SBI Cards Fund raise: ఎస్బీఐ కార్డ్స్ రూ.500 కోట్ల ఫండ్రైజ్
SBI Cards Fund raise: ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ సంస్థ.. ప్రైవేట్ ప్లేస్మెంట్ బేసిస్లో బాండ్లు జారీ చేయటం ద్వారా 500 కోట్ల రూపాయల ఫండ్ రైజ్ చేసింది. 5 వేల ఫిక్స్డ్ రేట్, అన్సెక్యూర్డ్, ట్యాక్సబుల్ అండ్ రిడీమబుల్ బాండ్లను విడుదల చేశామని తెలిపింది. ఒక్కొక్కటి 10 లక్షల రూపాయల చొప్పున విలువ చేసే ఈ బాండ్లను నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల రూపంలో ఇన్వెస్టర్లకు కేటాయించినట్లు వెల్లడించింది. వీటి కాల వ్యవధి మూడేళ్లని, 2025 సెప్టెంబర్ 15న మెచ్యూర్ అవుతాయని వివరించింది.
రష్యాను దాటేసిన సౌదీ
Also Read
- Indian Rupee: రికార్డు స్థాయిలో రూపాయి పతనం.. సామాన్యుడిపై ధరల భారం!
- Gold and Silver Prices: మళ్లీ తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..
- Post Office New Rules 2026: మారిన పోస్టాఫీసు రూల్స్.. పాన్ తప్పనిసరి.. లేకపోతే ఒక్కటే మార్గం..!
- Stock Market Crash: గల్ఫ్ 'టెన్షన్'.. మార్కెట్ 'డిప్రెషన్'.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. 500 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్!
మన దేశానికి 2వ అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా సౌదీ అరేబియా నిలిచింది. ఆగస్టు నెలలో రష్యాను దాటేసి తిరిగి తన ర్యాంక్ను కైవసం చేసుకుంది. కాకపోతే ఈ రెండు దేశాల మధ్య మార్జిన్ మరీ ఎక్కువగా లేకపోవటం గమనించాల్సిన విషయం. మూడు నెలల కిందట ఈ స్థానం సౌదీ అరేబియాకే సొంతం కాగా మధ్యలో రష్యా ఆక్రమించింది. ఇండియాకి అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఎప్పట్లాగే ఇరాక్ అగ్ర భాగంలో కొనసాగుతోంది. ఈ వివరాలను ఇండస్ట్రీ మరియు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
మన దేశం రోజుకి 8 లక్షల 63 వేల 950 బ్యారెళ్ల ముడి చమురుని సౌదీ అరేబియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటోంది. ఇది జులై నెలతో పోల్చితే 4.8 శాతం ఎక్కువ. రష్యా నుంచి దిగుమతి చేసుకునే క్రూడ్ 2.4 శాతం తగ్గి 8 లక్షల 55 వేల 950 బీపీడీ(బ్యారెల్స్ పర్ డే)లకి దిగొచ్చింది. అంటే ఈ రెండు దేశాల మధ్య మార్జిన్ తేడా 2.4 శాతం మాత్రమే.
Huge Orders to Hyderabad Company: హైదరాబాద్ సంస్థకు భారీ ఆర్డర్లు
జియోకి పెరిగిన యూజర్లు 29.4 లక్షలు
దేశంలోని అతిపెద్ద టెలికం ఆపరేటర్ అయిన రిలయెన్స్ జియోకి జులై నెలలో 29 లక్షలకుపైగా యూజర్లు పెరిగారు. ఈ తాజా వివరాలను టెలికం సెక్టార్ రెగ్యులేటర్ ట్రాయ్ విడుదల చేసింది. ఎయిర్టెల్కి 5 లక్షలకు పైగా సబ్స్క్రయిబర్లు చేరారు. ఇదిలాఉండగా వొడాఫోన్-ఐడియా దాదాపు పన్నెండున్నర లక్షల వైర్లెస్ కస్టమర్లను కోల్పోయింది. ఈ ఏడాది జులై చివరి నాటికి ఇండియా మొత్తమ్మీద ఉన్న వైర్లెస్ యూజర్ల సంఖ్య 114 కోట్లకు పైగానే నమోదవటం విశేషం.
తాజావార్తలు
-
Mamata Banerjee: టీఎంసీ ఓడిపోలేదు.. విలన్లతో పోరాడింది.. మమత సంచలన ఆరోపణలు
-
TVK Vijay: దళపతి విజయ్ కులం ఏంటి..? గూగుల్లో తెగ వెతికేస్తున్నారుగా..
-
TVK Vijay: పొత్తులపై విజయ్ కీలక నిర్ణయం.. ఏ పార్టీలతో వెళ్లబోతున్నారంటే..!
-
Krishna Deer Hunting : కృష్ణ జింకల వేట.. ముగ్గురు నిందితుల అరెస్ట్..!
-
Vijay TVK: విజయ్ డూప్’తో సీఎంను ఓడించిన బాబు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!