దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూలంగా ఉండడంతో ఉదయం సరికొత్త రికార్డులు నమోదు చేసిన సూచీలు… అనంతరం నష్టాల్లో ట్రేడ్ అవుతూ ఫ్లాట్గా ముగిశాయి. సోమవారం సెన్సెక్స్ 81, 908 పాయింట్లు దగ్గర, నిఫ్టీ 24, 999 పాయింట్ల దగ్గర ఆల్టైమ్ గరిష్టాలను నమోదు చేశాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 23 పాయింట్లు లాభపడి 81, 355 దగ్గర ముగియగా.. నిఫ్టీ 1 ఒక పాయింటు లాభపడి 24, 836 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Raja Saab: Raja Saab: ‘రాజాసాబ్’ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసిందోచ్.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!
ఇక నిఫ్టీలో దివీస్ ల్యాబ్స్, ఎల్ అండ్ టీ, బీపీసీఎల్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ లాభాల్లో కొనసాగగా.. టైటాన్ కంపెనీ, భారతీ ఎయిర్టెల్, హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా మరియు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ నష్టపోయాయి. చివరిగా రికార్డు స్థాయిలను నమోదు చేయడంలో విఫలమయ్యాయి.
ఇది కూడా చదవండి: CM Chandrababu: రెవెన్యూ సమీక్షలో ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాజముద్రతో కొత్త పాసు పుస్తకాలు..!