SBI Cards Fund raise: ఎస్బీఐ కార్డ్స్ రూ.500 కోట్ల ఫండ్రైజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SBI Cards Fund raise: ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ సంస్థ.. ప్రైవేట్ ప్లేస్మెంట్ బేసిస్లో బాండ్లు జారీ చేయటం ద్వారా 500 కోట్ల రూపాయల ఫండ్ రైజ్ చేసింది. 5 వేల ఫిక్స్డ్ రేట్, అన్సెక్యూర్డ్, ట్యాక్సబుల్ అండ్ రిడీమబుల్ బాండ్లను విడుదల చేశామని తెలిపింది. ఒక్కొక్కటి 10 లక్షల రూపాయల చొప్పున విలువ చేసే ఈ బాండ్లను నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల రూపంలో ఇన్వెస్టర్లకు కేటాయించినట్లు వెల్లడించింది. వీటి కాల వ్యవధి మూడేళ్లని, 2025 సెప్టెంబర్ 15న మెచ్యూర్ అవుతాయని వివరించింది.
రష్యాను దాటేసిన సౌదీ
Also Read
- Jio Prime Membership: గుడ్న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం రూ.25 వేలకు పైగా పెన్షన్!
- E20 Ethanol Demand: E20 తర్వాత అసలు సవాలు ఏంటి?.. ఆహారం, నీటిపై ఒత్తిడి తప్పదా?
- LPG: వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. ఆగస్టు 23 వరకు ఛాన్స్..
మన దేశానికి 2వ అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా సౌదీ అరేబియా నిలిచింది. ఆగస్టు నెలలో రష్యాను దాటేసి తిరిగి తన ర్యాంక్ను కైవసం చేసుకుంది. కాకపోతే ఈ రెండు దేశాల మధ్య మార్జిన్ మరీ ఎక్కువగా లేకపోవటం గమనించాల్సిన విషయం. మూడు నెలల కిందట ఈ స్థానం సౌదీ అరేబియాకే సొంతం కాగా మధ్యలో రష్యా ఆక్రమించింది. ఇండియాకి అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఎప్పట్లాగే ఇరాక్ అగ్ర భాగంలో కొనసాగుతోంది. ఈ వివరాలను ఇండస్ట్రీ మరియు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
మన దేశం రోజుకి 8 లక్షల 63 వేల 950 బ్యారెళ్ల ముడి చమురుని సౌదీ అరేబియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటోంది. ఇది జులై నెలతో పోల్చితే 4.8 శాతం ఎక్కువ. రష్యా నుంచి దిగుమతి చేసుకునే క్రూడ్ 2.4 శాతం తగ్గి 8 లక్షల 55 వేల 950 బీపీడీ(బ్యారెల్స్ పర్ డే)లకి దిగొచ్చింది. అంటే ఈ రెండు దేశాల మధ్య మార్జిన్ తేడా 2.4 శాతం మాత్రమే.
Huge Orders to Hyderabad Company: హైదరాబాద్ సంస్థకు భారీ ఆర్డర్లు
జియోకి పెరిగిన యూజర్లు 29.4 లక్షలు
దేశంలోని అతిపెద్ద టెలికం ఆపరేటర్ అయిన రిలయెన్స్ జియోకి జులై నెలలో 29 లక్షలకుపైగా యూజర్లు పెరిగారు. ఈ తాజా వివరాలను టెలికం సెక్టార్ రెగ్యులేటర్ ట్రాయ్ విడుదల చేసింది. ఎయిర్టెల్కి 5 లక్షలకు పైగా సబ్స్క్రయిబర్లు చేరారు. ఇదిలాఉండగా వొడాఫోన్-ఐడియా దాదాపు పన్నెండున్నర లక్షల వైర్లెస్ కస్టమర్లను కోల్పోయింది. ఈ ఏడాది జులై చివరి నాటికి ఇండియా మొత్తమ్మీద ఉన్న వైర్లెస్ యూజర్ల సంఖ్య 114 కోట్లకు పైగానే నమోదవటం విశేషం.
తాజావార్తలు
-
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
-
OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
-
Off The Record: వనపర్తి కాంగ్రెస్లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
-
Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!