Sanjay Malhotra: భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.. ఆందోళన అక్కర్లేదన్న ఆర్బీఐ గవర్నర్
- భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది
- ఆందోళన అక్కర్లేదన్న ఆర్బీఐ గవర్నర్
- ద్రవ్యోల్బణంపై కొంత ఒత్తిడి ఉందని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ఒక కార్యక్రమంలో సంజయ్ మల్హోత్రా మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, అంతర్జాతీయ సంక్షోభాలు కొనసాగుతున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం బలంగా ఉందని తెలిపారు. దేశ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఎంతో స్థిరంగా.. ఆరోగ్యకరంగా ఉందని స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు భారత్కు మాత్రమే పరిమితం కావని.. అన్ని దేశాలు ఈ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ఇతర దేశాలతో పోలిస్తే మెరుగైన స్థితిలో ఉందని.. గతంలో ఎదుర్కొన్న ఇలాంటి ఆర్థిక షాక్లతో పోల్చినా దేశం మరింత బలంగా నిలిచిందని చెప్పుకొచ్చారు.
ఆర్థిక వృద్ధి విషయంలో భారత్ 6.5 శాతానికి పైగా వృద్ధిరేటును నమోదు చేస్తోందని తెలిపారు. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఇంతటి వృద్ధి సాధిస్తున్న దేశాలు చాలా తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అయితే ప్రపంచ మార్కెట్లలో ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణంపై కొంత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. చమురు ధరల పెరుగుదల ప్రభావం దేశీయ ధరలపై పడే అవకాశముందని.. అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Also Read
- Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
- RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
- UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. చమురు, గ్యాస్ కష్టాలతో అన్ని దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ పరిస్థితి మాత్రం శాంతించలేదు. హార్ముజ్ జలసంధి కూడా ఇంకా తెరుచుకోలేదు. దీంతో పరిస్థితులు ఇంకా చక్కదిద్దబడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ఆర్బీఐ హామీ ఇచ్చింది.
#WATCH | Mumbai: On India's macroeconomic resilience amidst global economic challenges, RBI Governor Sanjay Malhotra says, "…As I stated in my address, our economic position is quite robust; it is very sound and healthy. India is not alone in facing this global shock; all… pic.twitter.com/zJSNrNhOLD
— ANI (@ANI) June 5, 2026
తాజావార్తలు
-
Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్కే నేరుగా హెచ్చరిక..
-
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!