శ్రీలంకలో ప్రారంభించనున్న గౌతమ్ అదానీ ప్రాజెక్టుపై గందరగోళంలో చిక్కుకుంది. 440 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 3700 కోట్లు) ఈ ప్రాజెక్ట్ పవన విద్యుత్కు సంబంధించినది.
అదానీ గ్రూప్కు శ్రీలంక కొత్త ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అదానీ గ్రూప్ చేపట్టబోయే ప్రాజెక్టులపై పున:సమీక్ష జరుపుతామని కొత్త ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అదానీ గ్రూప్నకు గట్టి ఎదురుదెబ్బ తగిలేటట్టు కనిపిస్తోంది. గత ప్రభుత్వం ఆమోదించిన అదానీ గ్రూప్ పవన విద్యుత్ ఒప్పందాన్ని సమీక్షిస్తామని శ్రీలంక కొత్త ప్రభుత్వం తెలిపింది.