కరోనా థర్డ్ వేవ్ కూడా తీవ్రంగా-ఎస్బీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటికే భారత్లో కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కల్లోలం సృష్టించాయి.. ఫస్ట్ వేవ్ కంటే.. సెకండ్ వేవ్ తీవ్రమైన ప్రభావాన్ని చూపింది.. పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడమే కాదు.. భారీ సంఖ్యలో ప్రాణనష్టం కూడా సంభవించింది.. మరోవైపు.. థర్డ్ వేవ్ ముప్పు పొంచిఉందన్న హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.. ఈ నేపథ్యంలో.. కోవిడ్ థర్డ్ వేవ్పై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పరిశోధన పత్రాన్ని విడుదల చేసింది.. థర్డ్ వేవ్ సైతం.. సెకండ్ వేవ్ విజృంభణ తరహాలోనే తీవ్రంగా ఉంటుందని పేర్కొంది.. సెకండ్ వేవ్ ప్రభావం 108 రోజులు ఉంటే, థర్డ్ వేవ్ ప్రభావం 98 రోజులు ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.. అయితే, అందరికీ వ్యాక్సినేషన్తో మరణాలను నివారించే అవకాశం ఉందని పేర్కొంది ఎస్బీఐ నివేదిక..
దేశ జనాభాలో 3.2 శాతానికే మాత్రమే ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగిందని పేర్కొన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. 12 నుంచి 18 వయసున్న పిల్లలకు సైతం వ్యాక్సినేషన్ పై దృష్టి సారించాలన్సిన అవరం ఉందని తెలిపింది… రెండవ విడత కరోనా విజృంభణలో ఒక లక్ష డెబ్బైవేల మందికి పైగా చనిపోగా, మూడవ విడతలో ఆ సంఖ్యను 40 వేలకు నియంత్రించవచ్చునని అంచనా వేసింది.. ప్రస్తుతం 20 శాతంగా ఉన్న తీవ్రమైన కేసులను 5 శాతానికి తగ్గించవచ్చిన వెల్లడించింది.. ఇక, ఆక్సిజన్ సరఫరా, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల బలోపేతంతో కరోనా థర్డ్ వేవ్ను సమర్థంగా ఎదుర్కోవచ్చు అంటోంది ఎస్బీఐ. కాగా, థర్డ్ వేవ్ హెచ్చరికలతో అన్ని రాష్ట్రాలు తగిన ఏర్పాట్లపై దృష్టిసారిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read
- ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
- Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
- RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
- PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
తాజావార్తలు
-
ICC Women’s Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!