Silver Purity: పాపం తెలుసా.. వెండి కొంటున్న ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారంట! ఎలాగో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Silver Purity: దేశంలో వెండికి క్రమంగా డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ఒక విస్తుపోయే నిజం వెలుగులోకి వచ్చింది. భారతదేశంలో వెండి కొనుగోలు చేస్తున్న ప్రతి ముగ్గురు వినియోగదారులలో ఒకరు స్వచ్ఛత విషయంలో మోసపోతున్నారని ‘లోకల్సర్కిల్స్’ నిర్వహించిన తాజా సర్వే వెల్లడించింది. అక్షయ తృతీయ పండుగ వేళ వెండి నాణేలు, ఆభరణాలు కొనేవారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
READ ALSO: IPL Record: ఐపీఎల్ కింగ్ కోహ్లీ కాదు.. ఎవరో తెలుసా? విస్తుపోయే గణాంకాలు..
Also Read
- Radico Khaitan: మత్తులో మునిగి.. లాభాల్లో తేలిన వోడ్కా కంపెనీ! 3 నెలల్లో వందల కోట్ల లాభం..
- Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
- AP Govt: ఏపీ ఆర్థిక ప్రగతికి 'నాబార్డ్' ఊతం.. రూ.5.11 లక్షల కోట్లతో భారీ రుణ ప్రణాళిక..
- Indian Rupee: రికార్డు స్థాయిలో రూపాయి పతనం.. సామాన్యుడిపై ధరల భారం!
సర్వేలో తేలిన చేదు నిజాలు ఇవే..
గత ఐదేళ్లలో వెండి కొనుగోలు చేసిన వారిపై జరిపిన ఈ సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. 31% మంది వినియోగదారులు తాము కొన్న వెండిలో స్వచ్ఛత లేదని, నాణ్యత విషయంలో మోసపోయామని అంగీకరించారు. 93% మంది ప్రజలు వెండికి కూడా బంగారం తరహాలోనే హాల్మార్కింగ్ను ప్రభుత్వం తప్పనిసరి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం 2% మంది మాత్రమే హాల్మార్కింగ్ అవసరం లేదని అభిప్రాయపడ్డారు. నిజానికి ఈ రోజుల్లో పెట్టుబడిగా, ఫ్యాషన్ ఆభరణాలుగా వెండికి ఆదరణ పెరుగుతోంది. 2026 నాటికి కిలో వెండి ధర రూ.1.7 లక్షల నుంచి రూ.1.9 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. ధరలు ఇంత భారీగా పెరుగుతున్న తరుణంలో, నాణ్యత విషయంలో కఠినమైన నిబంధనలు లేకపోతే వినియోగదారులు మరింత నష్టపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
స్వచ్ఛతను గుర్తించడం ఎలా..
వినియోగదారుల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఇప్పటికే కొన్ని గ్రేడ్లను ఖరారు చేసింది. వెండి స్వచ్ఛతను బట్టి 800, 835, 925, 958, 970, 990, 999 అనే ఏడు గ్రేడ్లుగా విభజించారు. అలాగే ప్రతి హాల్మార్క్లో BIS గుర్తు, స్వచ్ఛతా గ్రేడ్, ఒక ప్రత్యేకమైన HUID కోడ్ ఉండాలి. సెప్టెంబర్ 1, 2025 తర్వాత హాల్మార్క్ చేసిన ఉత్పత్తుల వివరాలను వినియోగదారులు తమ ఫోన్లోని BIS కేర్ యాప్ ద్వారా స్వయంగా వెండి స్వచ్ఛతను తనిఖీ చేసుకోవచ్చు. ఇదే సమయంలో వినియోగదారులకు నాణ్యమైన వెండిని అందించేందుకు దేశవ్యాప్తంగా హాల్మార్కింగ్ కేంద్రాలను ప్రభుత్వం విస్తరిస్తోంది. 2026 నాటికి 110 జిల్లాల్లో సుమారు 300కు పైగా కొత్త కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల సామాన్య ప్రజలకు తమ నగలు లేదా నాణేల స్వచ్ఛతను పరీక్షించుకోవడం మరింత సులభతరం కానుంది. ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, వెండి కొనేటప్పుడు కేవలం మెరుపును చూసి మోసపోకుండా.. హాల్మార్క్ గుర్తును, HUID కోడ్ను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!