరికాల్లో కొవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్పై తీవ్రంగా పడింది. ప్రభుత్వం మళ్లీ కఠిన నిర్ణయాలు తీసుకుంటుందేమో అనే భయాలు ఇన్వెస్టర్లను వెంటాడాయి.
సెంటిమెంట్ దెబ్బతినటంతో రెండు సూచీలు కూడా కోలుకోకుండా లాసుల్లోనే క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 635 పాయింట్లు కోల్పోయి 61 వేల 67 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 193 పాయింట్లు తగ్గి 18 వేల 192 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్లోని మొత్తం 30 కంపెనీల్లో 7 కంపెనీల స్టాక్స్ వ్యాల్యూ హైలెవల్లోనే ఎండ్ అయ్యాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో వెయ్యి పాయింట్లకు పైగా తగ్గిపోయి 60 వేల 938 పాయింట్లకు పడిపోయింది.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
read also: COVID-19: కరోనాపై కేంద్రం అప్రమత్తం.. మళ్లీ మాస్కులు ధరించాలని సూచన
తర్వాత పాక్షికంగా కోలుకొని 61 వేల 200 పాయింట్ల వరకు వచ్చింది. నిఫ్టీ 18 వేల 200 పాయింట్ల వద్ద టెస్టింగ్ ఎదుర్కొంది. నిఫ్టీ మిడ్క్యాప్ హండ్రెడ్, స్మాల్క్యాప్ హండ్రెడ్ దాదాపు ఒక శాతం డౌన్ అయ్యాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ అత్యధికంగా లాభపడింది. 2 శాతానికిపైగా ట్రేడ్ అయింది. అదానీ ఎంటర్ప్రైజెస్ 6 శాతం, అదానీ పోర్ట్స్ 3 శాతం లాసయ్యాయి. రంగాల వారీగా పరిశీలిస్తే.. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ సెక్టార్లు భారీగా నష్టపోయాయి.
వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే.. జేకే పేపర్ కంపెనీ షేర్లు 3 శాతానికి పైగా ర్యాలీ తీసి ఒక్కో షేరు ధర రికార్డు స్థాయిలో 452 రూపాయల 40 పైసలు పలికింది. 10 గ్రాముల బంగారం రేటు 102 రూపాయలు పెరిగి 55 వేల రూపాయల వద్ద గరిష్టంగా ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 97 రూపాయలు పడిపోయి 69 వేల 545 రూపాయలుగా నమోదైంది. రూపాయి విలువ 3 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 64 పైసల వద్ద ఉంది.
తాజావార్తలు
-
Harish Rao-KTR: “బతుకంతా తెలంగాణది”.. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
-
Trump Marine One: ట్రంప్కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
CSK-IPL 2027: చెన్నై సూపర్ కింగ్స్కు మరో షాక్.. స్టార్ కోచ్ కూడా గుడ్బై.. సీఎస్కే భవిష్యత్పై బెంగ!
-
Kanika Kapoor: ఆమెలా ఉంటే తప్పేముంది.. సినిమాలో కనిపించేది నేనేగా.. కియారా పోలికలపై కనికా కపూర్ ముచ్చట
ట్రెండింగ్
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!