COVID-19: కరోనాపై కేంద్రం అప్రమత్తం.. మళ్లీ మాస్కులు ధరించాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The central government has organized a key meeting on Covid-19: ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కోవిడ్-19 ప్రకంపనలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే చైనాతో పాటు పలు దేశాల్లో పరిస్థితులు అధ్వానంగా మారాయి. ముఖ్యంగా చైనాలో కేసుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఇప్పటికే అక్కడ అంత్యక్రియలకు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి. దీంతో అంతర్జాతీయంగా కోవిడ్ పరిణామాలపై భారతదేశం కూడా అప్రమత్తం అయింది.
తాజాగా కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన బుధవారం కీలక సమావేశం జరిగింది. కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ వీకే పాల్ తో పాటు ఉన్నతాధికారులు, నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కోవిడ్ ఇంకా ముగియలేదు.. అప్రమత్తంగా ఉండాలని.. నిఘాను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించినట్లు కేంద్రమంత్రి సమావేశం అనంతరం ట్వీట్ చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు.
Also Read
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
Read Also: RRR for Oscars : రాజమౌళి ఆశలు ఫలించేనా.? ట్రిపుల్ఆర్కు ఆస్కార్ దక్కేనా.. ?
ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. తగిన పరీక్షలు నిర్వహిస్తున్నామని..రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించారు. సీనియర్ సిటిజెన్లు బూస్టర్ డోసులు వేసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. జాతీయ కోవిడ్ టాస్క్ ఫోర్స్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్. అంతర్జాతీయ విమాన ప్రయాణానికి సంబంధించి మార్గదర్శకాల్లో ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు. ఈ సమీక్షాసమావేశం ముఖ్యంగా 6 కీలక అంశాలపై జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాల్లో కేసులను నిరోధించే వ్యూహం, విదేశాల నుంచి ప్రయాణించే ప్రయాణీకుల కోసం మార్గదర్శకాలు రూపొందించడం, కోవిడ్ కొత్త వేరియంట్ పై నిపుణులతో సంప్రదింపులు జరడం వంటివి ఇందులో ఉన్నాయి. రాబోయే న్యూఇయర్ పార్టీ వేడుకలకు సంబంధించి ప్రోటోకాల్ కూడా ఇందులో భాగంగా చర్చించినట్లు తెలుస్తోంది.
అన్ని కోవిడ్ పాజిటివ్ కేసులను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపాలని కేంద్రపాలిత ప్రాంతాలకు, రాష్ట్రాలకు సూచించారు. చైనాతో పాటు జపాన్, యూఎస్ఏ, కొరియా, బ్రెజిల్ దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోందని కరోనా వేరియంట్లను ట్రాక్ చేయడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ చాలా అవసరం అని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేేష్ భూషన్ అన్ని రాష్ట్రాలకు సూచించారు. దేశంలో గత 24 గంటల్లో ఇండియా వ్యాప్తంగా 129 కేసులు నమోదు అయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు 5,30,677 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఇండియాలో 3,408 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజావార్తలు
-
Lopamudra Raut Theft Case: బిగ్బాస్ ఫేమ్ ఇంట్లో భారీ చోరీ.. నిందితుడి అరెస్ట్, రూ.76 లక్షల సొత్తు స్వాధీనం!
-
Tollywood : ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోలేనా? సింగిల్ స్క్రీన్లు మూతపడటానికి బాధ్యులెవరు?
-
iPhone 18 Fold: iPhone 18 Foldలో 12GB RAM, A20 Pro చిప్? 5,800mAh బ్యాటరీతో వస్తుందంటూ లీకులు
-
Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
-
Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!