Dharmendra Pradhan: విద్యార్థి రాజకీయాల నుంచి విద్యాశాఖ మంత్రిగా రాజీనామా వరకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmendra Pradhan: నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోడీకి పంపించారు. యువత భవిష్యత్తు కేసుల్లో చిక్కుకోవద్దని, హింసకు పాల్పడొద్దనే ఉద్దేశంతోనే తాను రాజీనామా చేసినట్లు వెల్లడించారు. తాను బాధ్యతల నుంచి ఎప్పుడూ పారిపోలేదని చెబుతూనే, తనకు అవకాశం కల్పించిన ప్రధాని మోడీకి, మంత్రి వర్గ సభ్యులకు థాంక్స్ చెప్పారు. సంఘ విద్రోహ శక్తులు ఉద్యమంలోకి రావొద్దనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
విద్యార్థి రాజకీయాల నుంచి కేంద్ర మంత్రి వరకు..
ధర్మేంద్ర ప్రధాన్ దేశంలోని సీనియర్ బీజేపీ నేతల్లో ఒకరు. గతంలో ఆయన పెట్రోలియం మరియు సహజవాయువు, ఉక్కు మంత్విత్వ శాఖలకు మంత్రిగా పనిచేశారు. ఒడిశా రాజకీయాల నుంచి వచ్చిన ప్రధాన్, ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కీలక భూమిక పోషించారు.
Also Read
- Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
- Explainer: ఆ నగరాలు మునిగిపోతున్నాయి..! UN నివేదికలో షాకింగ్ నిజాలు!
- Teachers Day 2026: ఉపాధ్యాయులతో ప్రధాని మోడీ సంభాషణ.. టీచర్స్ డే సందర్భంగా కీలక సందేశం
- Chirag Paswan: జంతర్ మంతర్ దాడి కేసులో ట్విస్ట్.. భరద్వాజ్పై FIRకు చిరాగ్ పాశ్వాన్ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ 1969 జూన్ 26న ఒడిశాలోని తాల్చేర్లో జన్మించారు. ఆయన తండ్రి డాక్టర్ దేబేంద్ర ప్రధాన్ మాజీ కేంద్ర మంత్రి. వాజ్పేయి మంత్రివర్గంలో పనిచేశారు. ధర్మేంద్ర ప్రధాన్ ప్రాథమిక విద్యను ఒడిశాలోనే పూర్తిచేశారు. ఉత్కల్ యూనివర్సిటీ నుంచి ఆంత్రోపాలజీలో ఎంఏ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే ఆయన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో చేరి రాజకీయాల్లో అడుగుపెట్టారు. దీని తర్వాత భారతీయ జనతా యువ మోర్చా (BJYM)లో వివిధ పదవులు నిర్వహిస్తూ జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
2000లో తొలిసారి ఒడిశా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు. 2004లో లోక్సభ సభ్యుడిగా గెలిచి, పార్లమెంట్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఒడిశాలోని సంబల్పూర్ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తు్న్నారు.
కేంద్ర ప్రభుత్వంలో ధర్మేంద్ర ప్రధాన్ పలు కీలక శాఖలకు నాయకత్వం వహించారు. పెట్రోలియం మరియు సహజ వాయువు, ఉక్కు, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత శాఖల్లో మంత్రిగా పనిచేశారు. జూలై 2021లో కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు చేపట్టి సుమారు ఐదేళ్లపాటు ఆ శాఖను నిర్వహించారు.
మొత్తం ఆస్తులు రూ. 6.92 కోట్లు..
ధర్మేంద్ర ప్రధాన్ 2024 లోక్సభ ఎన్నికల సమయంలో తన ఆస్తులను ఎన్నికల సంఘానికి వెల్లడించారు. ఆ సమయంలో దాఖలు చేసిన అధికారిక అఫిడవిట్ ప్రకారం.. ఆయన, ఆయన కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ. 6.92 కోట్లు. రూ.2.30 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని తెలిపారు. ఆయనకు, ఆయన కుటుంబసభ్యులకు బ్యాంక్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, పీపీఎఫ్లలో రూ. 2.47 కోట్లు, మ్యూచువల్ ఫండ్స్లో రూ. 80.40 లక్షలు, జీవిత బీమా పాలసీల్లో రూ. 67.72 లక్షల పెట్టుబడులు ఉన్నాయి.
తాజావార్తలు
-
Lenovo Yoga Tab Plus Gen 2: 12,700mAh బ్యాటరీ.. 4K 144Hz డిస్ప్లే.. లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ జెన్ 2 వచ్చేసింది
-
Hanuman Ansh Singer: ఒక్క పాటతో అంధ గాయకుడి లైఫ్ టర్న్.. బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు..
-
Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
-
Revanth Reddy: తెలంగాణలో ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్.. కాంగ్రెస్ శ్రేణులకు కీలక సూచనలు!
-
Dengue Insurance Claim: ‘డెంగ్యూ సీరియస్ కాదట’.. ప్లేట్లెట్స్ 70 వేల కంటే తగ్గలేదంటూ మెడిక్లెయిమ్ రిజెక్ట్?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!