Stock Market: వరుస నష్టాలకు బ్రేక్.. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
- వరుస నష్టాలకు బ్రేక్
- భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
- మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో బుధవారం మార్కెట్కు సెలవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్లో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. గత కొద్ది రోజులుగా సూచీలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. లక్షల కోట్ల పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది. మొత్తానికి వారం రోజుల తర్వాత మంగళవారం మన మార్కెట్కు మంచి రోజులొచ్చాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా లాభాల్లోనే ట్రేడ్ అయ్యాయి. కొద్ది నిమిషాల్లోనే ఇన్వెస్టర్లు రూ.6.50 లక్షల కోట్లకు పైగా రికవరీ చేశారు. ఇక ముగింపులో సెన్సెక్స్ 239 పాయింట్లు లాభపడి 77, 578 దగ్గర ముగియగా.. నిఫ్టీ 64 పాయింట్లు లాభపడి 23, 518 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే రూ. 84.41 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Food: రాత్రి పూట ఈ ఆహారం తింటున్నారా..? ఈ రోగాలు మీ చెంత చేరినట్లే
Also Read
- Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..'మేక్ ఇన్ ఇండియా'కు బలం
- EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
- Gold ETF Outflows 2026: గోల్డ్ ఈటీఎఫ్లకు గుడ్బై చెబుతున్న ఇన్వెస్టర్లు.. కారణాలివే
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
నిఫ్టీలో ఎం అండ్ ఎం, ట్రెంట్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐషర్ మోటార్స్ భారీ లాభాల్లో కొనసాగగా.. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్స్యూమర్, హిందాల్కో నష్టపోయాయి. సెక్టార్లలో మీడియా, ఆటో, రియల్టీ, ఐటీ, ఫార్మా 0.5-2.5 శాతం, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్యూ బ్యాంక్ 0.5 శాతం చొప్పున క్షీణించాయి. బిఎస్ఇ మిడ్క్యాప్ మరియు స్మాల్క్యాప్ సూచీలు దాదాపు 1 శాతం పెరిగాయి.
ఇది కూడా చదవండి: Minister Rama Naidu: గత ఐదేళ్ల పాలనలో పోలవరం 20 ఏళ్లు వెనక్కి పోయింది..
అమెరికా ఎన్నికలకు ముందు అనిశ్చితి కారణంగా మన మార్కెట్ తీవ్ర నష్టాలను ఎదుర్కొంది. ఎన్నికల ఫలితాల తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. దీంతో మార్కెట్లు బాగా పుంజుకుంటాయని నిపుణులు భావించారు. కానీ అంతా రివర్స్ అయింది. నవంబర్ 6న అమెరికా ఎన్నికల ఫలితాల రోజునే లాభాలు అర్జించింది. మిగతా రోజులన్నీ నష్టాలను చవిచూసింది. మొత్తానికి ఇన్ని రోజుల తర్వాత మన మార్కెట్లో కొత్త కళ సంతరించుకుంది.
మార్కెట్కు సెలవు..
బుధవారం మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్కు నవంబర్ 20న సెలవు ప్రకటించారు. తిరిగి గురువారం స్టాక్ మార్కెట్ ఓపెన్ అవుతోంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల సమయంలో కూడా స్టాక్ మార్కెట్కు సెలవు ప్రకటించారు. ఎన్నికల నేపథ్యంలో అన్ని సంస్థలు సెలవులు ప్రకటించాయి. ఓటింగ్ పెంచేందుకు ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేస్తోంది.
తాజావార్తలు
-
Nasser Hussain: బెన్ స్టోక్స్.. నువ్ చేసింది తప్పే, కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకోవద్దు!
-
Opendoor India Exit: భారత్కు గుడ్బై చెప్పిన ఓపెన్డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
-
Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!