No Trump Effect: నో ట్రంప్ ఎఫెక్ట్.. లాభాల్లో స్టాక్ మార్కెట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No Trump Effect: రెండ్రోజుల వరుస నష్టాల నుంచి స్టాక్ మార్కెట్ బయటపడింది. ఐటీ, ఫార్మా స్టాక్స్లో కొనుగోళ్ల మద్దుతు కలిసి రావడంతో ఏ ఎఫక్ట్ స్టాక్ మార్కెట్పై పని చేయలేదు. అసలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల బాదుడును దేశీయ మార్కెట్ పెద్దగా పట్టించుకోనేలేదు. ఎందుకంటే ట్రేడ్డీల్లో పైచేయి సాధించడానికి సుంకాల బాదుడు ఒక ఎత్తుగడ అని మార్కెట్ గ్రహించిందని స్టాక్ మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు.
READ MORE: Hyderabad: హైదరాబాద్లో కుండపోత వర్షం.. వచ్చే రెండ్రోల పాటు విస్తారమైన వర్షాలు..!
Also Read
- Nita Ambani: దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీ.. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో తొలి స్థానం
- Cyber Fraud: ఓటీపీ చెప్పకపోయినా డబ్బు పోతుందా? సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నారు
- PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
ఇంట్రాడేలో కనిష్ఠాల నుంచి 800 పాయింట్ల మేర పైకి..
రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న చమురును సాకుగా చూపి భారత్పై సుంకం వడ్డించడంతో మార్కెట్ సూచీలు స్టార్టింగ్లో పెద్ద మొత్తంలో నష్టాలు చవిచూసిన.. డే ఎండింగ్కి వచ్చే సరికి మాత్రం కొనుగోళ్ల మద్దతుతో గట్టిగా పుంజుకొని ఏ ఎఫెక్ట్ తమను ప్రభావితం చేయదని నిరూపించాయి. ముఖ్యంగా ఐటీ, ఫార్మా స్టాక్స్లో కొనుగోళ్ల మద్దుతు నష్టాల నుంచి గట్టెక్కించాయి. టారిఫ్ భయాలతో సెన్సెక్స్ ఉదయం 80,262.98 (క్రితం ముగింపు 80,543.99) పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఆరంభంలో భారీ నష్టాల్లో కొనసాగిన సూచీ.. ఇంట్రాడేలో 79,811.29 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఆఖర్లో భారీగా పుంజుకుని 79.27 పాయింట్ల లాభంతో 80,623.26 వద్ద స్థిరపడింది. నిఫ్టీసైతం 21.95 పాయింట్ల లాభంతో 24,596.15 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 87.69గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎటెర్నల్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ లాభాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్, ట్రెంట్, టాటా మోటార్స్, హిందుస్థాన్ యూనిలీవర్, ఎన్టీపీసీ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 67.30 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 3451 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ట్రంప్ బెదిరింపులను మార్కెట్ పెద్దగా పట్టించుకోలేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సుంకాల బెదిరింపులు అనేవి భారత్ను దారికి తెచ్చుకోవడం, ట్రేడ్డీల్లో పైచేయి సాధించడానికి ట్రంప్ వేస్తున్న ఎత్తుగడ అని ఇప్పటికే మార్కెట్కు అర్థమైందని అంటున్నారు. త్వరలోనే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరొచ్చన్న అంచనాలు ఉన్న కారణంగా మార్కెట్ దీనిపై ఎక్కువ ఆందోళన చెందలేదని అన్నారు. మార్కెట్ లాభాల్లో ముగియడానికి మరో కారణం ట్రెడర్స్కు మన ఎకానమీపై ఉన్న విశ్వాసం అని పేర్కొన్నారు.
READ MORE: Anchor Ravi : బిగ్ బాస్ కు వెళ్తే నాశనమే.. యాంకర్ రవి సంచలనం..
తాజావార్తలు
-
Muzammil Ibrahim: ప్రేమను మొదలుపెట్టింది ఆమెనే, కానీ బ్రేకప్ చేసింది నేనే!.. దీపికా మాజీ ప్రియుడి సంచలన వ్యాఖ్యలు..
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Aamir Khan: పెళ్లి తర్వాత ఆమిర్ ఖాన్ భారీ నిర్ణయం..100 కోట్లకు పైగా ఖర్చుతో కలల ఇంటి నిర్మాణం!
-
Revolt RVX vs Oben Rorr Evo: రివోల్ట్ RVX Vs ఓబెన్ రోర్ ఈవో.. ధర, రేంజ్, స్పీడ్లో ఏ ఎలక్ట్రిక్ బైక్ బెస్ట్?
-
Shreyas Iyer Captaincy: 7 మ్యాచ్ల్లో 6 ఓటములు.. శ్రేయస్ కెప్టెన్సీకి పీడకల లాంటి ఆరంభం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!