COVID-19: కరోనాపై కేంద్రం అప్రమత్తం.. మళ్లీ మాస్కులు ధరించాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The central government has organized a key meeting on Covid-19: ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కోవిడ్-19 ప్రకంపనలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే చైనాతో పాటు పలు దేశాల్లో పరిస్థితులు అధ్వానంగా మారాయి. ముఖ్యంగా చైనాలో కేసుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఇప్పటికే అక్కడ అంత్యక్రియలకు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి. దీంతో అంతర్జాతీయంగా కోవిడ్ పరిణామాలపై భారతదేశం కూడా అప్రమత్తం అయింది.
తాజాగా కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన బుధవారం కీలక సమావేశం జరిగింది. కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ వీకే పాల్ తో పాటు ఉన్నతాధికారులు, నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కోవిడ్ ఇంకా ముగియలేదు.. అప్రమత్తంగా ఉండాలని.. నిఘాను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించినట్లు కేంద్రమంత్రి సమావేశం అనంతరం ట్వీట్ చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు.
Also Read
- Mahua Moitra: రామమందిర విరాళాల స్కామ్పై స్పందించరే.. బీజేపీపై మహువా మొయిత్రా ఫైర్
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
- Viral Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తాతా.. 18 వేల అడుగుల ఎత్తు నుంచి దూకేసిన 80 ఏళ్ల వృద్ధుడు!
Read Also: RRR for Oscars : రాజమౌళి ఆశలు ఫలించేనా.? ట్రిపుల్ఆర్కు ఆస్కార్ దక్కేనా.. ?
ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. తగిన పరీక్షలు నిర్వహిస్తున్నామని..రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించారు. సీనియర్ సిటిజెన్లు బూస్టర్ డోసులు వేసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. జాతీయ కోవిడ్ టాస్క్ ఫోర్స్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్. అంతర్జాతీయ విమాన ప్రయాణానికి సంబంధించి మార్గదర్శకాల్లో ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు. ఈ సమీక్షాసమావేశం ముఖ్యంగా 6 కీలక అంశాలపై జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాల్లో కేసులను నిరోధించే వ్యూహం, విదేశాల నుంచి ప్రయాణించే ప్రయాణీకుల కోసం మార్గదర్శకాలు రూపొందించడం, కోవిడ్ కొత్త వేరియంట్ పై నిపుణులతో సంప్రదింపులు జరడం వంటివి ఇందులో ఉన్నాయి. రాబోయే న్యూఇయర్ పార్టీ వేడుకలకు సంబంధించి ప్రోటోకాల్ కూడా ఇందులో భాగంగా చర్చించినట్లు తెలుస్తోంది.
అన్ని కోవిడ్ పాజిటివ్ కేసులను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపాలని కేంద్రపాలిత ప్రాంతాలకు, రాష్ట్రాలకు సూచించారు. చైనాతో పాటు జపాన్, యూఎస్ఏ, కొరియా, బ్రెజిల్ దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోందని కరోనా వేరియంట్లను ట్రాక్ చేయడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ చాలా అవసరం అని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేేష్ భూషన్ అన్ని రాష్ట్రాలకు సూచించారు. దేశంలో గత 24 గంటల్లో ఇండియా వ్యాప్తంగా 129 కేసులు నమోదు అయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు 5,30,677 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఇండియాలో 3,408 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజావార్తలు
-
CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
Cleaning Tips: ఇల్లాళ్లకు స్మార్ట్ కిచెన్ ఐడియాస్.. వంటగదిని క్లీన్గా ఉంచే 12 అదిరిపోయే చిట్కాలు!
-
Nitin Nabin: గిరిజనుల అభివృద్ధికి బీజేపీ కట్టుబడింది.. కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎంగా వాడుకుంటోంది
-
Trump-Iran: ఇరాన్ చర్చలు కోరింది.. రేపు దోహాలో కీలక భేటీ అంటూ ట్రంప్ ప్రకటన
ట్రెండింగ్
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!