Stock Market: వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్మార్కెట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుసగా నాలుగు రోజుల నష్టాల అనంతరం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలున్నప్పటికీ ఉదయం సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత మధ్యాహ్నం ఓ దశలో నష్టాల్లోకి వెళ్లినా కొనుగోళ్ల మద్దతుతో తిరిగి పుంజుకున్నాయి. కొనుగొళ్లే సూచీలను తిరిగి పైకి లేపడం గమనార్హం. వినియోగ వస్తువులు, ఆటోమొబైల్ స్టాక్లలో బలమైన కొనుగోళ్ల ఆసక్తితో దేశీయ సూచీలు తిరిగి గ్రీన్లోకి మారాయి. చమురు ధరలు 100 డాలర్ల దిగువన ట్రేడవ్వడం, యూరప్ మార్కెట్లు, అమెరికా ఫ్యూచర్స్ సానుకూలంగా ఉండడం కలిసొచ్చింది. నిఫ్టీ మిడ్క్యాప్ 0.77 శాతం, స్మాల్ క్యాప్ 0.37 శాతం పెరగడంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ మెటల్ 0.81 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ 0.43 శాతం, నిఫ్టీ ఐటీ 0.15 శాతం , చొప్పున పతనమయ్యాయి. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో రూపాయి మారకం విలువ రూ.79.87 వద్ద ట్రేడవుతోంది.
State Bank Of India: కస్టమర్లకు ఎస్బీఐ షాక్.. భారీగా పెరిగిన వడ్డీ రేట్లు
Also Read
- Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
- Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
- Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
- Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఆరంభంలోనే లాభపడినా రోజంతా లాభ నష్టాల మధ్య ఊడిసలాడాయి. చివరికి సెన్సెక్స్ 344 పాయింట్ల లాభంతో 53760 వద్ద, నిఫ్టీ 110 పాయింట్ల లాభంతో 16,049 వద్ద ముగిసింది. తద్వారా నిఫ్టీ 16వేల స్థాయిని ఎగువన ముగిసింది. కానీ సెన్సెక్స్ ఇంకా 54వేల దిగువనే ఉంది. 30 షేర్ల బీఎస్ఈ ఇండెక్స్లో, హెచ్యూఎల్, టైటాన్, మారుతీ, ఎల్ అండ్ టీ, హెచ్డీఎఫ్సి, ఎం అండ్ ఎం, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐటిసి తమ షేర్లు 2.87 చొప్పున పెరిగి టాప్ గెయినర్లలో ఉన్నాయి. దీనికి విరుద్ధంగా, టాటా స్టీల్, పౌగ్రిడ్, హెచ్సీఎల్ టెక్, విప్రో, డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసిఎస్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టాల్లో ముగిశాయి. ఇంకా, దేశంలో అతిపెద్ద బీమా సంస్థ మరియు అతిపెద్ద దేశీయ ఆర్థిక పెట్టుబడిదారు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) షేర్లు 0.51 శాతం పడిపోయి రూ.708.55 వద్ద ముగిశాయి.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!