ఇక, రూ.2 వేల నోటు వంతు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అప్పట్లో పెద్దనోట్లు (రూ.వెయ్యి, రూ.500 పాత నోట్లు)ను రద్దు చేసి సంచలనానికి తెరలేపారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ సమయంలో.. ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి.. ఇక, అప్పుడే.. రూ.2 వేల నోటును ముద్రించింది ఆర్బీఐ.. అది కాస్త చిల్లర కష్టాలు రుచిచూపించగా.. ఆ తర్వాత రూ.500 కొత్త నోటు, రూ.200 కూడా వచ్చేశాయి.. క్రమంగా అన్ని నోట్లు.. రంగులు మారుతూ పోయాయి.. సైజులు కూడా తగ్గిపోయాయి. నోట్ల రద్దు తప్పుడు నిర్ణయమని.. ఇదే.. భారత ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బకొట్టిందనే విమర్శలు లేకపోలేదు. మరోవైపు.. రూ.2000 నోట్లు కూడా రద్దు కానున్నాయా? అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం.. గత రెండేళ్లుగా రూ.2,000 కరెన్సీని ముద్రించడం నిలిపివేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. అంతే కాదు.. ఆ నోట్లను క్రమంగా సర్క్యులేషన్ నుంచి ఉపసంహరించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
పెద్ద నోటును క్రమంగా మార్కెట్ చలామణి నుంచి తప్పించడం చూస్తుంటే.. త్వరలోనే రూ.2000 నోటుకు బైబై చెప్పడం ఖాయమని లెక్కలు వేస్తున్నారు.. ఎందుకంటే.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.57,757 నోట్ల విలువ గల రూ.2000 నోట్లు మార్కెట్లో చలామణి నుంచి మాయం అయ్యాయి.. 2019-20లో రూ.2000 నోట్ల విలువ రూ.5,47,952 కోట్లు ఉంటే, 2020-21 నాటికి రూ.4,90,195 కోట్లకు పడిపోయిందని.. స్వయంగా ఆర్బీఐ తాజా వార్షిక నివేదికలోనే పేర్కొంది. 2018 మార్చి నాటికి 336.3కోట్ల రూ. 2000 నోట్లు చలామణీలో ఉండగా.. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఆ సంఖ్య రూ. 245.1 కోట్లకు పడిపోయింది. అంటే దాదాపు 91.2కోట్ల నోట్లను ఆర్బీఐ వెనక్కి తీసుకుంది. ఇక, ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం మార్కెట్లో చలామణిలో ఉన్న నోట్లలో రూ.2000 నోట్లు 17.3 శాతంగా ఉండగా.. ఇది 2019-20లో 22.6 శాతంగా ఉండేది.. 2019-20లో రూ.5.47 లక్షల కోట్ల విలువ గల రూ.2000 నోట్లు రూ.4.9 లక్షల కోట్లకు పడిపోయాయి. మరోవైపు.. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు రూ.2000 నోట్లను తగ్గించాలని ఆర్బీఐ భావించాయి. కానీ, కరోనా ప్రారంభం అయినప్పట్టి నుంచి నగదు చలామణి పెరిగిపోయిందని ఆర్బీఐ పేర్కొంది. గత మార్చి నెలాఖరు నాటికి చలామణిలో ఉన్న బ్యాంకు నోట్ల మొత్తం కరెన్సీ విలువలో రూ. 500, రూ. 2వేల నోట్ల వాటా 85.7శాతంగా ఉందని.. కరోనా, దానిని కట్టడి కోసం తీసుకున్న చర్యలతో నగదు వినియోగం పెరిగిందని పేర్కొంది ఆర్బీఐ.. అయితే, రూ.2000 నోట్లు ముద్రణ నిలిపివేయడం.. క్రమంగా ఉపసంహరణ జరుగుతుండడంతో.. మొత్తానికి ఆ నోటే మాయం అవుతుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- PM Modi: భారత్ దూకుడు.. జీడీపీ వృద్ధిరేటు పెరగడంపై మోడీ హర్షం.. ఎక్స్లో కీలక వ్యాఖ్యలు
- Sanjay Malhotra: భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.. ఆందోళన అక్కర్లేదన్న ఆర్బీఐ గవర్నర్
- EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
- RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
తాజావార్తలు
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!