Silver Purity: పాపం తెలుసా.. వెండి కొంటున్న ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారంట! ఎలాగో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Silver Purity: దేశంలో వెండికి క్రమంగా డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ఒక విస్తుపోయే నిజం వెలుగులోకి వచ్చింది. భారతదేశంలో వెండి కొనుగోలు చేస్తున్న ప్రతి ముగ్గురు వినియోగదారులలో ఒకరు స్వచ్ఛత విషయంలో మోసపోతున్నారని ‘లోకల్సర్కిల్స్’ నిర్వహించిన తాజా సర్వే వెల్లడించింది. అక్షయ తృతీయ పండుగ వేళ వెండి నాణేలు, ఆభరణాలు కొనేవారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
READ ALSO: IPL Record: ఐపీఎల్ కింగ్ కోహ్లీ కాదు.. ఎవరో తెలుసా? విస్తుపోయే గణాంకాలు..
Also Read
- Elon Musk: సింగిల్ డేలో రూ. 13 లక్షల కోట్లు కొల్లగొట్టిన ఎలాన్ మస్క్! ఎలాగో తెలుసా?
- Air India: తక్కువ ధరకే విమాన ప్రయాణం.. కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన ఎయిర్ ఇండియా.. ఓ లుక్కేయండి..
- Jaypee Associates: సున్నాకి పడిపోయిన ఆ కంపెనీ షేర్ వాల్యూ.. రోడ్డున పడిన 6 లక్షల మంది ఇన్వెస్టర్లు!
- EXPLAINER: పెట్రోల్, ఇథనాల్లో ఏది వాడితే మీ డబ్బులు సేవ్ అవుతాయి? E100తో బండి తుక్కు అవుతుందా?
సర్వేలో తేలిన చేదు నిజాలు ఇవే..
గత ఐదేళ్లలో వెండి కొనుగోలు చేసిన వారిపై జరిపిన ఈ సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. 31% మంది వినియోగదారులు తాము కొన్న వెండిలో స్వచ్ఛత లేదని, నాణ్యత విషయంలో మోసపోయామని అంగీకరించారు. 93% మంది ప్రజలు వెండికి కూడా బంగారం తరహాలోనే హాల్మార్కింగ్ను ప్రభుత్వం తప్పనిసరి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం 2% మంది మాత్రమే హాల్మార్కింగ్ అవసరం లేదని అభిప్రాయపడ్డారు. నిజానికి ఈ రోజుల్లో పెట్టుబడిగా, ఫ్యాషన్ ఆభరణాలుగా వెండికి ఆదరణ పెరుగుతోంది. 2026 నాటికి కిలో వెండి ధర రూ.1.7 లక్షల నుంచి రూ.1.9 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. ధరలు ఇంత భారీగా పెరుగుతున్న తరుణంలో, నాణ్యత విషయంలో కఠినమైన నిబంధనలు లేకపోతే వినియోగదారులు మరింత నష్టపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
స్వచ్ఛతను గుర్తించడం ఎలా..
వినియోగదారుల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఇప్పటికే కొన్ని గ్రేడ్లను ఖరారు చేసింది. వెండి స్వచ్ఛతను బట్టి 800, 835, 925, 958, 970, 990, 999 అనే ఏడు గ్రేడ్లుగా విభజించారు. అలాగే ప్రతి హాల్మార్క్లో BIS గుర్తు, స్వచ్ఛతా గ్రేడ్, ఒక ప్రత్యేకమైన HUID కోడ్ ఉండాలి. సెప్టెంబర్ 1, 2025 తర్వాత హాల్మార్క్ చేసిన ఉత్పత్తుల వివరాలను వినియోగదారులు తమ ఫోన్లోని BIS కేర్ యాప్ ద్వారా స్వయంగా వెండి స్వచ్ఛతను తనిఖీ చేసుకోవచ్చు. ఇదే సమయంలో వినియోగదారులకు నాణ్యమైన వెండిని అందించేందుకు దేశవ్యాప్తంగా హాల్మార్కింగ్ కేంద్రాలను ప్రభుత్వం విస్తరిస్తోంది. 2026 నాటికి 110 జిల్లాల్లో సుమారు 300కు పైగా కొత్త కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల సామాన్య ప్రజలకు తమ నగలు లేదా నాణేల స్వచ్ఛతను పరీక్షించుకోవడం మరింత సులభతరం కానుంది. ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, వెండి కొనేటప్పుడు కేవలం మెరుపును చూసి మోసపోకుండా.. హాల్మార్క్ గుర్తును, HUID కోడ్ను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!
-
Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వద్దన్నా డబ్బు వస్తుంది!
-
Astrology: తెలివితేటల్లో ముందుండే 3 రాశులవారు.. నిర్ణయాలు తీసుకోవడంలో వీళ్లకు సాటి ఎవరూ లేరా?
-
Shikhar Dhawan Vs Shubman Gill : ప్రిన్స్ వర్సెస్ గబ్బర్.. ఇద్దరిలో ఇండియాకి ఎవరు బెస్ట్ ఓపెనర్? గణాంకాలు ఏం చెబుతున్నాయి?
-
Tamil Nadu Debt Crisis: పుట్టిన ప్రతి బిడ్డపై రూ.1.28 లక్షల అప్పు.. శ్వేతపత్రంలో సంచలన విషయాలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?