Petrol and Diesel Prices: ఎన్నికల ముందు గుడ్న్యూస్.. మరోసారి భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశాలున్నాయి.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల నుంచి వాహనాదారులకు ఉపశమనం కలిగిస్తూ.. ఈ ఏడాది మే నెలలో పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది కేంద్రం.. లీటర్ పెట్రోల్పై రూ.8, డీజిల్పై రూ.6 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది.. ఇది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న పరిణామం.. అంతేకాదు.. త దీపావళి అనంతరం పెట్రో ధరలు తగ్గించడం ఇదే తొలిసారి. అప్పట్లో కేంద్రం లీటర్ పెట్రోల్పై రూ.5, లీటర్ డీజిల్ పై రూ.10 చొప్పున తగ్గించింది. అంతుకు ముందు.. లీటర్ పెట్రోల్పై రూ.5, లీటర్ డీజిల్ పై రూ.10 చొప్పున తగ్గించిన విషయం విదితమే.. అయితే, మరోసారి భారీగా పెట్రో ధరలు తగ్గుతాయనే చర్చ సాగుతోంది.. ఈ సారి పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ. 2 వరకు తగ్గింపు ఉండవచ్చు అనే ప్రచారం సాగుతోంది..
Read Also: YS Jagan Mohan Reddy: టీడీపీ గెలిచిన అసెంబ్లీ స్థానాలపై సీఎం జగన్ ఫోకస్
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
అయితే, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. భారత్లోనూ ఈ మధ్య పెట్రో ధరల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకున్నది కూడా లేదు.. అయితే, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే రాబోతున్నాయి.. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి తగ్గించే అవకాశం ఉందంటున్నారు.. మరోవైపు.. ఈ నెల 1వ తేదీన పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయనే ప్రచారం జరిగింది.. కానీ, అలాంటి నిర్ణయాలు ఏవీ తీసుకోలేదు.. మరోవైపు, సోమవారం రాత్రి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.. డీలర్లకు ధరల తగ్గింపుపై నోటిఫై చేసిందని, మళ్లీ మంగళవారం ఉదయం నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిసింది. ఇక, మంగళవారం, బుధవారం రోజుల్లో కూడా ఎలాంటి మార్పులు కనిపించలేదు.. కానీ, త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయనే ప్రచారం మాత్రం సాగుతోంది.. మరోవైపు.. కరోనా మహమ్మారి తర్వాత సాధారణ పరిస్థితులు రావడంతో.. క్రమంగా భారత్లో పెట్రోల్, డీజిల్ డిమాండ్ పెరిగిపోతోంది.. ఇదిలా ఉండగా, దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62గా కొనసాగుతోంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31 కాగా, డీజిల్ ధర రూ.94.27. చెన్నైలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.101.94 కాగా, డీజిల్ ధర రూ.87.89గా ఉంది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇది మరింత ఎక్కువగా ఉన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Makutam Release Date: దర్శకుడిగా విశాల్కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్కు కౌంట్డౌన్!
-
Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్తో వస్తోన్న అల్లు అర్జున్
-
Harish Rao-KTR: “బతుకంతా తెలంగాణది”.. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
-
Trump Marine One: ట్రంప్కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
ట్రెండింగ్
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!