RBI Governor: కొత్త బాంబ్ పేల్చిన ఆర్బీఐ బాస్..! ఇకపై లెక్క కట్టాల్సిందేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI Governor: డిజిటల్ పేమెంట్స్ అంటే ఈ రోజుల్లో తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఇది నిజం.. ఎందుకంటే చిన్న కిరాణ కొట్టు నుంచి 5 స్టార్ హోటల్ వరకు ఎక్కడికి వెళ్లిన చెల్లింపులు చేసే పద్ధతి మాత్రం ఒక్కటే అదే… యూపీఐ పేమెంట్స్. గుర్తుంచుకో మిత్రమా ఇప్పటి నుంచి ఒక లెక్క.. ఇక నుంచి మరోలెక్క. ఇకపై యూపీఐ పేమెంట్స్ ఉచితం కాదని, పే చెల్లించాల్సిందే అని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అంటున్నారు. మరి ఏంటి దీని కథ.. చూసేయండి..
READ MORE: Suicide: భార్య, అత్తమామల వేధింపులతో అల్లుడి ఆత్మహత్య..! హృదయవిదారక వీడియో..
Also Read
- Stock Market: ట్రంప్ దెబ్బ.. స్టాక్ మార్కెట్లో బ్లడ్బాత్
- EPFO EPF Interest: పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. జూలై 15 నాటికి వడ్డీ జమ.. రూ.1.44 లక్షల కోట్లు క్రెడిట్!
- Stock Market Crash: రక్తసిక్తమైన దలాల్ స్ట్రీట్.. స్టాక్ మార్కెట్లో నిమిషాల్లోనే తుడిచిపెట్టుకుపోయిన వేల కోట్లు!
- Crude Oil: ఇరాన్పై అమెరికా వార్.. చమురు ధరలు క్రాష్! భారత్లో లీటర్ పెట్రోల్ రేట్ ఎంతంటే?
ఏ చిన్న ట్రాన్సాక్షన్కైనా
నేటి డిజిటల్ యుగంలో యూపీఐ చెల్లింపులు అనేవి మానవ జీవితంలో ఒక భాగమైపోయాయి. రోడ్డు మీద చిన్న షాప్స్ నుంచి బడా మాల్స్ వరకు యూపీఐ పేమెంట్స్ను తెగ వాడేస్తున్నారు. కానీ, రాబోయే రోజుల్లో యూపీఐ ఉచితంగా ఉండకపోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెబుతున్నారు. ఆయన బుధవారం మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. “నేను ఎప్పుడూ యూపీఐ ఎప్పటికీ ఉచితం అనే మాట చెప్పలేదు. యూపీఐ లావాదేవీలు ప్రాసెస్ చేయడంలో ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు ఎవరో ఒకరు భరించాల్సి ఉంటుంది” అన్నారు. అయితే ఆ ఖర్చు ఎవరు చెల్లించాలి అన్నది తేల్చాలని, అది ఎవరో ఒకరు చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు. మల్హోత్రా వ్యాఖ్యలు చూస్తే యూపీఐ ఉచిత సేవలపై మార్పులు రావచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్ ఉచితంగానే జరుగుతున్నా త్వరలో ఛార్జీలు ఉండబోతున్నాయని ఈ వ్యాఖ్యలు చూస్తే తెలుస్తుంది.
మీకు తెలుసా..
ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్ ఆగస్టు 1 నుంచి ఫోన్పే, గూగుల్ పే లాంటి యాప్లపై యూపీఐ లావాదేవీలకు ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభించింది. ఐసీఐసీఐ బ్యాంక్ మర్చంట్ యూపీఐ లావాదేవీలను నిర్వహించే పేమెంట్ అగ్రిగేటర్లపై ప్రాసెసింగ్ ఫీజు విధిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్లో ఎస్క్రో అకౌంట్లు ఉన్న అగ్రిగేటర్లకు ఒక్క లావాదేవీకి 2 బేసిస్ పాయింట్లు (గరిష్టంగా రూ.6 వరకు), ఎస్క్రో అకౌంట్ లేనివారికి 4 బేసిస్ పాయింట్లు (గరిష్టంగా రూ.10 వరకు) ఛార్జీ ప్రకటించింది. ఇంతకుముందు ప్రైవేట్ బ్యాంకులలో యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మాత్రమే ఇలాంటి ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.
వీసా కంటే ముందుకు..
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) ఇటీవల విడుదల చేసిన “గ్రోయింగ్ రిటైల్ డిజిటల్ పేమెంట్స్: ది వాల్యూ ఆఫ్ ఇంటర్ ఆపరెబిలిటీ” అనే రిపోర్ట్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ సుమారు 60 శాతం వాటా పొందింది. భారత్లో యూపీఐ 85 శాతం డిజిటల్ చెల్లింపులకు ఉపయోగపడుతోంది. ఇది వీసా కంటే ముందుకు వెళ్లిందని ఆ రిపోర్ట్ చెబుతోంది. ఈ వ్యవస్థ దీర్ఘకాలం నడవాలంటే, ఆ ఖర్చును వ్యక్తిగతంగా అయినా, గుంపుగా అయినా భరించాలి. అదే ముఖ్యమైన విషయం అని మల్హోత్రా వెల్లడించారు. ఛార్జీలు సంగతి రానున్న రోజుల్లో తెలియనుంది. అసలు ఈ ఛార్జీలు ఎవరిపై ఉంటాయి, ఎంత మొత్తంలో ఉంటాయనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.
READ MORE: Jr NTR: నెపోటిజంపై ఎన్టీఆర్ సంచలనం.. నేను అలాంటోడిని కాదు!
తాజావార్తలు
-
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
-
Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
-
Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
-
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..