Today (21-12-22) Stock Market Roundup: కరోనా కేసులు.. భారీ లాసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today(21-12-22) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు కూడా నష్టాల బాటలోనే నడిచింది. ఇవాళ బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకుంది. చివరికి భారీ నష్టాల్లో ముగిసింది. జపాన్, చైనా, అమెరికాల్లో కొవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్పై తీవ్రంగా పడింది. ప్రభుత్వం మళ్లీ కఠిన నిర్ణయాలు తీసుకుంటుందేమో అనే భయాలు ఇన్వెస్టర్లను వెంటాడాయి.
సెంటిమెంట్ దెబ్బతినటంతో రెండు సూచీలు కూడా కోలుకోకుండా లాసుల్లోనే క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 635 పాయింట్లు కోల్పోయి 61 వేల 67 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 193 పాయింట్లు తగ్గి 18 వేల 192 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్లోని మొత్తం 30 కంపెనీల్లో 7 కంపెనీల స్టాక్స్ వ్యాల్యూ హైలెవల్లోనే ఎండ్ అయ్యాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో వెయ్యి పాయింట్లకు పైగా తగ్గిపోయి 60 వేల 938 పాయింట్లకు పడిపోయింది.
Also Read
- Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
- Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
- SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
- YouTube vs Instagram: డబ్బు సంపాదించాలంటే ఇన్స్టా బెస్ట్ ఆ? యూట్యూబ్ బెస్ట్ ఆ? ఈ లెక్కలు చూస్తే షాకవుతారు!
read also: COVID-19: కరోనాపై కేంద్రం అప్రమత్తం.. మళ్లీ మాస్కులు ధరించాలని సూచన
తర్వాత పాక్షికంగా కోలుకొని 61 వేల 200 పాయింట్ల వరకు వచ్చింది. నిఫ్టీ 18 వేల 200 పాయింట్ల వద్ద టెస్టింగ్ ఎదుర్కొంది. నిఫ్టీ మిడ్క్యాప్ హండ్రెడ్, స్మాల్క్యాప్ హండ్రెడ్ దాదాపు ఒక శాతం డౌన్ అయ్యాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ అత్యధికంగా లాభపడింది. 2 శాతానికిపైగా ట్రేడ్ అయింది. అదానీ ఎంటర్ప్రైజెస్ 6 శాతం, అదానీ పోర్ట్స్ 3 శాతం లాసయ్యాయి. రంగాల వారీగా పరిశీలిస్తే.. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ సెక్టార్లు భారీగా నష్టపోయాయి.
వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే.. జేకే పేపర్ కంపెనీ షేర్లు 3 శాతానికి పైగా ర్యాలీ తీసి ఒక్కో షేరు ధర రికార్డు స్థాయిలో 452 రూపాయల 40 పైసలు పలికింది. 10 గ్రాముల బంగారం రేటు 102 రూపాయలు పెరిగి 55 వేల రూపాయల వద్ద గరిష్టంగా ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 97 రూపాయలు పడిపోయి 69 వేల 545 రూపాయలుగా నమోదైంది. రూపాయి విలువ 3 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 64 పైసల వద్ద ఉంది.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!