TCS: “15 రోజుల్లో ట్రాన్స్ఫర్ చేసిన చోటుకు వెళ్లాలి”.. కేంద్రానికి ఉద్యోగుల ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS: దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. ఇటీవల 2000 మంది ఉద్యోగులను టీసీఎస్ ట్రాన్స్ఫర్ చేసింది. బదిలీ చేసిన ప్రాంతానికి వెళ్లి విధుల్లో చేరేందుకు ఉద్యోగులకు 2 వారాల సమయం ఇచ్చింది. ఒక వేళ వారికి కేటాయించిన కొత్త స్థానాలకు వెళ్లని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
ఇప్పటికే 2 వేల మంది ఉద్యోగులకు టీసీఎస్ ట్రాన్స్ఫర్ నోటీసులను ఇచ్చింది. ఈ ఉద్యోగులు వేరేవేరే ప్రాంతాలకు బదిలీ కావడంతో వారికి రెండు వారాలు గడువు ఇచ్చింది. దీంతో పాటు ఉద్యోగులకు ప్రయాణ, వసతి ఖర్చులను కూడా ఇవ్వనుంది. కంపెనీ ఆర్డర్ ప్రకారం ట్రాన్స్ఫర్ చేసిన చోటుకు వెళ్లకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఆగస్టు నెలాఖరు నుంచి టీసీఎస్ ఉద్యోగులకు ఈ రీలొకేషన్ నోటీసులు అందాయని మనీ కంట్రోల్ నివేదిక పేర్కొంది.
Also Read
- Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
- Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్లో నయా ట్రెండ్
- Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
- HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
Read Also: Uttar Pradesh: యూపీలో దొంగల దారుణం.. మహిళపై గ్యాంగ్ రేప్, సిగరెట్లతో కాలుస్తూ అఘాయిత్యం..
ఇలా ఆకస్మికంగా బదిలీ చేయడంపై పలువురు ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. దాదాపుగా 180 మంది ఉద్యోగులు ఐటీ ఉద్యోగుల యూనియన్ NITESకి ఫిర్యాదు చేశారు. సరైన నోటీసు లేకుండా, సంప్రదింపులు లేకుండా తనను బదిలీ చేసిన చోటుకు వెళ్లమని కంపెనీ బలవంతం చేస్తుందని ఫిర్యాదు చేశారు. ఇది ఉద్యోగులను, వారి కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగుల తరుపున ఐటీ యూనియన్.. అనైతిక బదిలీ పద్దతులపై టీసీఎస్పై కార్మిక-ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది.
కోవిడ్ మహమ్మారి సమయంలో అన్ని టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సౌకర్యాన్ని కల్పించింది. దాదాపుగా రెండేళ్ల నుంచి ఉద్యోగులు ఇదే విధానంలో పనిచేశారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడటంతో అన్ని సంస్థలు కూడా ఉద్యోగులను ఆఫీసులకు రమ్మంటున్నాయి. కొన్ని కంపెనీలు హైబ్రీడ్ మోడ్లో పనిచేయాలని చెబుతున్నాయి. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు భవిష్యత్తు సంఘర్షణలో ఉంది. ఇప్పటికే పలు ప్రపంచ దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులను తొలగించాయి. ఇలాంటి భయాల నేపథ్యంలో ఐటీ ఉద్యోగులను తప్పనిసరిగా ఆఫీసుకు రావాలని, లేకపోతే చర్యలు ఉంటాయని సంస్థలు స్పష్టంగా చెబుతున్నాయి.
తాజావార్తలు
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
-
AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
-
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!