RBI Governor: కొత్త బాంబ్ పేల్చిన ఆర్బీఐ బాస్..! ఇకపై లెక్క కట్టాల్సిందేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI Governor: డిజిటల్ పేమెంట్స్ అంటే ఈ రోజుల్లో తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఇది నిజం.. ఎందుకంటే చిన్న కిరాణ కొట్టు నుంచి 5 స్టార్ హోటల్ వరకు ఎక్కడికి వెళ్లిన చెల్లింపులు చేసే పద్ధతి మాత్రం ఒక్కటే అదే… యూపీఐ పేమెంట్స్. గుర్తుంచుకో మిత్రమా ఇప్పటి నుంచి ఒక లెక్క.. ఇక నుంచి మరోలెక్క. ఇకపై యూపీఐ పేమెంట్స్ ఉచితం కాదని, పే చెల్లించాల్సిందే అని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అంటున్నారు. మరి ఏంటి దీని కథ.. చూసేయండి..
READ MORE: Suicide: భార్య, అత్తమామల వేధింపులతో అల్లుడి ఆత్మహత్య..! హృదయవిదారక వీడియో..
Also Read
- Smartphone Prices Hike: స్మార్ట్ఫోన్ ప్రియులకు షాక్.. చుక్కలు చూపిస్తున్న ధరలు! పండగ సీజన్లో కొత్త ఫోన్ల కొనుగోళ్లు డౌటే..
- RBI: బీ అలర్ట్.. రూ.500 నోట్లపై ఆర్బీఐ కీలక విషయం వెల్లడి..
- Bank Holidays in June 2026: జూన్ నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం 13 రోజులు బ్యాంకులు బంద్!
- Colonel Sanders: 60 ఏళ్ల వయసులో రూ. 9 వేల పెన్షన్తో మొదలైన బిలియన్ డాలర్ల సామ్రాజ్యం.. కేఎఫ్సీ పెద్దాయన కథ ఇదే!
ఏ చిన్న ట్రాన్సాక్షన్కైనా
నేటి డిజిటల్ యుగంలో యూపీఐ చెల్లింపులు అనేవి మానవ జీవితంలో ఒక భాగమైపోయాయి. రోడ్డు మీద చిన్న షాప్స్ నుంచి బడా మాల్స్ వరకు యూపీఐ పేమెంట్స్ను తెగ వాడేస్తున్నారు. కానీ, రాబోయే రోజుల్లో యూపీఐ ఉచితంగా ఉండకపోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెబుతున్నారు. ఆయన బుధవారం మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. “నేను ఎప్పుడూ యూపీఐ ఎప్పటికీ ఉచితం అనే మాట చెప్పలేదు. యూపీఐ లావాదేవీలు ప్రాసెస్ చేయడంలో ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు ఎవరో ఒకరు భరించాల్సి ఉంటుంది” అన్నారు. అయితే ఆ ఖర్చు ఎవరు చెల్లించాలి అన్నది తేల్చాలని, అది ఎవరో ఒకరు చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు. మల్హోత్రా వ్యాఖ్యలు చూస్తే యూపీఐ ఉచిత సేవలపై మార్పులు రావచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్ ఉచితంగానే జరుగుతున్నా త్వరలో ఛార్జీలు ఉండబోతున్నాయని ఈ వ్యాఖ్యలు చూస్తే తెలుస్తుంది.
మీకు తెలుసా..
ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్ ఆగస్టు 1 నుంచి ఫోన్పే, గూగుల్ పే లాంటి యాప్లపై యూపీఐ లావాదేవీలకు ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభించింది. ఐసీఐసీఐ బ్యాంక్ మర్చంట్ యూపీఐ లావాదేవీలను నిర్వహించే పేమెంట్ అగ్రిగేటర్లపై ప్రాసెసింగ్ ఫీజు విధిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్లో ఎస్క్రో అకౌంట్లు ఉన్న అగ్రిగేటర్లకు ఒక్క లావాదేవీకి 2 బేసిస్ పాయింట్లు (గరిష్టంగా రూ.6 వరకు), ఎస్క్రో అకౌంట్ లేనివారికి 4 బేసిస్ పాయింట్లు (గరిష్టంగా రూ.10 వరకు) ఛార్జీ ప్రకటించింది. ఇంతకుముందు ప్రైవేట్ బ్యాంకులలో యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మాత్రమే ఇలాంటి ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.
వీసా కంటే ముందుకు..
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) ఇటీవల విడుదల చేసిన “గ్రోయింగ్ రిటైల్ డిజిటల్ పేమెంట్స్: ది వాల్యూ ఆఫ్ ఇంటర్ ఆపరెబిలిటీ” అనే రిపోర్ట్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ సుమారు 60 శాతం వాటా పొందింది. భారత్లో యూపీఐ 85 శాతం డిజిటల్ చెల్లింపులకు ఉపయోగపడుతోంది. ఇది వీసా కంటే ముందుకు వెళ్లిందని ఆ రిపోర్ట్ చెబుతోంది. ఈ వ్యవస్థ దీర్ఘకాలం నడవాలంటే, ఆ ఖర్చును వ్యక్తిగతంగా అయినా, గుంపుగా అయినా భరించాలి. అదే ముఖ్యమైన విషయం అని మల్హోత్రా వెల్లడించారు. ఛార్జీలు సంగతి రానున్న రోజుల్లో తెలియనుంది. అసలు ఈ ఛార్జీలు ఎవరిపై ఉంటాయి, ఎంత మొత్తంలో ఉంటాయనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.
READ MORE: Jr NTR: నెపోటిజంపై ఎన్టీఆర్ సంచలనం.. నేను అలాంటోడిని కాదు!
తాజావార్తలు
-
Mosquito Repellent Study: షాకింగ్.. స్ప్రే వాసనకు పారిపోవడం కాదు.. ఆకర్షితమవుతున్న దోమలు..!
-
Peddi Ticket Price Hike: తెలంగాణాలో ‘పెద్ది’ టికెట్ ధరలు పెరగనట్లేనా..? హైకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్న మూవీ టీమ్..!
-
Vaibhav Sooryavanshi: ఒకే వారంలో క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్ రికార్డులు బ్రేక్.. ఐపీఎల్లో వైభవ్ ఆల్టైమ్ హిస్టరీ..
-
Secret Wedding: ఎంపీ మాజీ భార్యను వివాహం చేసుకున్న బీజేపీ నేత.. అక్కడ సీక్రెట్ వెడ్డింగ్.!
-
Shubman Gill: ‘అతని చేతికి నేనే టేప్ వేయాలేమో’.. సుదర్శన్ హిట్ వికెట్పై కెప్టెన్ గిల్ రియాక్షన్
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..