YS Jagan Mohan Reddy: టీడీపీ గెలిచిన అసెంబ్లీ స్థానాలపై సీఎం జగన్ ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఎన్నికల్లో సూపర్ విక్టరీ కొట్టి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.. ఓవైపు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచిన స్థానాలపై ఫోకస్ పెట్టి.. ఎప్పటికప్పుడు.. వెనుకబడిన ఎమ్మెల్యేలకు వార్నింగ్లు ఇస్తూ అప్రమత్తం చేస్తున్న ఆయన.. మరోవైపు ప్రతిపక్ష టీడీపీ గెలిచిన స్థానాలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు.. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంపై కేంద్రీకరించి పనిచేస్తున్నారు.. ఇక, ఇవాళ మండపేట నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం కానున్నారు వైసీపీ అధినేత జగన్.. సాయంత్రం మూడు గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం జరగనుంది.. మండపేట నియోజకవర్గ ఇంఛార్జి తోట త్రిమూర్తులు సహా 60 మంది పార్టీ నేతలు హాజరుకానున్నారు..
Read Also: Tammineni Sitaram: ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖ రాజధాని కావాలి
Also Read
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
అయితే, మండపేట అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టింది.. 2009 ఎన్నికల నుంచి వరుసగా టీడీపీ ఖాతాలోనే ఉంది మండపేట.. కానీ, ఈ సారి ఎలాగైనా వైసీపీ జెండా ఎగరేయాలని పట్టుదలతో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్.. ఈ సమావేశంలో ఆ అసెంబ్లీ నియోజకవర్గ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కాగా, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు గాను 175 స్థానాల్లో విజయం సాధించాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు సీఎం వైఎస్ జగన్.. వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ.. పని విధానంలో వెనుకబడిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Amarnath Yatra 2026: నేటి నుంచి అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. మళ్లీ ఎప్పుడంటే?
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
Article 370: రెండు జాతీయ అవార్డులు గెలిచిన ‘ఆర్టికల్ 370’.. ఏ ఓటీటీలో చూడొచ్చో తెలుసా?
-
Sharwanand : మహాభారతం నేపథ్యంలో నాగబంధం దర్శకుడితో శర్వానంద్..
-
Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!