Sri Lanka: అదానీ సంస్థకు షాక్.. విద్యుత్ ఒప్పందాన్ని సమీక్షిస్తామన్న కొత్త ప్రభుత్వం
- అదానీ గ్రూప్కు షాక్
- విద్యుత్ ఒప్పందాన్ని సమీక్షిస్తామన్న శ్రీలంక కొత్త ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అదానీ గ్రూప్కు శ్రీలంక కొత్త ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అదానీ గ్రూప్ చేపట్టబోయే ప్రాజెక్టులపై పున:సమీక్ష జరుపుతామని కొత్త ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అదానీ గ్రూప్నకు గట్టి ఎదురుదెబ్బ తగిలేటట్టు కనిపిస్తోంది. గత ప్రభుత్వం ఆమోదించిన అదానీ గ్రూప్ పవన విద్యుత్ ఒప్పందాన్ని సమీక్షిస్తామని శ్రీలంక కొత్త ప్రభుత్వం తెలిపింది. విదేశాంగ మంత్రి విజితా హెరాత్ మాట్లాడుతూ.. అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు విద్యుత్ ధరలను గత ప్రభుత్వం ఆమోదించడం సమస్యగా ఉందని అన్నారు. నవంబర్ 14న పార్లమెంటు ఎన్నికలు జరిగిన తర్వాత కొత్త ప్రభుత్వం ఈ ఒప్పందానికి సరికొత్త రూపాన్ని ఇస్తుందని ఆయన చెప్పారు.
ఇది కూడా చదవండి: Vijayawada: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. ఉరేసుకుని భార్య సూసైడ్
Also Read
- KCC Loan: రైతులకు గుడ్న్యూస్.. పంట సాగుకు డబ్బులు కావాలా? ఇలా అప్లై చేయండి!
- PhonePe Daily RD: రోజుకు రూ.100తో PhonePe Daily RD.. ఎలా పెట్టుబడి పెట్టాలి? వడ్డీ రేట్లు, పూర్తి వివరాలు
- EPFO New Rules: PFలో 8 కీలక మార్పులు ఇవే! క్లెయిమ్, విత్డ్రాయల్, నామినేషన్పై ప్రభావం
- UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
అదానీ గ్రీన్ డీల్ను తిరిగి సమీక్షిస్తామని కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు అనురా కుమార దిసనాయకే గతంలోనే ప్రతిజ్ఞ చేశారు. గత నెలలో దిసనాయకే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అదానీ ప్రాజెక్ట్ ఇంధన సార్వభౌమత్వానికి ముప్పు అని దిసానాయకే పేర్కొన్నారు. దానిని రద్దు చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. అయితే పార్లమెంటరీ ఎన్నికలకు ముందు భారీ ప్రాజెక్టులపై ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోబోమని విదేశాంగ మంత్రి విజితా హెరాత్ మంగళవారం చెప్పారు. దిసనాయకే విజయం సాధించినప్పటికీ, శ్రీలంకలోని 225 సీట్ల శాసనసభలో అతని కూటమికి కేవలం మూడు సీట్లు మాత్రమే ఉన్నాయి.
ఇది కూడా చదవండి: PM Modi: నవరాత్రి సమయంలో హర్యానాలో విక్టరీ సాధించడం శుభసూచకం
శ్రీలంకలో రెండు పవన ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని అదానీ గ్రూప్ ప్రతిపాదించింది. ఒకటి మన్నార్లో, రెండవది పూనేరిన్లో. రెండూ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్నాయి. మన్నార్ ప్రాజెక్ట్ వన్యప్రాణులకు ముప్పుపై పర్యావరణ సమూహాల నుంచి కోర్టు సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే కొత్త ప్రభుత్వం ఇబ్బందులు తలపెట్టే పరిస్థితి ఏర్పడడంతో అదానీ గ్రూప్కు పెద్ద దెబ్బ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తు్న్నాయి.
ఇది కూడా చదవండి: Bengaluru Murder Case: ఆత్మరక్షణ కోసం చంపేశా.. డెత్ నోట్లో రాసుకున్న నిందితుడు
తాజావార్తలు
-
Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
-
CRS Portal : హైదరాబాద్లో గుడ్న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!