Bengaluru Murder Case: ఆత్మరక్షణ కోసం చంపేశా.. డెత్ నోట్లో రాసుకున్న నిందితుడు
- బెంగళూరు మహాలక్ష్మి మర్డర్ కేసు
- నిందితుడి నుండి పోలీసులు డెత్ నోట్ స్వాధీనం
- ఆత్మరక్షణ కోసం చంపినట్లు వెల్లడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులో రిఫ్రిజిరేటర్లో ముక్కలు ముక్కలుగా నరికి మహిళను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడి నుండి పోలీసులు డెత్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో అతను ఆత్మరక్షణ కోసం చంపినట్లు రాశాడని తెలిపారు. బెంగళూరులోని వయాలికావల్ ప్రాంతంలోని ఓ ఫ్లాట్లో మహాలక్ష్మి మృతదేహాన్ని 59 ముక్కలుగా నరికి ఫ్రిజ్లో ఉంచాడు నిందితుడు ముక్తి రంజన్ రాయ్.. కాగా.. హత్య అనంతరం సెప్టెంబర్ 25 న ఒడిశాలోని భద్రక్ జిల్లాలో చెట్టుకు ఉరివేసుకుని నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మహాలక్ష్మి మృతదేహాన్ని గుర్తించిన 4 రోజుల తర్వాత అతను సూసైడ్ చేసుకున్నాడు.
National Film Awards: బెస్ట్ తెలుగు సినిమాగా కార్తికేయ 2.. బెస్ట్ యాక్టర్ గా రిషబ్ శెట్టి
Also Read
- Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
తన డెత్ నోట్లో, మహాలక్ష్మి తనను చంపాలని ముందే ప్లాన్ చేసిందని.. అంతేకాకుండా తన మృతదేహాన్ని సూట్కేస్లో పెట్టి పారేయాలని అందులో ఉన్నట్లు రాయ్ పేర్కొన్నాడు. ఈ క్రమంలో.. అతను తనను తాను రక్షించుకోవడానికి ఈ చర్యకు పాల్పడ్డాడు.. మహిళ గొంతు నులిమి చంపాడు. పోలీసుల కథనం ప్రకారం.. రాయ్ తన ఇంట్లోనే మహాలక్ష్మిని హత్య చేశాడు. మరుసటి రోజు అతను కొడవలి తీసుకుని వచ్చి ఆమె శరీరాన్ని ముక్కలుగా కోశాడు. ఆ తర్వాత ఆ ముక్కలను రిఫ్రిజిరేటర్లో భద్రపరిచి ఇంటిని శుభ్రం చేశాడు. అయితే.. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకోలేదని, అయితే కొడవలిని విక్రయించిన మహిళ దానిని కొనుగోలు చేసిన వ్యక్తిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
Minister Satya Kumar Yadav: ఎఫ్ఎస్ఎస్ఏఐతో ఏపీ రూ.88 కోట్ల ఎంఓయూ.. ఒప్పందంపై సంతకాలు
బెంగళూరు పోలీసుల కథనం ప్రకారం.. మహాలక్ష్మి, రాయ్ బెంగళూరులోని ఓ మాల్లో పనిచేసి స్నేహితులుగా మారారు. 29 ఏళ్ల మహాలక్ష్మికి వివాహమైనప్పటికీ విడిగా ఉంటోంది. ఆ తర్వాత వారు ఒక సంబంధంలోకి ప్రవేశించారు. అయితే, మహాలక్ష్మి తనను పెళ్లి చేసుకోవాలని రాయ్పై ఒత్తిడి తెచ్చిందని, ఈ వివాదం వారి మధ్య నిత్యం వాగ్వాదానికి దారితీసిందని పేర్కొంది. మహాలక్ష్మిని హత్య చేసిన తర్వాత, రాయ్ మూడు రోజుల తర్వాత ఒడిశాలోని తన ఇంటికి వెళ్లి, తన తల్లి ముందు నేరాన్ని అంగీకరించాడని పోలీసు వర్గాలు తెలిపాయి. మహాలక్ష్మిని తానే హత్య చేశానని రాయ్ తన తల్లి ముందు బోరున విలపించాడు. అలాగే మహాలక్ష్మి కోసం తాను చాలా డబ్బు ఖర్చు పెట్టానని, అయితే ఆమె ప్రవర్తన తన పట్ల బాగా లేదని తన తల్లికి చెప్పాడు. సెప్టెంబర్ 2-3 తేదీల మధ్య మహాలక్ష్మి హత్యకు గురైనట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆమె మృతదేహాన్ని ఆమె తల్లి సెప్టెంబర్ 21న గుర్తించారు.
తాజావార్తలు
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?