Ragi Cultivation : రాగి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాగి లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. అందుకే రాగులకు ఏడాది పొడవున డిమాండ్ ఉంటుంది.. రాగుల పంటను అధిక విస్తీర్ణంలో పండిస్తున్నారు..నీటి సదుపాయం తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా ఈ పంట బాగా పండుతుంది. ఎటువంటి వాతావరణంలో అయిన పండుతుంది. రైతులు ఈ పంటను పండించడానికి మొగ్గు చూపిస్తున్నారు.. రాగుల సాగులో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అధిక లాభాలను పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు..
ఖరిఫ్ లో వర్షాధారంగా ,యాసంగిలో ఆరుతడి పంటగా రాగిని సాగుచేసుకోవచ్చును. నీటి లభ్యత తగ్గినప్పుడు మరియు కొద్ది పాటి చౌడు సమస్య ఉన్న పరిస్థితులలో రాగి పంట సాగు ద్వారా మంచి దిగుబడులు పొందవచ్చును.. రాగి పంటను ఆశించే తెగుళ్ళ విషయంలో కాస్త జాగ్రత్తలు పాటిస్తే మంచి దిగుబడిని పొందవచ్చు.. రాగి పంటలో ఎక్కువగా వచ్చే తెగుళ్లు ఇవే..
Also Read
అగ్గి తెగులు..
నారు మడిలో సోకినప్పుడు లేత మొక్కలు మాడిపోతాయి. ఎదిగిన మొక్కల ఆకుల పై దారపు కండె ఆకారంలో మచ్చలు చుట్టూ ఎరుపు గోధుమ రంగు అంచులు ఉండి మధ్యలో బూడిద రంగు కల్గి ఉండును. కనుపుల మీద కూడా ఈ వ్యాధి నలుపు రంగు మచ్చల రూపంలో కనిపిస్తుంది. మెడ విరుపుగా ఆశించినప్పుడు కణుపు దగ్గర మొక్క విరిగిపోతుంది.. అలాగే గింజలు తాలు గింజలు అంటే తెల్లగా సచ్చుగా మారతాయి..
నివారణ..
3 గ్రాముల థైరామ్ లేక కాప్టాన్ ను కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ది చేయాలి. మొక్కల పై మచ్చలు కనిపించిన వెంటనే కార్బముడిజిమ్ మందును లీటరు నీటికి 1 గ్రాము చొప్పున కలిపి పైరు పై పిచికారి చేయాలి..
పెనుబంక..
పంట బెట్టకు గురైనపుడు చాలా ఉదృతంగా ఆశిస్తుంది. చిన్న మరియు పెద్ద పురుగులు ఆకు పచ్చ, నీలిరంగు కలిపిన వర్ణంలో ఉంటాయి. ఇవి ఆకులు మరియు కంకులు నుండి రసం పీలుస్తాయి. ఆశించిన మొక్కలలో పెరుగుదల తగ్గి మాడిపోయినట్లు కనిస్తాయి. పైరు చిన్న దశలో అసిస్తే కంకులు రాకపోవడం మరియు గింజలు రాకపోవడం వంటివి జరుగుతాయి..
నివారణ..
డైమిథోయెట్ 2 మి. లీ లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి. లీ లీటరు నీటిని కలిపి పిచికారి చేయాలి.ఇలా చేయడం వల్ల తెగుళ్ళను నివారించి పంటను కాపాడుకోవచ్చు.. రాగులు గురించి ఇంకేదైనా సందేహాలు ఉంటే వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!