TCS: “15 రోజుల్లో ట్రాన్స్ఫర్ చేసిన చోటుకు వెళ్లాలి”.. కేంద్రానికి ఉద్యోగుల ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS: దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. ఇటీవల 2000 మంది ఉద్యోగులను టీసీఎస్ ట్రాన్స్ఫర్ చేసింది. బదిలీ చేసిన ప్రాంతానికి వెళ్లి విధుల్లో చేరేందుకు ఉద్యోగులకు 2 వారాల సమయం ఇచ్చింది. ఒక వేళ వారికి కేటాయించిన కొత్త స్థానాలకు వెళ్లని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
ఇప్పటికే 2 వేల మంది ఉద్యోగులకు టీసీఎస్ ట్రాన్స్ఫర్ నోటీసులను ఇచ్చింది. ఈ ఉద్యోగులు వేరేవేరే ప్రాంతాలకు బదిలీ కావడంతో వారికి రెండు వారాలు గడువు ఇచ్చింది. దీంతో పాటు ఉద్యోగులకు ప్రయాణ, వసతి ఖర్చులను కూడా ఇవ్వనుంది. కంపెనీ ఆర్డర్ ప్రకారం ట్రాన్స్ఫర్ చేసిన చోటుకు వెళ్లకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఆగస్టు నెలాఖరు నుంచి టీసీఎస్ ఉద్యోగులకు ఈ రీలొకేషన్ నోటీసులు అందాయని మనీ కంట్రోల్ నివేదిక పేర్కొంది.
Also Read
- మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
- Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
- September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
Read Also: Uttar Pradesh: యూపీలో దొంగల దారుణం.. మహిళపై గ్యాంగ్ రేప్, సిగరెట్లతో కాలుస్తూ అఘాయిత్యం..
ఇలా ఆకస్మికంగా బదిలీ చేయడంపై పలువురు ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. దాదాపుగా 180 మంది ఉద్యోగులు ఐటీ ఉద్యోగుల యూనియన్ NITESకి ఫిర్యాదు చేశారు. సరైన నోటీసు లేకుండా, సంప్రదింపులు లేకుండా తనను బదిలీ చేసిన చోటుకు వెళ్లమని కంపెనీ బలవంతం చేస్తుందని ఫిర్యాదు చేశారు. ఇది ఉద్యోగులను, వారి కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగుల తరుపున ఐటీ యూనియన్.. అనైతిక బదిలీ పద్దతులపై టీసీఎస్పై కార్మిక-ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది.
కోవిడ్ మహమ్మారి సమయంలో అన్ని టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సౌకర్యాన్ని కల్పించింది. దాదాపుగా రెండేళ్ల నుంచి ఉద్యోగులు ఇదే విధానంలో పనిచేశారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడటంతో అన్ని సంస్థలు కూడా ఉద్యోగులను ఆఫీసులకు రమ్మంటున్నాయి. కొన్ని కంపెనీలు హైబ్రీడ్ మోడ్లో పనిచేయాలని చెబుతున్నాయి. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు భవిష్యత్తు సంఘర్షణలో ఉంది. ఇప్పటికే పలు ప్రపంచ దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులను తొలగించాయి. ఇలాంటి భయాల నేపథ్యంలో ఐటీ ఉద్యోగులను తప్పనిసరిగా ఆఫీసుకు రావాలని, లేకపోతే చర్యలు ఉంటాయని సంస్థలు స్పష్టంగా చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!